కూట‌మి స‌ర్కార్‌కు ప్ర‌మాద ఘంటిక‌లు!

టీడీపీ, జ‌న‌సేన బ‌ల‌ప‌రిచిన ర‌ఘువ‌ర్మ‌ను ఓడించాల‌నే ప‌ట్టుద‌ల‌తోనే పీఆర్‌టీయూ అభ్య‌ర్థి గాదె శ్రీ‌నివాసులునాయుడికి టీచ‌ర్లు అండ‌గా నిలిచారు.

కూట‌మి ప్ర‌భుత్వంపై ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. అంతేకాదు, ఇత‌ర ప్ర‌భుత్వ‌శాఖ‌ల ఉద్యోగుల్లో కూడా అప్పుడే అసంతృప్తి ఏర్ప‌డింది. ఉత్త‌రాంధ్ర టీచ‌ర్స్ ఎమ్మెల్సీలో కూట‌మి అభ్య‌ర్థి ర‌ఘువ‌ర్మ ఓడిపోవ‌డం స‌ర్కార్‌పై ముమ్మాటికీ ప్ర‌మాద ఘంటిక‌లు మోగించ‌డ‌మే అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. పీఆర్‌టీయూ అభ్య‌ర్థి గాదె శ్రీ‌నివాసులునాయుడికి బీజేపీ మ‌ద్ద‌తు ఇచ్చిన‌ప్ప‌టికీ, అది ఆ పార్టీ విజ‌యంగా చూడ‌లేం. ఎందుకంటే, బీజేపీకి పీఆర్‌టీయూ అనుబంధ ఉపాధ్యాయ సంఘం కానేకాదు.

టీడీపీ, జ‌న‌సేన బ‌ల‌ప‌రిచిన ర‌ఘువ‌ర్మ‌ను ఓడించాల‌నే ప‌ట్టుద‌ల‌తోనే పీఆర్‌టీయూ అభ్య‌ర్థి గాదె శ్రీ‌నివాసులునాయుడికి టీచ‌ర్లు అండ‌గా నిలిచారు. కూట‌మి స‌ర్కార్‌పై త‌మ వ్య‌తిరేక‌త‌ను టీచ‌ర్ల ఉత్త‌రాంధ్రలో అధికార పార్టీలు బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థిని ఓడించ‌డం ద్వారా స్ప‌ష్టంగా చాటి చెప్పారు.

తెలంగాణలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటిలో ఒక‌టి బీజేపీ, మ‌రొక‌టి పీఆర్‌టీయూ సొంతం చేసుకున్నాయి. క‌రీంన‌గ‌ర్‌-మెద‌క్‌-నిజామాబాద్- ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ అభ్య‌ర్థి మ‌ల్క కొముర‌య్య మొద‌టి ప్రాధాన్యత ఓట్ల‌తోనే గెలుపొందారు. వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం-న‌ల్గొండ టీచ‌ర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని పీఆర్‌టీయూ అభ్య‌ర్థి శ్రీ‌పాల్‌రెడ్డి రెండో ప్రాధాన్యం ఓట్ల‌తో విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఇక్క‌డ‌ బీజేపీ అభ్య‌ర్థి స‌రోత్తంరెడ్డిపై పీఆర్‌టీయూ అభ్య‌ర్థి గెలుపొందడాన్ని గ‌మ‌నంలో పెట్టుకోవాలి.

