100 రోజుల్లో..

వందరోజుల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగానూ గణనీయమైన, ఫస్ట్ క్లాసు మార్కులను మించిన పనితీరుతో ప్రజలను ఆకట్టుకుంటోంది.

ఈ మ్యాజికల్ పదాన్ని కేవలం సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు.. ఇప్పుడు రాజకీయ ప్రభుత్వాలు కూడా విరివిగా వాడుకుంటున్నాయి. గద్దె ఎక్కిన ప్రభుత్వాలు ‘100 రోజుల’ టార్గెట్ ప్రకటిస్తున్నాయి. విపక్షపార్టీలు ‘100 రోజుల’ టార్గెట్ విధిస్తున్నాయి. మొత్తానికి రాజకీయాల్లో కూడా ‘100 రోజుల’ ప్రాధాన్యం బాగా పెరిగింది.

ప్రభుత్వాలు ప్రాణం పోసుకున్న తరువాత.. వందరోజులు అనేది ఒక తొలి మైలురాయిగా భావించే ఉద్దేశంతో కార్యకలాపాలు సాగిస్తున్న రోజులు ఇవి. మరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంగతేమిటి? వందరోజులు అనే డెడ్లైన్ ఎన్డీయే కూటమిపార్టీల నోట చాలా వినిపించింది. కొన్ని హామీలను ముందే ప్రకటించినా.. మొత్తానికి వందరోజుల్లో సంపూర్ణత్వం తీసుకురాకుండా.. ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పూర్తిగా అచేతనావస్థలోకి వెళుతోంది. అధికార కూటమి పార్టీల్లో ఉత్సాహం ఉంది. విపక్షంలో నిర్లిప్తత ఉంది.

కూటమిలోని పాలక పక్షాలు, విపక్షం, ఆటలో అరటిపండు వంటి ఇతర పార్టీలు ఏం చేస్తున్నాయి. 100 రోజుల వ్యవధిలో వీరందరి ప్రస్థానం ఎలా ఉన్నది? విహంగ వీక్షణం చేసే ప్రయత్నమే.. ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ.. ‘100 రోజుల్లో..’!

గెలిచిన పార్టీలకు ప్రభుత్వ పాలన కష్టం కాదు. కానీ ఓడిన పార్టీలకు అసలు పార్టీని కాపాడుకోవడమే కష్టం! ఎవరూ ఫిరాయించకుండా చూడాలి.. ఈ రెండు రకాల సంక్లిష్టతలను ఏపీలోని పార్టీలు ఎలా సంబాళిస్తున్నాయో మనం తెలుసుకోవాలి.

ఎన్డీయే : ఐక్యస్ఫూర్తితో అడుగులు!

కూటమి పార్టీల ఐక్యతకు వంద రోజుల్లో ఏదైనా వీసమెత్తు ఇబ్బంది అయినా రాగలదని ప్రజల్లో గానీ, రాజకీయ వర్గాల్లో గానీ ఎవ్వరికీ అనుమానం కూడా లేదు. ఎన్డీయే కూటమి పార్టీలు మొత్తం ఐక్యంగానే ఉన్నాయి. వారి మధ్య ఇప్పటిదాకా ఎలాంటి పొరపొచ్చాలు రాలేదు. ఆ సంకేతాలు కూడా లేకుండా వారు పనిచేసుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఒక్కటే. ఆ మూడు పార్టీలు కూడా కలిసి నడుస్తున్నారు. వారి మధ్య పరస్పర గౌరవం ఉన్నది.

డబుల్ ఇంజిన్ సర్కార్ అనే పదంతో బిజెపి రాష్ట్రాల్లో తమ కూటమిని గెలిపించాలని ప్రతిచోటా అడుగుతుంటుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ.. ఇక్కడ మాత్రం డబల్ ఇంజిన్ సర్కారు ఎంత బలంగా ఉంటుందో తేలుతున్నది. ఏపీలోని పనులకు, పథకాలకు కేంద్రం అనూహ్యమైన మద్దతు అందిస్తోంది. రాజధాని నుంచి పోలవరం దాకా అన్నింటికీ దన్నుగా ఉండబోతున్నట్టు ప్రకటించింది కూడా.

