కొన్నాళ్లు పోతే.. ప్ర‌జ‌లే వ‌ద్ద‌న్నార‌ని రాస్తారు!

టీడీపీ అనుకూల మీడియా తీరు చూస్తుంటే, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి ఆర్థిక ఇబ్బందులను త‌ట్టుకోలేక ప్ర‌జ‌లే స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చి త‌మ‌కు ఎలాంటి సంక్షేమ ప‌థ‌కాలు వ‌ద్దంటారేమో! రైతు భ‌రోసా, త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాల్ని చంద్ర‌బాబునాయుడు అమ‌లు…

టీడీపీ అనుకూల మీడియా తీరు చూస్తుంటే, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి ఆర్థిక ఇబ్బందులను త‌ట్టుకోలేక ప్ర‌జ‌లే స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చి త‌మ‌కు ఎలాంటి సంక్షేమ ప‌థ‌కాలు వ‌ద్దంటారేమో! రైతు భ‌రోసా, త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాల్ని చంద్ర‌బాబునాయుడు అమ‌లు చేసే ఉద్దేశంతో నిధులు స‌మ‌కూర్చాల‌ని ఆర్థిక‌శాఖ ఉన్న‌తాధికారిని ఆదేశించార‌ట‌. అయితే స‌ద‌రు అధికారి అడ్డు ప‌డుతున్నాడ‌ని టీడీపీ అనుకూల మీడియా కొత్త రాగం అందుకుంది.

కూట‌మి ప్ర‌భుత్వానికి సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేయాల‌నే గొప్ప మ‌న‌సు ఉంద‌ని, అయితే అడుగ‌డుగునా ఆర్థిక‌శాఖ ఉన్న‌తాధికారులే అడ్డుకుంటున్నార‌ని ప్ర‌జ‌లు అనుకోవాల‌నేది టీడీపీ అనుకూల మీడియా వ్యూహంగా క‌నిపిస్తోంది. తాము ఆరాధించే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఏ మాత్రం ప్ర‌జ‌ల్లో చెడ్డ‌పేరు రాకూడ‌ద‌ని త‌మ అక్ష‌రాల మాయ‌జాలాన్ని ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం అంద‌రూ ప‌సిగ‌ట్టారు.

ఉచిత ఇసుక ఇస్తామ‌ని ప్ర‌జ‌ల‌తో ఓట్లు వేయించుకుని, స‌రిగ్గా నాలుగు నెల‌ల పాల‌న‌కే చేతులేత్తేయ‌డం గ‌మ‌నార్హం. ఇసుక రీచ్‌ల‌ను సొంతోళ్ల‌కు క‌ట్ట‌బెట్ట‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. ఉచిత‌మ‌ని చెప్పి, ఇప్పుడు ఇసుక‌ను అమ్మ‌డం ఏంట‌నే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. అందుకే టీడీపీ అనుకూల త‌న అతి తెలివితో ప్ర‌జ‌ల్ని బోల్తా కొట్టించే అక్ష‌ర జిమ్మిక్కుల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించొచ్చు.

ఇసుక‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవ‌డ‌మే కాకుండా, నేరుగా రీచ్‌కి వెళ్లి కొని తీసుకెళ్లేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఆదేశించార‌ని రాయ‌డంలో కూట‌మి ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక ఆలోచ‌న లేకుండా చేసే కుట్ర క‌నిపిస్తోంది. కొని తీసుకెళ్లే అవ‌కాశం క‌ల్పించాల‌ని సీఎం ఆదేశించార‌ట‌! ఇదీ రాజ‌గురువు ప‌త్రిక చంద్ర‌బాబు ఆరాధ‌న‌ భాష‌.

పేరు ఏదైనా …ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన ఇసుక‌, వారికి ఆమోద‌యోగ్య‌మైన ధ‌ర‌తో అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ఉచిత రీచ్‌ల‌కు అద‌నంగా ప్రైవేట్ రీచ్‌ల‌ను ప్ర‌వేశ పెట్టాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఉచితానికి, కొనుగోలుకు న‌క్క‌కు, నాగ‌లోకానికి ఉన్నంత తేడా ఉంద‌ని తెలిసినా, పేరు ఏదైనా అంటూ చాలా సులువుగా మ‌రో భ‌క్త ప‌త్రిక రాయ‌డాన్ని చూడొచ్చు.

ప్ర‌జ‌ల్ని త‌మ భాషా జిమ్మిక్కుల‌తో మభ్య పెట్టొచ్చ‌ని టీడీపీ అనుకూల మీడియా స‌రికొత్త నాట‌కానికి తెర‌లేపింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌రికొన్ని రోజులు పోతే, సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు అమ‌లు చేస్తే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి కుంటుప‌డుతుంద‌ని, డెవ‌లప్‌మెంట్ పితామ‌హుడైన సీఎం చంద్ర‌బాబునాయుడి సంక‌ల్పంతో భుజం క‌లిపేందుకు ప్ర‌జానీకం అంతా ముర్త కంఠంతో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయొద్ద‌ని కోరుకుంటోంద‌ని రాసే రోజులు మ‌రెంతో దూరంలో లేవు. చంద్ర‌బాబునాయుడికి ఐఏఎస్ అధికారులు స‌హ‌క‌రించ‌డం లేద‌ని రాయ‌డం కంటే దివాళాకోరుత‌నం మ‌రేదైనా వుంటుందా?