ఉత్త‌రాంధ్ర‌కు వ‌చ్చేస‌రికి సిటింగ్ ఎమ్మెల్సీ ర‌ఘువ‌ర్మ అభ్య‌ర్థిత్వంపై బీజేపీ వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేసింది. బీజేపీ వ్య‌తిరేక‌త‌ను టీడీపీ, జ‌న‌సేన ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. దీంతో అనివార్యంగా పీఆర్‌టీయూ అభ్య‌ర్థికి బీజేపీ మ‌ద్ద‌తు తెలిపింది. ఎందుకంటే సిద్ధాంత‌ప‌రంగా సీపీఎం అనుబంధ ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్‌కు బీజేపీ మ‌ద్ద‌తు ఇవ్వ‌లేని ప‌రిస్థితి. అందుకే పీఆర్‌టీయూ అభ్య‌ర్థి గాదె శ్రీ‌నివాసులు విజ‌యాన్ని బీజేపీ ఖాతాలో కూడా వేయ‌లేం. ఇదే విష‌యాన్ని గాదె కూడా చెప్ప‌డం విశేషం. త‌న విజ‌యం ఉపాధ్యాయుల‌కే ద‌క్కుతుంద‌ని ఆయ‌న ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

ఇంకా తొమ్మిది నెల‌ల పాల‌న కూడా పూర్తి చేసుకోకుండానే, ఉద్యోగ‌-ఉపాధ్యాయుల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. గ‌తంలో జ‌గ‌న్ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా వీళ్లే మొద‌ట గ‌ళం విప్పారు. వైసీపీ ప్ర‌భుత్వం ఘోరంగా ఓడిపోవ‌డానికి ఈ వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త రావ‌డం ప్ర‌ధాన కార‌ణ‌మైంది. ఇప్పుడు కేవ‌లం తొమ్మిది నెల‌ల్లోపే పూర్తి రివ‌ర్స్‌లో స‌ర్కార్‌పై క‌న్నెర్ర చేయ‌డం ఆలోచింప‌చేస్తోంది.

27 Replies to “కూట‌మి స‌ర్కార్‌కు ప్ర‌మాద ఘంటిక‌లు!”

    1. జనాలకు జగన్ రెడ్డి పట్ల మూడు పోయింది.. అందుకే మూడో స్థానం ఇచ్చారు..

      ఇది జగన్ రెడ్డి కి పాజిటివ్.. కూటమికి నెగటివ్ అని చదువుకోవాలి మనం..

  1. ఇంత వ్యతిరేకత ఉంది కదా 11 సీట్లు 4 ఎంపీ లు రాజీనామా చేసేయండి.. ఉప ఎన్నికలు వస్తాయి అప్పుడు పోటీ చేసి కూటమి అభ్యర్థులు డిపాజిట్ లు గల్లంతు చేసి జమిలి కి రెడీ గా ఉందాం…

  2. ప్రతిపక్ష హోదా కోసం ఇక NO ఆడుక్కోవడాల్

    టీచర్స్MLC ఓడిపోయన చంద్రబాబు వెంటనే రాజీనామా చెయ్యాలని మావోడు నిరాహారదీక్ష చేసి, అవసరమైతే EC బట్టలుప్పి ఎలక్షన్స్ డిమాండ్ పెట్టి డైరెక్ట్ గా సీఎం ఔపోవడమే ఇక..

  3. కూటమి పైన వ్యతిరేకత ఉంటె.. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో భారీ మెజారిటీ లి ఎందుకు వస్తున్నాయి.. ఆ విషయం మాట మాత్రం మాటలాడటం లేదెందుకో మరి..?

    నిజం గా కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటె..

    2019 లో ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలందరూ రాజీనామా చేసిన చరిత్ర ఉంది..

    ఇప్పుడు..

    ప్రతిపక్ష హోదా కోసం.. వైసీపీ ఎమ్మెల్యే లందరూ రాజీనామా చేసి.. ప్రజల తీర్పు కోరండి..

    కూటమి కి బుద్ధి చెప్పండి..

    ..

    మ్యాగీ నూడుల్స్ కలిపేలోపు అసెంబ్లీ గోడ దూకి పారిపోయాడు.. మీకెందుకు రాజకీయాలు..

