బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ముఖ్య గమనిక అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు. ఇంతకూ అసలు విషయం ఏంటంటే కృతి సనన్ కరోనాబారిన పడ్డారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్వయంగా కృతి వెల్లడించారు.
కరోనా లక్ష ణాలు కనిపించగానే ఆమె అప్రమత్తమయ్యారు. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ముంబయ్లోని తన ఇంట్లో హోంక్యారంటైన్లో కృతి సనన్ ఉంటున్నారు.
మహేష్ బాబు సరసన 1 – నేనొక్కడినే సినిమాతో నటిగా టాలీవుడ్కు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో జర్నలిస్టు పాత్రను పోషించారామె. ఆ తర్వాత చైతన్యతో దోచెయ్ సినిమాలో నటించారు. ఆ తర్వాత ఆమె బాలీవుడ్లో బిజీ అయ్యారు.
ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాపిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృతి సనన్ ఓ విజ్ఞప్తి చేశారు. అదేంటంటే, ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలనేది స్టార్ హీరోయిన్ ముఖ్య గమనిక సారాంశం.
చండీగడ్లో లుక్కా చుప్పి సినిమా షూటింగ్లో తన షెడ్యూల్ను ముగించుకుని వారం క్రితం ముంబయ్కి కృతి వచ్చారు. అక్కడే కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. కాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలో ‘ఆదిపురుష్’లో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్న విషయం తెలిసిందే.