తెలుగుదేశం : రెట్టింపు ఉత్సాహంతో, ఆచితూచి..

తెలుగుదేశం పార్టీని అనుభవజ్ఞుడైన చంద్రబాబునాయుడు ఆచితూచి ముందుకు తీసుకువెళుతున్నారు. ఈ వందరోజుల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగానూ గణనీయమైన, ఫస్ట్ క్లాసు మార్కులను మించిన పనితీరుతో ప్రజలను ఆకట్టుకుంటోంది. అయిదేళ్లలో ఇబ్బందులు పడిన వారు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. చంద్రబాబునాయుడు తాను చెప్పిన సూపర్ సిక్స్ కాకపోయినప్పటికీ.. యిచ్చిన హామీలను వీలైనంత నెరవేర్చే మార్గంలోనే ఉన్నారు. సూపర్ సిక్స్ హామీల మీద కూడా ప్రజల్లోఅనుమానం పుట్టేలా ఆయన పనితీరు లేదు.

అదే సమయంలో కూటమి ఐక్యత ఏమాత్రం దెబ్బతినకుండా ప్రభుత్వాధినేత అయిన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నామినేటెడ్ పదవుల పంపకాల విషయంలో అన్ని పార్టీల్లోని ఆశావహులకు కలిపి ముందుగానే చంద్రబాబు స్పష్టత ఇవ్వడం ఒక మంచి ఎత్తుగడ! ఎన్నికలకు ముందు సీట్లు పంచుకున్న దామాషాలోనే పదవుల పందేరం కూడా ఉంటుందని ఆయన అన్న తరువాత. ప్రజల్లో సందిగ్ధం తొలగిపోయింది. ఈ వందరోజుల్లో ఎమ్మెల్యేలందరి ప్రోగ్రెస్ రిపోర్టులు తయారుచేయించి.. వారికి వ్యక్తిగతంగా అందించే కసరత్తు కూడా ఆహ్వానించదగ్గది.

ఈ ఎన్నికలు అమరావతి రాజధానిపై రెఫరెండం వంటివి.. అని జగన్ హయాంలో పాలక ప్రతిపక్షాలు అనేక పర్యాయాలు సవాళ్లు విసురుకున్నాయి. అది ఇప్పుడు తేలిపోయింది. అమరావతికి అనుకూల ఓటు పడిందనే మనం నమ్మితే గనుక.. ఆ విషయంలో ప్రజల ఆశలను సజీవంగా ఉంచడంలో చంద్రబాబు ప్రభుత్వం కృతకృత్యమైంది. అమరావతి విషయంలో ఆశాజనకమైన అనేక ముందడుగులు పడాయి. పోలవరం విషయంలో కొన్ని సందేహాలు మిగిలి ఉన్నాయి గానీ.. రాజధాని విషయంలో గట్టిచర్యలకు శ్రీకారం దిద్దినట్టే. అది వారికి లాభసాటి వ్యవహారం కూడా.

జనసేన: మొదటి అడుగు సూపర్ హిట్!

పవన్ కల్యాణ్ రాష్ట్ర శాసనసభలో పెట్టిన మొదటి అడుగు సూపర్ హిట్ అయింది. మొత్తం 21 స్థానాలను గెలుచుకుని పవన్ ఒక రికార్డు సృష్టిస్తే.. వందరోజుల పనితీరులో కూడా మెరుగ్గా కనిపిస్తున్నారు. ఎక్కడా కూటమి ఐక్యత నడుమ అలజడులు రేగకుండా పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలుగుదేశం కార్యకర్తలకు మించిన ఆశలు, తన పార్టీ వారిలో ఉన్నప్పటికీ.. తన పార్టీకి రాష్ట్రవ్యాప్త బలం ఉన్నప్పటికీ.. పవన్ చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నారు. సినిమా హీరోగా ఆయనను ఎరిగిన, తత్వం తెలిసిన వారు.. రాజకీయ నాయకుడిగా వచ్చిన తొలి అవకాశంలోనే ప్రదర్శిస్తున్న తీరును చూసి ఆశ్చర్య పోతున్నారు.

