Advertisement

Advertisement


Home > Movies - Movie News

దేవరకొండ సరసన మమిత? భాగ్యశ్రీ బోర్సే?

దేవరకొండ సరసన మమిత? భాగ్యశ్రీ బోర్సే?

ప్రేమలు హీరోయిన్ మమిత బైజు ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్. కుర్రకారు గుండెలకు సరికొత్త గేలం. తెలుగులో చకచకా ఆఫర్లు వస్తాయని అంతా అనుకున్నట్లే వుంది ఇప్పుడు పరిస్థితి.

ప్రస్తుతానికి ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను పట్టేసింది. గౌతమ్ తిన్ననూరి- విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో సితార సంస్థ నిర్మిస్తున్న సినిమాకు మమితను హీరోయిన్ గా అనుకుంటున్నారు. ఇప్పటికి ఓసారి ప్రైమరీ డిస్కషన్లు జరిగాయి. ఫైనల్ డెసిషన్ పెండింగ్ లో వుంది.

ఇదిలా వుంటే ఇదే సినిమాకు భాగ్యశ్రీ బోర్సె పేరు కూడా పరిశీలిస్తున్నారు. ఈ సినిమాకు ఆరంభంలో శ్రీలీలను అనుకున్నారు. కానీ తరువాత మరెందుకు నిర్ణయం మారింది. కాస్త ఇంటిమసీ సీన్లు వుండడం వల్ల శ్రీలీల స్వచ్ఛందంగానే తప్పుకుందని టాక్ వుంది. ఈ సినిమాను రెండు భాగాల్లో నిర్మిస్తారని, భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటుందని తెలుస్తోంది.

జెర్సీ తరువాత మళ్లీ అదే బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి చేస్తున్న సినిమా ఇది. మే లో ప్రారంభవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?