ప్రియుడిపై యాసిడ్ దాడి…ప్రేమ క‌థ‌లో ట్విస్ట్‌

స‌హ‌జంగా త‌మ ప్రేమ అంగీక‌రించ‌లేద‌నో, లేక త‌న‌ను కాద‌ని మ‌రొక‌రిని ప్రేమిస్తున్న‌ద‌నే కార‌ణంతో ప్రియురాళ్ల‌పై ప్రియులు యాసిడ్ దాడుల గురించి ఎన్నో విన్నాం. వ‌రంగ‌ల్‌లో యువ‌తుల‌పై యాసిడ్ దాడికి పాల్ప‌డిన ఒక‌రిద్ద‌రు యువ‌కుల‌ను అప్ప‌టి…

స‌హ‌జంగా త‌మ ప్రేమ అంగీక‌రించ‌లేద‌నో, లేక త‌న‌ను కాద‌ని మ‌రొక‌రిని ప్రేమిస్తున్న‌ద‌నే కార‌ణంతో ప్రియురాళ్ల‌పై ప్రియులు యాసిడ్ దాడుల గురించి ఎన్నో విన్నాం. వ‌రంగ‌ల్‌లో యువ‌తుల‌పై యాసిడ్ దాడికి పాల్ప‌డిన ఒక‌రిద్ద‌రు యువ‌కుల‌ను అప్ప‌టి అక్క‌డి ఎస్పీ స‌జ్జ‌నార్ ఎన్‌కౌంట‌ర్ చేయ‌డం గురించి క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకున్నాం.

తాజాగా ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్‌తో దాడి చేయ‌డం గురించి వింటుంటే ఆశ్చ‌ర్యంగా ఉంది. త‌న‌ను కాద‌ని మ‌రో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడ‌నే అక్క‌సుతో ప్రియుడితో యాసిడ్ దాడికి ఓ యువ‌తి పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లా నంద్యాల మండ‌లంలో చోటు చేసుకొంది.

నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన నాగేంద్ర, సుప్రియ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్ద‌రి కులాలు వేర్వేరు. ఈ విష‌యం తెలిసే ఇద్ద‌రూ అన్యోన్యంగా తిరిగారు. అయితే పెళ్లి ద‌గ్గ‌రికి వ‌చ్చే స‌రికి నాగేంద్ర కొత్త మెలిక పెట్టాడు. ఇద్దరి కులాలు వేరు కావ‌డంతో  పెళ్లికి   పెద్దలు ఒప్పుకోరని నాగేంద్ర ఆమె ప్రేమ‌కు పంగ‌నామాలు పెట్టాడు. ఆ తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశాడు.

దీంతో ప్రియుడి మోసాన్ని స‌ద‌రు ప్రేమికురాలు త‌ట్టుకోలేక పోయింది. ఎలాగైనా బుద్ధి చెప్పాల‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకొంది.  అత డిపై యాసిడ్‌ దాడికి పాల్పడింది. యాసిడ్‌ దాడిలో నాగేంద్ర ముఖం, చెయ్యి బాగా కాలిపోవటంతో ఆసుపత్రి పాల‌య్యాడు. ఈ ఘ‌టన‌పై సుప్రియ మాట్లాడుతూ త‌న‌ను ప్రేమ పేరుతో నాగేంద్ర మోసం చేశాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అయితే తాను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ….త‌న‌ను ప్రేమ‌గా ఉండాల‌ని వేధించడం వ‌ల్లే యాసిడ్ దాడికి పాల్ప‌డిన‌ట్టు తెలిపింది.

నేను బూతులు తిడితే బ్రతకగలవా