వంద రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ ప్రతి మీటింగులోనూ చంద్రబాబును కీర్తిస్తూ ఆయన పట్ల భక్తిని ప్రదర్శించడం మాత్రం పార్టీ శ్రేణుల్లో పలువురికి నచ్చడం లేదు. కానీ పవన్ మాట మీరి వ్యవహరించగల సత్తా వారిలో ఎవ్వరికీ లేదు.

బిజెపి: ఉన్నది ఒకటే దారి!

చాలా ఏళ్ల విరామం తరువాత బిజెపి ఏపీలో అధికారంలో భాగస్వామిగా ఉంది. గతంలో కంటె మెరుగ్గా సీట్లు దక్కాయి. చంద్రబాబునాయుడు ఘటనా ఘటన సమర్థుడు గనుక.. బిజెపి బలాన్ని తక్కువగా చూపి, వారికి ఆ దామాషాలో సీట్లు ఇచ్చి.. సభకు తెచ్చారు. నిజం చెప్పాలంటే భాజపాకు వేరే గత్యంతరం లేదు.

ఏపీలో వారు అధికారంలో భాగస్వామిగా ఉండడం కలలో మాట అని చెప్పాలి. జగన్ వారిని దగ్గరకు రానివ్వడు. ఒకే ప్రత్యామ్నాయం చంద్రబాబు. అందుకే ఆయన జట్టులో చేరారు. రాష్ట్రాల మీద తమ జెండా ఎగరడం అనేది కాషాయజెండా ప్రియుల కల. తమ బలం తమకు తెలిసినట్టుగా.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి ఓవరాక్షన్ చేయకుండా సంయమనం పాటిస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్: జారుడుబల్ల పైభాగంలో..

ఈ వంద రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఏం పాఠాలు నేర్చుకుంది? ఈ ప్రశ్నకు ఆ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఠక్కుమని జవాబు చెప్పలేరు. కాస్త కసరత్తు చేసిన తర్వాత.. ‘పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకేముంది.. ప్రజలు మమ్మల్ని తిరస్కరించలేదు’ అని గుంభనమైన ఒక సమాధానం చెబుతారు. ‘అందరి ప్రేమ మాతోనే ఉంది. ఎలా ఓడిపోయామో తెలియదు’ అంటూ ఈవీఎంలలో అక్రమాలు జరిగాయనే సందేహాన్ని నాటడానికి ప్రయత్నిస్తారు. కానీ, వారిని తిరస్కరించిన ప్రజలకు ఏం జరిగిందో తెలుసు కదా? ఆ వాస్తవాన్ని వారు అర్థం చేసుకోరు.

ఓటమి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి ఇతర పార్టీల్లోకి నాయకుల వలసలు బీభత్సంగా జరుగుతున్నాయి. అసలే 11 సీట్లకు పరిమితమైన ఆ పార్టీలో సగమైనా ఖాళీ అవుతుందేమో అనిపించేంతగా వలసలు జరుగుతున్నాయి. అవకాశవాదులే వెళ్లిపోతుంటారని సరిపెట్టుకోవడం చాలా సులువు. కానీ.. ఏ పార్టీలో చేరాలో డిసైడ్ చేసుకోకుండా, అవతలి పార్టీ వారితో బేరసారాలు మాట్లాడుకోకుండా కూడా పలువురు ముందే వెళ్లిపోతున్నారు. ఇది పార్టీకి మంచి సంకేతం కాదు. వెళ్లిపోయే నాయకుల విషయంలో జగన్ అనుసరిస్తున్న ఉదాసీన వైఖరి కూడా పార్టీకి నష్టదాయకంగా మారుతోంది.

