బాబు, లోకేశ్‌ను దారిలో పెట్టేందుకు షాక్ ఇస్తారా?

ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న ఉమ్మ‌డి గుంటూరు-కృష్ణా జిల్లాలు, అలాగే ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని గ‌మ‌నిస్తే అధికార కూట‌మి నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో ఏదో తేడా క‌నిపిస్తోంది.

వైసీపీ హ‌యాంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు మూడు గ్రాడ్యుయేట్‌, రెండు టీచ‌ర్స్ ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. వైసీపీకి బాగా ప‌ట్టున్న రాయ‌ల‌సీమ‌లోని రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లో, అలాగే ఉత్త‌రాంధ్ర‌లో ఆ పార్టీ ఓడిపోయింది. సీమ‌లో రెండు టీచ‌ర్స్ స్థానాల్లో వైసీపీ మ‌ద్ద‌తుదారులు గెలుపొందినా, అది సాంకేతిక‌త‌మే త‌ప్ప‌, నైతికంగా ఓడిపోయిన‌ట్టే. అయితే గ్రాడ్యుయేట్ స్థానాల్లో వైసీపీ శ్రేణులు త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని హెచ్చ‌రించాల‌నే ఉద్దేశంతో ఆ పార్టీ అభ్య‌ర్థుల‌కు వ్య‌తిరేకంగా ఓట్లు వేశారు.

తాజాగా రెండు గ్యాడ్యుయేట్‌, ఒక టీచ‌ర్ ఎమ్మెల్సీ స్థానానికి ఇవాళ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. పోటీ హోరాహోరీని త‌ల‌పిస్తోంది. ఎందుకోగానీ, తొమ్మిది నెల‌ల కూట‌మి పాల‌న‌పై ప్ర‌తిప‌క్షాల్లోనే కాదు, స్వ‌ప‌క్షాల్లోనూ అస‌హ‌నం, నిట్టూర్పు క‌నిపిస్తున్నాయి. త‌మ ఆకాంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్టు పాల‌న సాగ‌డం లేద‌నే స‌ణుగుడు మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేశ్‌కు బుద్ధి చెప్పేందుకు, దారికి తెచ్చుకునేందుకు గుణ‌పాఠం చెప్ప‌డానికి గ‌తంలో వైసీపీ శ్రేణుల మార్గాన్నే, టీడీపీ శ్రేణులు అనుస‌రించ‌నున్నాయా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న ఉమ్మ‌డి గుంటూరు-కృష్ణా జిల్లాలు, అలాగే ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని గ‌మ‌నిస్తే అధికార కూట‌మి నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో ఏదో తేడా క‌నిపిస్తోంది. ఆ తేడా ప్ర‌భుత్వంపై సానుకూలత మాత్ర‌మే కాద‌ని ఖ‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. అలాగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీని ఓడించ‌డానికి ఇత‌ర ప్రాంతాల నుంచి ప‌ట్టుద‌ల‌తో వ‌చ్చిన ఓట‌ర్లు, ఈ ఎన్నిక‌ల్లో మాత్రం నిరాస‌క్త‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌డం గ‌మ‌నార్హం.

పైగా మ‌న‌కెందుకులేబ్బా, అనుకున్న‌దొక‌టి, అవుతున్న‌దొక‌టి అని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఇక జ‌న‌సేన శ్రేణుల్లోనూ తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని ఎవ‌రో చెప్ప‌డం కాదు, వాళ్లంత‌కు వాళ్లే సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టిస్తున్నారు. అయితే ఈ అసంతృప్తి, వ్య‌తిరేక‌త టీడీపీ ఓట‌మికి దారి తీస్తుందా? లేదా? అనేది వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న కౌంటింగ్‌లో తేల‌నుంది. అంత వ‌ర‌కూ ఉత్కంఠ త‌ప్ప‌దు మ‌రి!

12 Replies to “బాబు, లోకేశ్‌ను దారిలో పెట్టేందుకు షాక్ ఇస్తారా?”

  1. ఏందో నీ బాధ .. వాళ్ళు ఇప్పుడు వోడి పోతే ..సరి చేసుకోవడానికి నాలుగేళ్లు ఉన్నాయి .. ఎలా చూసుకున్న మనకే ఏమి లాభం లేదు ..

  2. Opposition ki deposits raavu ra lafut. Akkada vunnadi kootami. That is a winning combination. Andulo we have the all rounder Pawan sir. Result choosukuni mallee edusthavu. adi fix.

  3. orey GA ga…konchem ayyina burra vundali ra neeku….kootami gelichinappati nundi evevo raastunnavu…okkati kooda jarigi chaavatam ledhu…endhuku paniki raani jaggulu gaadi kosam entha kastapadina waste…

  4. సింగల్ గా 175/175 గెలుస్తాం అనే ‘గుద్ద కొవ్వు నుండి, “YCP అనే పార్టీ అసలు పోటీ చెయ్యడానికే ఉ’చ్చపోసుకునే స్థాయికి దిగజారి, ప్రత్యర్థి ఒక్క సీటు ఓడినా సంభరపడే స్థాయికి దిగజారడం ఏదైతే ఉందో.. నభూతో నాభవిష్యత్ రా జెగ్గుల్

  5. వైసీపీ పోటీలో ఉంటే మాత్రం గారెంటీ గ టీడీపీ జనసేన కూటమి గెలుపు ఖాయం కారణం ఏ పరిస్థితి లోను వైసీపీ ని రానివ్వ కూడదని ఓటర్లు 40 % పైన వున్నారు వాళ్ళకి ఎవరు వచ్చిన పర్వాలేదు జగన్ గారు మాత్రం రాకూడదు అంతే అయన ఆ రకమైన అరాచక పాలనా చేసేక ఎవరు ఓటేస్తారు ఆయనకు వర్గీకరణ తో అయన పార్టీ ని మూసుకోవలసిందే ఖచ్చితం గ వర్గీకరణ తో ఒక సామజిక వర్గం టీడీపీ కి వెళ్ళిపోతుంది వేరొకటి ఉన్నంతలో బెస్ట్ అయినా జనసేనకు కొమ్ము కాస్తుంది వైసీపీ రెంటికి చెడ్డ రేవడిగా మిగులు తుంది

Comments are closed.