Advertisement

Advertisement


Home > Movies - Movie News

పవన్ కల్యాణ్ ను నేను అడగలేదు: నిత్యామీనన్

పవన్ కల్యాణ్ ను నేను అడగలేదు: నిత్యామీనన్

పవన్ కల్యాణ్ సరసన భీమ్లానాయక్ సినిమా చేస్తోంది నిత్యామీనన్. ప్రారంభంలో సాయిపల్లవిని అనుకున్నారు. ఆ తర్వాత మరో 2-3 పేర్లు తెరపైకొచ్చాయి. చివరికి ఆ పాత్ర కోసం నిత్యామీనన్ ను తీసుకున్నారు. ఈ క్రమంలో నిత్యామీనన్ కోరి మరీ ఈ ప్రాజెక్టులోకి వచ్చినట్టు ప్రచారం జరిగింది. దీనిపై నిత్యామీనన్ స్పందించింది.

"నేను పాత్రల కోసం ఎవ్వర్నీ ఏమీ అడగను. నాకు ఎలాంటి పాత్రలు సూట్ అవుతాయో, నేను ఎలాంటి క్యారెక్టర్లు అంగీకరిస్తానో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అలాంటి పాత్రలతోనే నా దగ్గరకు వస్తారు. స్కైలాబ్ క్యారెక్టర్ కూడా నేరుగా నా దగ్గరకొచ్చింది. భీమ్లానాయక్ లో క్యారెక్టర్ కూడా నేను చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ ఫీలయ్యారు."

భీమ్లానాయక్ సినిమాను పవన్ కోసం చేయలేదని, త్రివిక్రమ్ కోరడం వల్లనే చేశానని పరోక్షంగా చెప్పుకొచ్చింది నిత్యామీనన్. భీమ్లానాయక్ ఒరిజినల్ వెర్షన్ అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీని చూడలేదని, తన స్టయిల్ లో భీమ్లానాయక్ లో నటించానని చెప్పుకొచ్చింది.

"త్రివిక్రమ్ ఎప్పుడూ నన్ను ఓ రౌడీలా చూస్తారు. నాలో ఓ మంచి అమ్మాయిని త్రివిక్రమ్ ఎప్పుడూ చూడరు. సన్నాఫ్ సత్యమూర్తిలో కూడా నాది రౌడీ పాత్ర. భీమ్లానాయక్ లో కూడా అలాంటి రౌడీ పాత్రే. సినిమాలో నాకు మంచి పంచ్ ఉన్న డైలాగ్స్ ఇచ్చారు. త్రివిక్రమ్ అడిగితే నేను కాదనను. భీమ్లానాయక్ కోసం కూడా ఆయనే అడిగారు. పవర్ ఫుల్ పాత్ర ఉంది, పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయి చేస్తావా అని అడిగారు, వెంటనే ఒప్పుకున్నాను."

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం తన టార్గెట్ కాదంటోంది నిత్యామీనన్. క్యారెక్టర్ తనను కదిలించినప్పుడు మాత్రమే చేస్తానని, అలాంటి పాత్రలు ఏ భాషలో దొరికితే ఆ భాషలో నటిస్తానని చెప్పుకొచ్చింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?