బాలయ్య సినిమా మరింత ఆలస్యం

అఖండ సినిమా తరువాత బాలయ్య చేయబోయే సినిమా మీద కాస్త ఆసక్తి వుంది. క్రాక్ సినిమా తరువాత గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ సినిమా ఫిక్స్ అయింది. దీని కాస్ట్ అండ్…

అఖండ సినిమా తరువాత బాలయ్య చేయబోయే సినిమా మీద కాస్త ఆసక్తి వుంది. క్రాక్ సినిమా తరువాత గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ సినిమా ఫిక్స్ అయింది. దీని కాస్ట్ అండ్ క్రూ కూడా అంతా ఫిక్స్ అయింది. 

సినిమా ఓపెనింగ్ జరిగిపోయింది. కానీ షూట్ మాత్రం బిగిన్ కావాల్సి వుంది. బాలయ్య చకచకా సెట్ మీదకు వస్తారని, షూట్ బిగిన్ అవుతుందని వార్తలు కొన్నాళ్ల క్రితం వినవచ్చాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే ఈ సినిమా సెట్ మీదకు వెళ్లడానికి మరి కాస్త టైమ్ పడుతుందన్నది. 

బాలయ్య ఇప్పుడిప్పుడే తన అన్ స్టాపబుల్ చాట్ షో నుంచి ఫ్రీ అయ్యారు. ఆయన పెండింగ్ లో వుంచిన పనులు చాలా వున్నాయని తెలుస్తోంది. 

దాంతో పాటు పలువురికి మాట ఇచ్చిన మేరకు కథలు వినాల్సివుందని తెలుస్తోంది. ఇవన్నీ ఫినిష్ చేసిన తరువాత గోపీచంద్ మలినేని సినిమా సెట్ మీదకు వెళ్తారని బోగట్టా. ఈ సినిమాలో కీలక పాత్ర చేయాల్సిన వరలక్ష్మి శరత్ కుమార్ కు కూడా ఆ మధ్య కరోనా సోకి తగ్గింది. 

ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి సినిమా ను బాలయ్య స్టార్ట్ చేస్తారు.