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. వాటిని అంతే సహజంగా తీసుకోవాలి. త్వరగా ఓటమి భారం దించుకుని, పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాలి. తర్వాతి ఎన్నికలకు సిద్ధం చేయాలి! కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పని సక్రమంగా చేస్తున్నారా? అనేది ప్రశ్న! ఆయన ఒక కోటరీలో ఇరుక్కుపోయి అక్కడినుంచి బయటకు రాకుండా పార్టీని నడుపుతున్నారు. ఏ నాయకులైతే తప్పుడు సలహాలతో పార్టీని శాసించారో, అభ్యర్థిత్వాలను డిసైడ్ చేశారో.. ఆ నాయకుల విషయంలో జగన్ నిర్లిప్తంగానే ఉన్నారు. వారి సలహాలతోనే ఇంకా కొనసాగుతున్నారు.

మొత్తానికి పునర్నిర్మాణం అనే ప్రక్రియ కూడా మొదలైంది. కొన్ని జిల్లాలకు పార్టీ సారథులను కూడా మారుస్తున్నారు. ఇదివరకు చిన్న జిల్లాల వారీగా అధ్యక్షులు ఉండగా, ఇప్పుడు పూర్వ జిల్లాలకు కొత్త సారథుల్ని నియమిస్తున్నారు. నిజానికి ఇది పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతం. జగనే స్వయంగా చిన్నజిల్లాలను తయారుచేసి.. ఇవాళ ఉమ్మడి జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తే.. పార్టీ సమర్థ నాయకుల కొరతతో అలమటిస్తున్నట్టు ప్రజలు అనుకుంటారు.

అసలు ఈ అధ్యక్ష నియామకాల సమయంలో జగన్ తీరు కూడా పెద్ద ప్రహసనంగా తయారవుతోంది. ఆయా జిల్లాలకు చెందిన కీలక నాయకులందరినీ కూర్చోబెట్టి.. ‘మీ జిల్లాకు ఫలానా అన్నను అధ్యక్షుడు చేస్తున్నాం. మీ ఒపీనియన్ చెప్పండి’ అని అడుగుతారు జగన్. ఆయన ఎవరి పేరు చెప్పారో, ఆయన సమక్షంలోనే ఇది జరుగుతుంది. ఇక సదరు ఎంపికను వ్యతిరేకించేవారు ఎవరుంటారు? అలా కాకుండా.. జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీని కాపాడుకోవాలంటే భిన్నంగా వ్యవహరించాలి. ఆయన ప్రతి ఎమ్మెల్యే స్థాయి ఇన్చార్జిని విడిగా పిలిపించుకుని.. అప్పుడు తాను ఎంపిక చేసిన పేరు చెప్పి.. మంచిచెడు అభిప్రాయాలు అడిగితే ఉపయోగం ఉంటుంది. ఆయన తీరులో అదేం ఉండదు.

మీటింగు పెట్టడం అనేది మొక్కుబడి వ్యవహారం. ఎవరైతే మోనార్క్ వైఖరికి నిదర్శనంగా అంతర్గతంగా పార్టీ నేతల వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉంటారో.. వారినే మళ్లీ జగన్ పార్టీ మీద రుద్దుతున్నారు. ఇలాంటి జగన్ వైఖరుల వలన పార్టీ పునర్నిర్మాణం జరగదు సరికదా.. పార్టీ విలువల పరంగా కూడా మరింతగా దిగజారిపోతుంది.

ప్రజలు తనను ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు కనుక తాను ప్రజల పక్షంగా, మరొక లక్ష్యం లేకుండా అవిశ్రాంత పోరాటం సాగిస్తానని, ప్రభుత్వం దారి తప్పకుండా కాపలా కాస్తానని జగన్మోహన్ రెడ్డి నిరూపించుకుని ఉండాలి. ఈ వందరోజుల వ్యవధిలో బుడమేరు వరద విపత్తు విజయవాడను ముంచెత్తకుండా ఉంటే గనుక, జగన్ లో అలాంటి ధోరణి ఉన్నదని కూడా నమ్మలేని పరిస్థితి! ఎందుకంటే వరద విపత్తు సమయంలో, జగన్ కొంచెం ప్రజల పక్షాన నిలబడి వారి గళాన్ని వినిపించారు. ప్రజలకు అందే సహాయ కార్యక్రమాల గురించి చురుగ్గా పోరాడారు. అయితే ఆ ఒక్క విషయం తప్ప తతిమ్మా వందరోజుల పాలన కాలం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ గాడి తప్పింది. ఈ వందరోజుల్లో వరదను మినహాయిస్తే.. ప్రజలు ఈ ప్రతిపక్షానికి ప్రధాన ఎజెండాగా కనిపించలేదు.

