వెయ్యేళ్ళ వారసత్వ సంపదకు గుర్తింపు కావాలి

యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా తెలంగాణాకు చెందిన రామప్ప దేవాలయాన్ని గుర్తించింది. దాంతో ఏపీలో ఉన్న వారసత్వ కట్టడాలు కూడా ఇపుడు పోటీకి దిగుతున్నాయి. అందులో అందరికీ ఆకట్టుకుంటున్న గొప్ప ఆలయం సింహాచలం. ఈ…

యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా తెలంగాణాకు చెందిన రామప్ప దేవాలయాన్ని గుర్తించింది. దాంతో ఏపీలో ఉన్న వారసత్వ కట్టడాలు కూడా ఇపుడు పోటీకి దిగుతున్నాయి. అందులో అందరికీ ఆకట్టుకుంటున్న గొప్ప ఆలయం సింహాచలం. ఈ నారసింహ క్షేత్రానిది వెయేళ్ళ చరిత్ర. 11వ శతాబ్దంలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది.

దానికి సంబంధించిన శాసనాలు, చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. పురాతన పుస్తకాలు డాక్యుమెంట్లను ఇపుడు దేవస్థానం సేకరిస్తోంది. ఈ ఆలయ శిల్ప సౌందర్యం, కట్టడాలు కూడా ప్రపంచ వారసత్వ సంపదగా చూడాలని ఈవో సూర్యకళ కోరుతున్నారు.

ఈ ఆలయం గత సహస్రాబ్దిగా దేశంలోని ప్రజలను విశేషంగా అలరిస్తోందని, ఆధ్యాత్మిక భావనలను అంతటా పంచిపెడుతోందని ఆమె అంటున్నారు. మహా ఏలిక‌ శ్రీక్రిష్ణ దేవరాయల నుంచి గజపతుల వరకూ ఎంతో మంది ఈ ఆలయన్ని దర్శించుకుని చేసిన సేవలకు మేలు గురుతులు ఉన్నాయని కూడా చెబుతున్నారు. 

ఈ శాసనలకు సంబంధించిన సమాచారాన్ని వెలికి తీసేందుకు ఆంధ్రా యూనివర్శిటీ కూడా ముందుకు వచ్చింది. ఈ మేరకు విసృతమైన పరిశోధనలు జరిపించి పూర్తి వివరాలను యునెస్కో వారికి పంపుతామని అంటున్నారు. మొత్తానికి ఈ ఆలయం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందితే అది దేశానికే గర్వకారణం అని ఆస్తికజనులు అంటున్నారు.