16 Replies to “కొన్నాళ్లు పోతే.. ప్ర‌జ‌లే వ‌ద్ద‌న్నార‌ని రాస్తారు!”

  1. ప్రభుత్వ ఆస్తులు అమ్మి ఇంకొన్ని ఆస్తులు కుదువ పెట్టి ప్రజలకి పంచిన 11 రెడ్డి కి అదే ప్రజలు ఎన్నికల్లో పంగనామాలు ఎందుకు పెట్టారు??

      1. కాని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా…నాకు ప్రతిపక్ష నేత హోదా ఇప్పించండి అని కోర్ట్ లో అడుక్కునే పరిస్తితి మొదటి సారి

      2. ప్రొఫైల్ నేమ్ నచ్చింది బయ్యా . 2029 ఎలక్షన్ అనకుండా నెక్స్ట్ అన్నావ్ చూడు నచ్చేసావ్…

      3. ప్రియమైన లోకనాథరావు గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పినట్లు, మీరు మీ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా కాపు, కమ్మ కులాల మీద మీకున్న తీవ్రమైన ద్వేషంతో జీవిస్తున్నారని చెప్పాలి. మీరు ఎప్పుడూ కులం, కులం, కులం అని మాత్రమే మాట్లాడుతూ, కులాధారిత ద్వేషాన్ని ప్రోత్సహిస్తారు. ఈ ద్వేషం మీ మెదడులో తీవ్ర ఆవేశాన్ని నింపి, అది మీకు గుండె సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. కుల ద్వేషం వలన మీకు ఈ గుండె సమస్యలు రావడం ఎంత దురదృష్టకరం. కులం ఆధారంగా ద్వేషాన్ని పెంచుకోవడం వల్ల మీకు ఏమీ ఉపయోగం లేదు. మీలాంటి వారు, రంగనాథ్ లాంటి వారు ఎప్పుడూ కమ్మ, కాపు కులాలపై ద్వేషం పెంచుకోవడం వలన, అది మిమ్మల్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ, మీరు ఇంకా మీ అసభ్యకరమైన స్వభావంతో కొనసాగుతూనే ఉన్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ద్వేషించి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు 175 స్థానాల నుండి. మీకు సిగ్గు లేదా? ఈ జీవితాంతం కుల ద్వేషం ప్రోత్సహించడం ఏందుకు? ఇంత మంచి విద్య పొందిన మీరు, మీ చివర్లో సిగ్గులేని ఆలోచనలు చేయడం ఎంత దౌర్భాగ్యం.

        4o

  2. పది లక్షల కోట్లు అప్పు చేసి కేవలం 3 లక్షల కోట్లు ప్రజలకి పంచిన 11 రెడ్డి కి అదే ప్రజలు ఎన్నికల్లో పంగనామాలు ఎందుకు పెట్టారు??

  3. ప్రియమైన లోకనాథరావు గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పినట్లు, మీరు మీ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా కాపు, కమ్మ కులాల మీద మీకున్న తీవ్రమైన ద్వేషంతో జీవిస్తున్నారని చెప్పాలి. మీరు ఎప్పుడూ కులం, కులం, కులం అని మాత్రమే మాట్లాడుతూ, కులాధారిత ద్వేషాన్ని ప్రోత్సహిస్తారు. ఈ ద్వేషం మీ మెదడులో తీవ్ర ఆవేశాన్ని నింపి, అది మీకు గుండె సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. కుల ద్వేషం వలన మీకు ఈ గుండె సమస్యలు రావడం ఎంత దురదృష్టకరం. కులం ఆధారంగా ద్వేషాన్ని పెంచుకోవడం వల్ల మీకు ఏమీ ఉపయోగం లేదు. మీలాంటి వారు, రంగనాథ్ లాంటి వారు ఎప్పుడూ కమ్మ, కాపు కులాలపై ద్వేషం పెంచుకోవడం వలన, అది మిమ్మల్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ, మీరు ఇంకా మీ అసభ్యకరమైన స్వభావంతో కొనసాగుతూనే ఉన్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ద్వేషించి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు 175 స్థానాల నుండి. మీకు సిగ్గు లేదా? ఈ జీవితాంతం కుల ద్వేషం ప్రోత్సహించడం ఏందుకు? ఇంత మంచి విద్య పొందిన మీరు, మీ చివర్లో సిగ్గులేని ఆలోచనలు చేయడం ఎంత దౌర్భాగ్యం.

    4o

Comments are closed.