  4. ఈ టీచర్ల MLC లొ ఎక్కువగా వామపక్ష అనుబంద యూనియన్ ల కాండెట్లె గలెవటం అనవాయితీ. ఎందుకంటె వారు అవసం అయితె ప్రభుత్వ విధానాల మీద కూదా పొరాడాలి!

    .

    అయితె ఈసారి అలా కూడా జరగలెదు! BJP సమర్దించిన క్యాండెట్ గెలిచాడు! వామపక్షాలు, ఆ యూనియన్లు సమర్దించె అభ్యర్దులనె Y.-.C.-.P కూడా సమర్దిస్తుంది అని చెప్పవ్. మరి వారికి 3 వ స్తానం వచ్చింది.

    .

    లాజిక్ లెకపొయినా కాసెపు నువ్వు అనుకున్నదె నిజం అనుకుందాం. మొత్తం ఉత్తరంద్రలొ టీచర్ల MLC కి పొలయిన వొట్లు 20 వెలు. ఈ 20 వెల వొట్లతొ మూతం ఉత్తరాంద్ర సరళి అర్ధం అవుతుందా? ఈ మాత్రం దానికె ప్రమాద గంటికలా?

    1. టీవీ లో సభలకి వొచ్చే TRP రేటింగ్స్ చూసి ఎన్ని స్థానాలు గెలుస్తారో రాసాడు ఒక్కప్పుడు .. వెంకట్ రావు గారికి ఇప్పుడు ఒకటే టాస్క్ .. కూటమి పని అయిపొయింది .. అని ప్రచారం చేయడం మాత్రమే ..

  5. A pakalapati gatha palanalo ey paakalo durado kuda evariki theliyaka asalu unnado ledo anumanamtho undevaru teachers kavuna alanti vadu ela gelustaru. Vadiki vochhinavi kootami balaparchadam valane lekapothe manavadinki mudava place

  6. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు పీడీఎఫ్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావును బలపర్చాయి. వైసీపీ పోటీకి దూరంగా ఉండటంతో పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతు తెలిపింది.

    .

    వాస్తవానికి కెఎస్ లక్ష్మణరావు బలమైన అభ్యర్థి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆయన గ్రాడ్యుయేట్లు, టీచర్లకు సుపరిచితులు. పోటీపరీక్షలకు శిక్షణ ఇవ్వడంతో కృష్ణా, గుంటూరు టీచర్స్ ఎమ్మెల్సీగా ఒకసారి, పట్టభద్రుల స్థానం నుంచి ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచారు.

    .

    ప్రజల్లో వైసీపీపై ఉన్న వ్యతిరేకత లక్ష్మణరావుకు నష్టం కలిగించిందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రచారం కారణంగా కూటమి అభ్యర్థి Alapati Rajendra Prasad మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఘన విజయం సాధించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  7. ఆలపాటి ఓడితే నాదెండ్ల పుణ్యమే!

    ఆలపాటి విజయానికి ధూళిపాళ్ల గండం!

    ఆల‌పాటికి వ్య‌తిరేకంగా కాపుల తీర్మానం!

    ఆలపాటి కి గెలుపు అంత వీజీయేం కాదు

    .

    ఇవి నువ్వు మొరిగిన ఆర్టికల్స్. నువ్వు కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అబ్యర్ది ఆలపాటి రాజెంద్ర ప్రసాద్ ఒడిపొతున్నాడు అన్నట్టు రాసి తెగ సంబరపడ్డ ఆర్టికల్స్! ఒకసారి వెళ్ళి ఎమి మొరిగావొ చూసుకొ!

    ప్రత్యర్ది కెఎస్ లక్ష్మణరావు బలమైన అభ్యర్థి. అయితె కూటమి అబ్యర్ది భారీ మెజారిటీతొ గెలిచాడు! వైసీపీ ప్రచారం కారణంగా అయన గొరంగా ఒడిపొయాడు అని టాక్!