జగన్ ఈ వందరోజుల్లో పోరాడిన ప్రతి విషయం కూడా తన సొంతానికి, స్వార్థానికి సంబంధించినదే. నాకు ప్రతిపక్ష నేత హొోదా కావాలి.. నాకు ముఖ్యమంత్రితో సమానమైన సెక్యూరిటీ కావాలి, నేను యూకే వెళ్లడానికి అనుమతులు కావాలి.. ఇలా అన్నీ తనగురించి మాత్రమే ఆలోచిస్తూ వచ్చారు. ప్రతిపక్షంలోని నేత తొలిరోజుల్లో చేయవలసిన పని ఇదేనా? ఇలాంటివన్నీ పార్టీకి చాలా పెద్ద నష్టాన్నే కలుగజేస్తున్నాయి. స్థూలంగా చెప్పాలంటే- 2014-19 మధ్య పార్టీ నిర్వహణ జగన్ చాలా చక్కగా చేసుకుంటూ వచ్చారు.

కానీ.. 2024-29 మధ్యలో అదే స్ఫూర్తితో పార్టీని నడపగలరనే నమ్మకం పార్టీ శ్రేణుల్లో సన్నగిలిపోతోంది. వ్యవహారాలు ఆర్గనైజ్డ్ గా నడవడం లేదు. ఇది ఆయన పార్టీకే నష్టం. పార్టీకి నష్టం చేసే దుష్ట శక్తులను ఆయన విడిచిపెట్టడం లేదు. ఇక ముందడుగు అనేది ఎలా సాధ్యమవుతుందనే అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయి. వెళ్లిపోతున్న నాయకుల పట్ల ఉదాసీనంగా ఉండడం, ఒకరు పోతే మరొకరు వస్తారు అంటూ డైలాగ్ చెప్పడం మాత్రమే కాదు.. అలాంటి నాయకులు తయారు కావడానికి తాను కష్టపడతానని ఆయన నిరూపించుకోవాలి. జగన్ తీరులో అలాంటిదేం లేదు. వందరోజుల ప్రోగ్రెస్ రిపోర్టు గమనిస్తే నిరాశాజనకంగానే కనిపిస్తోంది.

కాంగ్రెస్ అండ్ కో: ప్రత్యర్థులకే వీరు మౌత్ పీస్ లు!

తెలంగాణ రాజకీయాల్లో తన అస్తిత్వం నిరూపించుకోవడానికి కొన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత.. ఇక్కడ సానుకూల కనీస సంకేతాలు కూడా కనిపించకపోయేసరికి షర్మిలకు విసుగొచ్చింది. ఆమె తన పార్టీని చాపచుట్టేసి కాంగ్రెస్ తీర్థం తీసుకుని ఏపీ పార్టీ చీఫ్ కూడా అయ్యారు. ప్రస్తుతానికి అన్నయ్య జగన్ తో విభేదించి ఆయన మీద నిందలు వేస్తున్నది గనుక.. కాంగ్రెస్ షర్మిలను ఆదరించింది. ఎందుకూ పనికిరాని ఒక పదవిని కట్టబెట్టింది. షర్మిల రాష్ట్రమంతా తిరిగి కాంగ్రెసు పార్టీ బతికే ఉన్నదని తెలియజెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆశించిన లక్ష్యం పూర్తయింది. షర్మిల ఏం సాధించింది? ఆమె ప్రస్థానం మళ్లీ క్రాస్ రోడ్స్ కు చేరుకుంది.

కానీ ప్రస్తుతం షర్మిల మరియు వారి వామపక్ష మిత్రులు తమపార్టీల భావజాలం మరచి, అధికార కూటమికి మౌత్ పీసుల్లాగా మారుతున్నారు. కూటమి పార్టీలు ఒక సమస్య ప్రస్తావిస్తే వీళ్లందరూ దానినే పట్టుకుని వేళ్లాడుతున్నారు.

