పోర్టు ఆసుపత్రి మీద ప్రైవేట్ పడగ

ప్రైవేట్ మంత్రం పఠిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. అక్కడితో తమ బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నారు. ప్రభుత్వంలోకి వచ్చినది అన్నీ ప్రైవేటుకే అని కట్టబెట్టడమో లేక పీపీపీ అంటూ బాకా ఊదడమో చేస్తున్నారు. ఇవన్నీ గొప్ప ఆర్ధిక…

ప్రైవేట్ మంత్రం పఠిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. అక్కడితో తమ బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నారు. ప్రభుత్వంలోకి వచ్చినది అన్నీ ప్రైవేటుకే అని కట్టబెట్టడమో లేక పీపీపీ అంటూ బాకా ఊదడమో చేస్తున్నారు. ఇవన్నీ గొప్ప ఆర్ధిక పాలనాపరమైన సంస్కరణలుగా అభివర్ణిస్తున్నారు.

అర్ధం చేసుకోలేని వారిని మేధావితనం లోపించిన కేటగిరిలో కట్టేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న వాటిని ప్రైవేటుకి ఇస్తే ఎలా లాభాల బాట పడుతున్నాయో చూడాలి కదా. అలాగే ప్రభుత్వ రంగంలో తాము ఎందుకు చేయలేకపోతున్నామో ఆలోచించుకోవాల్సి ఉంది కదా అని ప్రజా సంఘాల నుంచి నిరసన గళం వినిపిస్తోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ రూట్ లోనే ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో విశాఖలోని పోర్టు ఆస్పత్రి చేరింది. విశాఖ పోర్టు ఆసుపత్రిని పీపీపీ విధానంలో ఇచ్చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఎనభై పడకలతో ప్రస్తుతం ఎంతో బాగా నడుస్తున్న పోర్టు ఆసుపత్రిని మూడు వందల పడక ఆసుపత్రిగా మార్చాలన్న నిర్ణయం మంచిదే. కానీ దానిని మల్టీ డిసిప్లైనరీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌గా 300 పడకలతో చేయాలని నిర్ణయించారు.

అయితే ఇది ప్రభుత్వ రంగంలో ఉండి చేసేది కాదు, ఈ విధంగా పోర్టు ఆసుపత్రిని ప్రయివేటు వారికి ఇవ్వాలనే నిర్ణయం పోర్టు తీసుకుందని వామపక్ష కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. పోర్టు ఆసుపత్రులను ఆయా యాజమాన్యాలే నడపాలని అంతే తప్ప ప్రైవేట్ వారికి ఇస్తే ఉద్యోగ కార్మిక వర్గాలు తీవ్ర అన్యాయం అయిపోతారని కార్మిక నేతలు అంటున్నారు

విశాఖ పోర్టుకు ఇదే ఏడాది 386 కోట్ల రూపాయల దాకా లాభాలు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. అంతే కాకుండా వేల కోట్ల రూపాయలు రిజర్వ్‌ ఫండ్స్‌ కూడా ఉన్నాయని పేర్కొంటున్నారు. వాటి నుంచి తీసి ఖర్చు పెట్టి పోర్టు ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని అంతే తప్ప ప్రైవేటుకు అప్పగిస్తే ఊరుకోమని అంటున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వ రంగంలోని సంస్థలు వాటి ఆధ్వర్యంలో పనిచేసే సంస్థల మీద ప్రైవేట్ పడగ నీడ బాగా పడుతోంది. దీనిని కార్మిక లోకం ఎదిరిస్తోంది. కానీ అడ్డుకోవడం సాధ్యమేనా అంటే ప్రజలు కూడా సహకరించాలని కార్మిక వర్గాలు కోరుతున్నాయి.

7 Replies to “పోర్టు ఆసుపత్రి మీద ప్రైవేట్ పడగ”

  1. ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకి మళ్ళించింది ఎవరు? 108 సేవలు ప్రైవేట్ కి ఇచ్చింది ఎవరు? టీటీడీ నెయ్యి కాంట్రాక్టు ప్రైవేట్ కి ఇచ్చింది ఎవరు?

    1. gov spending on arogya sree is 3000 cr . while spending on arogya shreee gov can improve facilities and divert the patients from private the gov slowly . no one is stopping gov to improve gov hospitals .

  2. Go suck CBN & pawan’s dick, Jagan sir, shouted from roof tops not to belive CBN and co but you did’t listen and now bearing the brunt of and greed. You don’t deserve any compassion from people because you full well know what happens if CBN was elected.

Comments are closed.