ముగిసిన గడువు.. విచారణకు రాని రాజ్ తరుణ్

తనను ప్రేమించి, పెళ్లి చేసుకొని వదిలేశాడంటూ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. సంచలనంగా మారిన ఈ వివాదానికి సంబంధించి హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు…

తనను ప్రేమించి, పెళ్లి చేసుకొని వదిలేశాడంటూ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. సంచలనంగా మారిన ఈ వివాదానికి సంబంధించి హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు రావాల్సిందిగా రాజ్ తరుణ్ కు నోటీసులు కూడా పంపించారు.

ఆ విచారణ గడువు ఇవాళ్టితో ముగిసింది. రాజ్ తరుణ్ మాత్రం విచారణకు హాజరుకాలేదు. రాజ్ తరుణ్ తరఫు లాయర్ నార్సింగి పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. బిజీ షెడ్యూల్స్ కారణంగా తమ క్లయింట్ విచారణకు రాలేకపోయారని, మరికొన్ని రోజులు గడువు కావాలంటూ పోలీసులకు లేఖ అందించారు.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడట రాజ్ తరుణ్. ఓ సినిమా విడుదలకు సిద్ధంగా ఉందంట. ఆ సినిమా ప్రచారంతో పాటు, మిగతా సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న కారణంగా ఇప్పట్లో విచారణకు హాజరుకాలేనని, మరో రోజు తప్పకుండా ఎంక్వయిరీకి వస్తానని లేఖలో పేర్కొన్నాడు రాజ్ తరుణ్.

చట్టప్రకారం, పోలీసులు ఈ లేఖను ఆమోదించారు. రేపు లేదా ఎల్లుండి మరోసారి రాజ్ తరుణ్ కు నోటీసులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రెండోసారి ఇవ్వబోయే నోటీసులకు రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

ప్రముఖుల్ని కలిసే పనిలో లావణ్య…

మరోవైపు లావణ్య ఈ విషయాన్ని పలువురు రాజకీయ, సినీ పెద్దల దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఉంది. తన లాయర్ సహాయంతో ఆమె పలువురు కాంగ్రెస్ నేతల్ని కలిసేందుకు ప్రయత్నిస్తోంది. అటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్దల్ని కూడా కలిసేందుకు రెడీ అవుతోంది. వీళ్లలో ఎంతమంది తనను కలుస్తారు, ఏ మేరకు హామీ ఇస్తారనే అంశాల్ని దృష్టిలో పెట్టుకొని తదుపరి కార్యాచరణకు సిద్ధమౌతుంది లావణ్య. అటు రాజ్ తరుణ్ మాత్రం బయట కనిపించడం మానేశాడు.