‘మిస్టర్ సెలెబ్రిటీ’ ట్రైలర్‌.. ఆడియెన్స్‌‌తో దోబూచులాట

సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడమే మేకర్లకు అసలైన పరీక్ష. మూవీ తీయడం ఒకెత్తు అయితే.. తీసిన ఆ చిత్రాన్ని ఆడియెన్స్ వరకు తీసుకెళ్లడం మరొక ఎత్తు. Advertisement వినూత్న ప్రమోషన్స్ చేయడం.. కంటెంట్…

సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడమే మేకర్లకు అసలైన పరీక్ష. మూవీ తీయడం ఒకెత్తు అయితే.. తీసిన ఆ చిత్రాన్ని ఆడియెన్స్ వరకు తీసుకెళ్లడం మరొక ఎత్తు.

వినూత్న ప్రమోషన్స్ చేయడం.. కంటెంట్ గురించి ఆడియెన్స్‌కు చెప్పి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అవసరం. అలానే ఇప్పుడు మిస్టర్ సెలెబ్రిటీ టీం కూడా ఆడియెన్స్‌ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది.

సీనియర్ కథ, మాటల రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే చిత్రం అక్టోబర్ 4న రాబోతోంది. ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మాతలుగా రాబోతోన్న

ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే పాటలు, టీజర్ ఆడియెన్స్‌లో మంచి అంచనాలు పెంచేసింది. టీజర్‌లో విలన్ ఎవరు అన్నది రివీల్ చేయలేదు.

తాజాగా రానా దగ్గుబాటి ఈ మూవీ ట్రైలర్‌‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లోనూ మేకర్లు ఆడియెన్స్‌తో దోబూచులాట ఆడారు. విలన్ ఎవరు అన్నది చూపించలేదు. అసలు ఈ చిత్రం హీరోనే విలనా? విలన్‌గా కనిపించేది హీరోనా? అన్న అనుమానం, ఆసక్తి కలిగించేలా ట్రైలర్‌ను కట్ చేశారు. ఇక ఈ ట్రైలర్‌ను చూస్తే నిర్మాతలు భారీ ఎత్తున నిర్మించినట్టుగా కనిపిస్తోంది.

ఈ మూవీకి వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రే హైలెట్ కానుందనిపిస్తోంది. మరి ఈ చిత్రంతో పరుచూరి సుదర్శన్‌కు మంచి డెబ్యూ దక్కుతుందో లేదో చూడాలి.

4 Replies to “‘మిస్టర్ సెలెబ్రిటీ’ ట్రైలర్‌.. ఆడియెన్స్‌‌తో దోబూచులాట”

Comments are closed.