శిరోముండనం కేసు: నూతన్‌ నాయుడు అరెస్ట్‌

శిరోముండనం కేసులో ఆరోపణలు ఎదర్కొంటున్న పరాన్నజీవి దర్శకుడు నూతన్‌ కుమార్‌ నాయుడును పోలీసులు అరెస్ట్‌ చేశారు. Advertisement కేసు వెలుగుచూసినప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని కర్ణాటకలోని ఉడిపిలో అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి పారిపోయేందుకు…

శిరోముండనం కేసులో ఆరోపణలు ఎదర్కొంటున్న పరాన్నజీవి దర్శకుడు నూతన్‌ కుమార్‌ నాయుడును పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కేసు వెలుగుచూసినప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని కర్ణాటకలోని ఉడిపిలో అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడని విశాఖ సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా వెల్లడించారు.

శిరోముండనం కేసులో నూతన్‌ నాయుడు పాత్ర ఉందని తేలిన తరువాతనే అతన్ని అరెస్ట్‌ చేశామన్నారు.

దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్‌ కుమార్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇదివరకే ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు విశాఖ సిటీ పోలీసు కమిషనర్ తెలిపారు. నిందితులకు న్యాయస్థానం రెండు వారాలు రిమాండ్‌ విధించింది.

ఇదిలా ఉంటే శిరోముండనం కేసులో ఇప్పటికే అనేక సెల్ ఫోన్లను నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేస్తున్న పోలీసులు నూతన్ నాయుడి వద్ద ఉన్న మూడు సెల్ ఫోన్లను  కూడా తీసుకున్నారు.

నూతన్ నాయుడు అరెస్ట్ కావడంతో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు. అసలు నూతన్ నాయుడు  ఇంట్లో ఏం జరుగుతోంది, సెల్ ఫోన్ల లో అంత విలువైన సమాచారం ఏముంది అన్నది కూడా విచారణలో తేలనుంది.

బాలీవుడ్‌లో సినిమా చేయాల‌నే కోరిక లేదు