వివాదాల్లో వ‌ర్మ‌తో పోటీ…పెళ్లిళ్ల‌పై హీరోయిన్ హాట్ కామెంట్స్‌

సినిమాల కంటే వివాదాల‌తోనే హీరోయిన్ మాధ‌వీల‌త పాపుల‌ర్ అయ్యారు. లాక్‌డౌన్‌లో వివిధ అంశాల‌పై ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌దైన శైలిలో స్పందిస్తూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా లాక్‌డౌన్ పెళ్లిళ్ల‌పై కూడా మాధ‌వీల‌త…

సినిమాల కంటే వివాదాల‌తోనే హీరోయిన్ మాధ‌వీల‌త పాపుల‌ర్ అయ్యారు. లాక్‌డౌన్‌లో వివిధ అంశాల‌పై ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌దైన శైలిలో స్పందిస్తూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా లాక్‌డౌన్ పెళ్లిళ్ల‌పై కూడా మాధ‌వీల‌త ఫైర్ అయ్యా రు. దీంతో ఆమె పోస్ట్ హాట్ టాపిక్‌గా మారుతోంది.

లాక్‌డౌన్‌లో ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజ్‌, హీరో నిఖిల్ స‌హా మ‌రికొంద‌రు సినీ సెల‌బ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్న విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్‌లో గుంపులుగా చేరొద్ద‌ని నిబంధ‌న‌లు చెబుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ పెళ్లిళ్లు మాత్రం ఆగ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో హీరోయిన్ మాధ‌వీల‌త సోష‌ల్ మీడియా ముందుకొచ్చి త‌న స్టైల్‌లో స్పందించారు.

‘పెళ్లి ముహూర్తం మ‌ళ్లీ రాదా? ఇప్పుడు కాక‌పోతే మ‌రో ఏడాది. పిల్ల దొర‌క‌దా?  పిల్లోడు మారిపోతాడా?  అలా మారిపోయే మ‌నుషుల‌తో బంధాలు ఎందుకు?  మాస్కుల ముసుగులో పెళ్లి అవ‌స‌ర‌మా?  కొన్నాళ్లు ఆగ‌లేని వాళ్లు సంసారాలు చేస్తారా?’అంటూ మాధవీలత పోస్ట్ చేశారు .  

చివ‌ర‌లో ‘నా పోస్ట్ నా ఇష్టం. నా ఓపినియ‌న్ నా ఇష్టం. నా భావాల‌ను చెప్పే హ‌క్కు నాకుంది’ అంటూ మాధ‌వీల‌త ప్ర‌క‌టించారు. మాధ‌వీల‌త పోస్టుల‌ను గ‌మ‌నిస్తే వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు వ‌ర్మ‌ను గుర్తు చేస్తున్నారు. వ‌ర్మ కూడా ‘నా ఇష్టం‘ అంటూ ఓ పుస్త‌క‌మే రాసి ప‌డేశారు.  సినీ సెల‌బ్రిటీల‌లో  వ‌ర్మ లాగా ఎప్పుడూ వివాదాల‌ను ఇష్ట‌ప‌డే హీరోయిన్లు ఉన్నార‌నే విష‌యం మాధ‌వీల‌త హాట్ కామెంట్స్‌తో తెలిసొస్తోంది. 

విద్యుత్‌ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం