Advertisement

Advertisement


Home > Politics - Gossip

వైకాపా నేతలకు పదవుల పందేరం?

వైకాపా నేతలకు పదవుల పందేరం?

వైకాపా నేతలకు శుభవార్త. చిరకాలంగా ఎదురు చూస్తున్న పదవుల పంపిణీ కార్యక్రమాన్ని సిఎమ్ జగన్ రేపు చేపట్టబోతున్నారని తెలుస్తోంది. 

ఉత్తరాంధ్ర కొస నుంచి రాయలసీమ వరకు పలువురు పార్టీ నేతలకు పదవులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. రేపు సాయంత్రం ఈ మేరకు ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశం వుంది.

ఉత్తరాంధ్రకు చెందిన కెకె రాజు, లలిత, వెస్లీ, ఇంకా పలువురికి పదవులు దక్కే అవకాశం వుంది. గతంలో పాదయాత్ర ముగింపు టైమ్ లో అన్ని ఏర్పాట్లు చేసిన ఓ నాయకుడికి కూడా పదవి వరించబోతోంది అని బోగట్టా. 

అలాగే సిద్దారెడ్డి, ఎం వి రమణారెడ్డి కోడలు,  తదితరులకు కూడా పదవులు ఇస్తారని బోగట్టా. ప్రతి జిల్లాకు చెందిన ఒకరో ఇద్దరో ఈ పదవుల జాబితాలో వుండే అవకాశం వుందని తెలస్తోంది.  మొత్తం ముఫై ఎనిమిది నుంచి నలభై మందికి పదవులు దక్కే అవకాశం వుందని బోగట్టా. దాదాపు 140 మందితో జాబితా తయారు చేసి, ఫిల్టర్ చేసి కుదించినట్లు తెలుస్తోంది

పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలోపలువురికి పదవులు ఇచ్చారు. ఆ తరువాత మళ్లీ ఇప్పటి వరకు పదవులు ఇవ్వలేదు. త్వరలో మంత్రి వర్గ మార్పులు చేర్పులు వుండే అవకాశం వుందని వినిపిస్తున్న నేపథ్యంలో ఈ పదవుల పంపిణీకి జగన్ పూనుకోవం కాస్త విశేషమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?