Advertisement

Advertisement


Home > Movies - Press Releases

సైకలాజికల్ థ్రిల్లర్ 'అర్థం'

సైకలాజికల్ థ్రిల్లర్ 'అర్థం'

అజయ్, శ్రద్ధా దాస్, ఆమని ప్రధాన తారలుగా రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'అర్థం'. ఈ చిత్రానికి రాధికా శ్రీనివాస్ నిర్మాత.

ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసిన మణికాంత్ తెల్లగూటి రచయిత, దర్శకుడు. 'దేవి', 'పెదరాయుడు' చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర, రామ్ గోపాల్ వర్మ 'మర్డర్'లో కథానాయికగా నటించిన సాహితీ అవంచ, నటుడిగా మారిన దర్శకుడు దేవి ప్రసాద్, తమిళ హిట్ చిత్రం 'వడ చెన్నై'లో ప్రతినాయకులుగా నటించిన సాయి దీనా, వాసు విక్రమ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

'అర్థం' చిత్రీకరణ దాదాపుగా 50 శాతం పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత రాధికా శ్రీనివాస్ మాట్లాడుతూ "ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథాంశంతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. దాదాపుగా సగం సినిమా పూర్తయింది. త్వరలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం. 

దర్శకుడు మణికాంత్ తెల్లగూటి మాట్లాడుతూ "కుటుంబ విలువలను కాపాడే, మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న సినిమా - 'అర్థం'. సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాకి వినోదం మేళవించి ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నాం.  అత్యుత్తమ నిర్మాణ విలువలతో సినిమా రూపొందుతోంది" అని అన్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?