సమంత… వాడుకున్నోళ్లకి వాడుకున్నంత..!

సమంత విషయంలో తెలుగు మీడియా, సోషల్ మీడియా ఎంత దారుణంగా ఆలోచిస్తున్నాయో ఆ టైటిల్స్ చూస్తేనే అర్థమైపోతుంది. ఎన్టీఆర్ కి సమంతకు ఫిక్స్ అయింది.. మహూర్తం నెలాఖర్లో అంటూ నోటికొచ్చిన టైటిల్స్ పెడుతున్నారు.  Advertisement…

సమంత విషయంలో తెలుగు మీడియా, సోషల్ మీడియా ఎంత దారుణంగా ఆలోచిస్తున్నాయో ఆ టైటిల్స్ చూస్తేనే అర్థమైపోతుంది. ఎన్టీఆర్ కి సమంతకు ఫిక్స్ అయింది.. మహూర్తం నెలాఖర్లో అంటూ నోటికొచ్చిన టైటిల్స్ పెడుతున్నారు. 

ఆడియన్స్ లో క్యూరియాసిటీ కోసం ఇలా డబుల్ మీనింగ్ డైలాగుల్ని థంబ్ నెయిల్స్ గా పెట్టి ఆటాడేసుకుంటున్నారు. మీలో ఎవరు కోటీశ్వరులు కార్యక్రమానికి సమంత వస్తుందంటూ జరుగుతున్న ప్రచారానికి ఇది పరాకాష్ట. ఇక మిగతా విషయాల్లో కూడా సమంత ప్రెగ్నెన్సీని అడ్డు పెట్టుకుని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది ముమ్మాటికీ భ్రూణ హత్యే..

ఆమధ్య మాధవీలత, సమంత ప్రెగ్నెన్సీ విషయంలో చేసిన కామెంట్స్ రచ్చ రచ్చ అయ్యాయి. ఇక ఆమె స్టేట్ మెంట్లను అడ్డం పెట్టుకుని సోషల్ మీడియా సమంత పరువు తీసింది. ఆ తర్వాత శాకుంతలం నిర్మాత, దర్శకుడు గుణశేఖర్ కుమార్తె నీలిమ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ కూడా మరింత సంచలనంగా మారింది. 

శాకుంతలం సినిమా షూటింగ్ సమయానికి సమంత తల్లి కావాలనే ఆలోచనతో ఉన్నదని, అందుకే చకచకా షూటింగ్ కంప్లీట్ చేయాలని చెప్పిందని, ఆమెకు పిల్లలంటే ఇష్టమని చెప్పుకొచ్చింది నీలిమ. ఈ స్టేట్ మెంట్ అడ్డం పెట్టుకుని సమంత ప్రెగ్నెన్సీ పై రకరకాల గాసిప్పులు పుట్టుకొచ్చాయి.

అసలు ఉందో లేదో తెలియని సమంత ప్రెగ్నెన్సీ గురించి లెక్కలేనన్ని వార్తలొచ్చాయి. భ్రూణ హత్య మహా  పాపం అని స్కానింగ్ సెంటర్ల వద్ద బోర్డులు మనం చూస్తుంటాం.. నిజంగా సోషల్ మీడియాలో జరిగిన ఈ భ్రూణ హత్య అంతకంటే మరీ దారుణం. కేవలం వ్యూస్ కోసమే సమంతను నడిబజార్లో నిలబెట్టారు.

నోరు విప్పకపోవడమే తప్పా..?

గతంలో విడాకులపై వార్తలొచ్చినప్పుడు సమంత కానీ, అక్కినేని కుటుంబం కానీ ఎక్కడా నోరు విప్పలేదు, ఆ తర్వాత ఓ స్టేట్ మెంట్ ఇచ్చి సైలెంట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఇప్పుడు మరీ దారుణంగా కామెంట్లు పడ్డంతో.. సమంత మరోసారి సోషల్ మీడియాలోకి వచ్చింది. హుందాగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

అయినప్పటికీ సమంత-నాగచైతన్య ఇష్యూను సోషల్ మీడియా అరగదీస్తూనే ఉంది. దానికి సిద్ధార్థ్, ప్రీతమ్.. లాంటి వ్యక్తులు ఇంకా ఆజ్యం పోస్తూనే ఉన్నారు. మరోసారి సమంత దీనిపై స్పందించినా, నాగచైతన్య రియాక్ట్ అయినా పుకార్లు మరింతగా పెరుగుతాయే తప్ప తగ్గవు. కాబట్టి ఈ వ్యవహారంపై ఎంత గుంభనంగా ఉంటే అంత మంచిది. ప్రస్తుతం నాగచైతన్య, సమంత చేస్తోంది అదే.