వందరోజుల డెడ్ లైన్ రాజకీయాల్లో కూడా చాలా ముఖ్యం అనే సంగతిని ఇక్కడి విపక్షాలు గుర్తించాలి. తాము ప్రజలకోసమే ఎప్పటికీ పనిచేస్తుంటామనే సంకేతాలు వారు పంపాలి.

.. ఎల్ విజయలక్ష్మి

43 Replies to “100 రోజుల్లో..”

  1. ఒరేయ్ విజయ లక్ష్మి గా , ఇంకా నువ్వు ఆడ పేరుతోనే రాస్తున్నావు అనమాట!!

  2. 100 రోజుల్లో జగన్ రెడ్డి పతనం .. ఒక అద్భుతం.. ఒక మహాత్బుతం.. ఒక అత్యత్భుతం ..

    ల్యాండ్ గ్రాబింగ్ చట్టం.. జగన్ రెడ్డి పార్టీ ని ఓడిస్తే..

    లడ్డు లో మాంసం.. జగన్ రెడ్డి పార్టీ ని చంపేసింది..

    జగన్ రెడ్డి పైన ఇంకో మూడు కేసులు “సిద్ధం” కాబోతున్నాయి.. సాక్ష్యాధారాలు పక్కాగా “సిద్ధం” చేసుకొన్నారు..

    సమయం చూసుకుని.. గట్టిగ్గా కొట్టబోతున్నారు..

    అందులో ఒక కెసు మాత్రం.. యావత్ భారత దేశాన్ని షేక్ చేయబోతోంది..

    జగన్ రెడ్డి అంటేనే ప్రజల్లో అసహ్యం, అనుమానాలు కల్పించి .. వైసీపీ ని సర్వనాశనం చేయబోతున్నారు..

    మనిషి రూపం లో మృగాన్ని.. నరరూపరాక్షసత్వాన్ని.. జగన్ రెడ్డి ని.. రాజకీయం గా అంతమొందించే ప్రక్రియ.. పకడ్బందీగా.. కట్టుదిట్టంగా .. నడుస్తోంది..

    1. Ejay nenu mimmalni follow avutanu sure ga mi comments chustanu kaani e madhya mari too much ga behave chestunaru deniki, antha asahyam ysrcp ante, nenu YSR fan ni kabati 19 lo jagan ki vesanu okka 5 years chusaka baboy anipinchi TDP ki vesamu family antha, kani e madhyana miru mari personal ga comment pedutunaruu. Deniko mari… Antha chiraku

    2. ఫస్ట్ క్లాసు పనితీరు అంటే ఇదే! ప్రతికూల వర్గాల ప్రశంసలు పొందిన ప్రభుత్వమే నిజమైన విజయవంతం.

  3. ఇంకా వైసీపీ పార్టీ డబ్బులిస్తుందా, వాళ్ళని దృష్టి లో ఉంచుకుని రాస్తున్నావు. ఇంకా వదిలెయ్యి. ఎన్ని జాకీలేసిన వైసీపీ ని లేపలేవు ఇంకా.

  4. “రాజధాని నుంచి పోలవరం దాకా అన్నింటికీ దన్నుగా ఉండబోతున్నట్టు ప్రకటించింది కూడా.”