    1. 7వ రౌండ్ కి వచ్చిన మెజారిటి 82320

      ఆలపాటి – 145057

      లక్ష్మణరావు – 62737

      మెజారిటి 82320

    2. 7వ రౌండ్ కి వచ్చిన మెజారిటి 82,320

      ఆలపాటి – 1,45,057

      లక్ష్మణరావు – 62,737

      మెజారిటి 82,320

    3. telugu.greatandhra.com/politics/andhra-news/not-easy-to-alapati-rajendra.html

      telugu.greatandhra.com/politics/gossip/kapu-leaders-decision-against-to-alapti.html

      telugu.greatandhra.com/politics/andhra-news/alapati-rajendra-prasad-vs-dhulipalla-narendra-kumar.html

      telugu.greatandhra.com/politics/andhra-news/nadendla-manohar-plan-on-alapati-rajendra-prasad.html

  8. alaage samthrupthi padaraa nayanaa. krishna guntur jillalalo YCP balaparachina lakshmanarao tholisaari YCP punyamaa ani 80000 pai chiluku otla theda tho odipoyaadu. pichha sannasi YCP ki bhavishyatthu ledhu.

  9. ఏందిరా…..60 శాతం ఓట్లతో రెండు ఎం.ఎల్.సి లు మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచారు కూటమి అభ్యర్థులు… ఇక ఉపాధ్యాయ ఎం.ఎల్.సి తెలుగుదేశం, జనసేన ఒకరికి, బీజేపీ, తెలుగుదేశం గంటా శ్రీనివాస్ మరియు కొంతమంది తెలుగుదేశం నాయకులు మరొకరికి, వైసీపీ ఇంకొకరి మధ్ధతిచ్చారు. తమ కూటమి పార్టీ బీజేపీ మరొకరికి మద్దతు ఇవ్వటంతో ఇద్దరిలో ఎవరు గెలిచిన ఫరవాలేదు.. తమ మధ్య విభేదాలు రాకూడదు అని ఇరువురు వ్యవహరించారు… ఇద్దరి మధ్య ఓట్లు చీలినా బీజేపీ బలపర్చిన అభ్యర్థి గెలిచారు… అంతిమంగా మొగ్గకుడిచి పోయింది వైసీపీ. ఇప్పుడు చెప్పరా అబ్బాయి.

  10. పోరా పుడింగి. నీ సోది చదివి నమ్మేవాడు ఎవడూ లేడు. వెళ్లి మీ జగన్ కి వినిపించు. కాస్త అనందిస్తాడేమో

  11. GA కష్టాలు చూస్తుంటే నవ్వు వస్తుంది. ఒక సీటు ఓడిపోతే ప్రమాద ఘంటికలు అని రాసిన వీడు రెండు చోట్ల ఘన విజయం సొంతం చేసుకుంటే దానిగుర్చి ఎలా రాయాలి మరి. దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా ఇది వైసిపి స్పాన్సర్డ్(పెయిడ్) ఆర్టికల్ అని🤣🤣

  12. సిగ్గూ శరం ఏమి లేదా? అంత దమ్ముంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చెయ్యాల్సింది… మీ జగ్గడిని కలిసినందుకు mlc లక్ష్మణ్ రావు ఘోర ఓటమిని చూసాడు… యూటీఎఫ్ కు మీరు మద్దతిచ్చిన కారణం గా మూడో ప్లేసులో అక్కడ ఉన్నారు.

  13. ఎవరికి వారు సొంత భాష్యాలు చెప్పుకోవడం సరికాదు. . ఇక్కడ mlc గా ఎవరు ఉంటే ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుంది అనేది బాగా ఆలోచించి సైలెంట్ ఓటింగ్ వేశారు. ఇందులో సగటు ఉపాధ్యాయుడు ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గ లేదు. అసలు టీచర్ ఎలెక్షన్ లో అధికార పార్టీ జోక్యం చేసుకోవడమే తప్పు.

Comments are closed.