వ్యూహం.. శపథం.. వ‌ర్మ!

నిన్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో స‌మావేశం అయిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఇవాళ త‌న త‌దుప‌రి సినిమాను ప్ర‌క‌టించారు. ట్వీట్ట‌ర్ వేదిక‌గా రాజ‌కీయాల‌కు సంబంధించి సినిమా ఉండ‌బోతున్న‌ట్లు తెలిపారు. …

నిన్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో స‌మావేశం అయిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఇవాళ త‌న త‌దుప‌రి సినిమాను ప్ర‌క‌టించారు. ట్వీట్ట‌ర్ వేదిక‌గా రాజ‌కీయాల‌కు సంబంధించి సినిమా ఉండ‌బోతున్న‌ట్లు తెలిపారు. 

ఇవాళ ట్వీట్ట‌ర్ వేదిక‌గా ' నేను అతి త్వరలో  “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను ..ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కధ, రాజకీయ కుట్రల విషం తో నిండి వుంటుంది. 

ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది .. మొదటి పార్ట్ “వ్యూహం”,2nd పార్ట్ “శపథం” .. రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే  వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “ లో తగులుతుంది .

రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి  ప్రతికాష్టే  “వ్యూహం” చిత్రం. “వ్యూహం” చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్. ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ,ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు'. అంటూ రాసుకోచ్చారు.

ఎవ‌రికి ఎటువంటి సందేహం లేకుండా సినిమా ఎలా ఉండ‌బోతుందో పూర్తి క్లారిటి ఇచ్చారు. మ‌రి సినిమా త‌ర్వాత ఎటువంటి రాజ‌కీయ ప‌రిణామాలు జ‌ర‌గ‌బోతున్నాయి అనేది వెయిట్ చేయాక‌త‌ప్ప‌దు.