    ఛ? నిజమా? manifesto మీద చెయి వేయడానికే వెనుకాడిన బీజేపీ ఎన్నికల ముందరే సుస్ప్రష్టంగా చెప్పేసింది. వారంతట వారుగా హామీలేమీ ఇవ్వలేదు. కూటమిగా ఇచ్చిన హామీలతో తమకు సంబంధం లేదు. అసలు రాష్ట్రంలోనే తమకు అవసరం లేదు అని. నరసాపురం నుండి గెలిచి అనామక కేంద్ర మంత్రిగా వెలగబెట్టే వెలగపండు అయితే కనీసం రాష్ట్రంలో సంభవించిన వరదల్లో జనాలను పరామర్శించడానికి కూడా పోలేదు. బాబు అయితే షాను వరద ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని చూడమంటే కనీసం కేంద్రం నుండి రూపాయి విదల్చలేదు. బాబు కూడా పరిహారం గట్టిగా అడిగితె ఎక్కడ అమరావతికి ఇచ్చే ఆ ముష్టిలో కూడా కన్నం వేస్తారేమో అని గొంతెత్తడు. వరద బాధితుల సహాయం నిమిత్తం బీజేపీ-వైసిపీస్ కూటమి తరపున ఒక్కడూ రూపాయి సహాయం ప్రకటించలేదు. ఇంకా కూటమి ఏముంది?

  5. వైసిపీస్ వారు లడ్డూ విషయంలో గానీ మరొకందుకు గానీ ప్రతిసారీ CBI విచారణ కోరుతున్నారంటే కారణాలు రెండు. CID అనే దాని స్వతంత్ర ప్రతిపత్తి తొలగించి ప్రతిపక్షాలను, ప్రశ్నించే సాధారణ పౌరులను ఎన్నిరకాలుగా హింసించ వచో వారికి చాలా బాగా అవగాహన ఉండటం. రెండవది. అమూల్, అదానీ తదితర గుజరాతీలు అప్పనంగా రాష్ట్ర సంపదను దోచిబెట్టి, అలాగే జిందాల్ వంటి వారికి సుపారీ పనులు కూడా చేసి పెట్టి మోడీ కనుసన్నల్లో పడి ‘మంచి బిడ్డ’గా పేరు తెచ్చుకొని అవినాష్ వంటి వారిని కూడా సిబిఐ officers ముందర కాలు మీద్ద కాలు వేసుకొని కూర్చునే ధైర్యాన్ని చూసి.

  6. ఒక విషయంలో విజయలక్ష్మి మాడమ్స్ చాలా మెరుగు. పెట్టిన comments తనకు నచ్చినా, నొప్పించినా శాంతంగా వుండి తన పనేదో తాను చేసుకుంటుంది. MBSx లాగా గోతి కాదా నక్కి అదే పనిగా comments ని moderate చేస్తూ, మరొక చేత్తో గుద్ది గుర్రాలకు పళ్ళు తోమడం కాకుండా.

  7. ఒక విషయంలో విజయలక్ష్మి మాడమ్స్ చాలా మెరుగు. పెట్టిన comments తనకు నచ్చినా, నొప్పించినా శాంతంగా వుండి తన పనేదో తాను చేసుకుంటుంది. MBSx లాగా పనిగా comments ని moderate చేస్తూ కోఇర్చోక.

  8. 100 days లో 100 డై పేర్లు మార్చడు , బాబు కేంద్రాన్ని ప్రశ్నిచమంటే,. కేంద్రం మె:ల్ల కన్ను తో కన్ను గీ:టింది, గాలి దీ:క్షలు చేసి ప్రశ్నిస్తున్నాడు ప్రజల్ని. అన్న అయితే అ:డవి:మా:లోకం , కే:శం ఒక కన్ను సీఎం కుర్చీ ఇంకో కన్ను ఎక్కడ నొ::క్కా::లో అక్కడ. టూ;కిగా ఇది వాస్తవం.

  9. రెండు తెలుగు రాష్ట్రాల్లో కచరా పాలన పోయింది , నీచుడు జగన్ రెడ్డి కి చీకటి మిత్రుడు ముక్కోడు కూడా చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నాడు రేపో మాపో అన్నట్టు ఉంది ముక్కోడి పరిస్థితి, నీచుడు జగన్ రెడ్డి దిష్టి బొమ్మలు తెలంగాణ లో తగలబెడుతున్నారు

  10. Privatization of all government assets and not able to secure grants for capital construction are also achievements of Kootami governance? Assaulting women, opposition party supporters and common people is also achievement of NDA kootami? Using government machinery for political leaders personal benefit is an achievement of Kootami? Not being able to alert people in a timely manner resulting in deaths of 50+ people is an achievement of Kootami? Selling free sand at premium price is an achievement of Kootami? Delaying six gurantees is an achievement of Kootami? Claiming lack of funds but spending money on personal security and stickers publicity is an ultimate achievement of Kootami governance?

  11. మోసం- మెగా డీఎస్సీపై మొదటి సంతకం

    మోసం- సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపు)

    మోసం – ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

    మోసం – మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

    మోసం – దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు

    మోసం – బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను

    మోసం – 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500

    మోసం -యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు

    మోసం – నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి

    మోసం – తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు

    మోసం – రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం

    ఒక్కకి మాత్రం నిజం – ఆంధ్ర బడ్జెట్ మొత్తం కే-బ్యాచ్ వాళ్ళ కి మాత్రమే

  12. వైసీపీ రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్‌ కృష్ణయ్య పార్టీ మారేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది

  13. దేవర టికెట్ ..Rs: 1000 అంట ….అవ్వ. అదే జగన్ ప్రభుత్వంలో కేవలం 25-300రూ.

    ఇప్పుడు జనాలు బాగా ఉంది

  14. మోసం- మెగా డీఎస్సీపై మొదటి సంతకం

    మోసం- సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపు)

    మోసం – ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

    మోసం – మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

    మోసం – దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు

    మోసం – బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను

    మోసం – 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500

    మోసం -యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు

    మోసం – నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి

    మోసం – తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు

    మోసం – రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం

    ఒక్కకి మాత్రం నిజం – ఆంధ్ర బడ్జెట్ మొత్తం కే-బ్యాచ్ వాళ్ళ కి మాత్రమే

  15. 2024 లో ఇప్పటి వరకు ..

     వాలంటీర్లకు వెన్నుపోటు

    పిం ఛన్లకోతకు వెన్నుపోటు

    ఉచితం ఇసుక వెన్నుపోటు

    మెగా డీఎస్సీ వెన్నుపోటు

    మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో వెన్నుపోటు

    ఉద్యోగుల కు వెన్నుపోటు

    చిన్న బాబు వెన్నుపోటు

    తల్లికి వందనం కు వెన్నుపోటు 

    అదిరిందయ్యా చంద్రం

  16. 100 రోజుల్లో…..

     వాలంటీర్లకు వెన్నుపోటు

    పిం ఛన్లకోతకు వెన్నుపోటు

    ఉచితం ఇసుక వెన్నుపోటు

    మెగా డీఎస్సీ వెన్నుపోటు

    మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో వెన్నుపోటు

    ఉద్యోగుల కు వెన్నుపోటు

    చిన్న బాబు వెన్నుపోటు

    తల్లికి వందనం కు వెన్నుపోటు 

    అదిరిందయ్యా చంద్రం

    1. ఈఏడాది అమ్మఒడి ఇవ్వలేము : లోకేష్

    2) ఖజానాలో డబ్బు లేదు అమరావతి కట్టలేం: నారాయణ

    3) ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదు : నాదెండ్ల మనోహర్

    4) ఆరోగ్యశ్రీ ఇవ్వలేం ఆయష్మాన్ భారత్ కార్డు తెచ్చుకోండి: పెమ్మసాని

    5) ఫ్రీ ఇసుక ఇవ్వలేము టన్నుకు 1200 కట్టాల్సిందే : చంద్రబాబు

    6) మా సూపర్ సిక్స్ హామీలు చూస్తేనే నాకు భయమేస్తుంది, హామీలు అమలు చేయలేను : చంద్రబాబు

    7) ప్రతి మహిళకు నెలకు 1500 ఊసే లేదు

    8) ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు శాంతిభద్రతల్లో దారుణంగా ఫెయిల్ అయ్యారు

    9) సంపద సృష్టి పక్కన పెడితే .. ఇప్పటి వరకు మొదలయిన 4 పోర్టులు,17 మెడికల్ కాలేజీల పనులు ఆగిపోయాయి

    10) ఒక్క పథకం ఇవ్వలేదు కానీ .. 32 వేల కోట్లు అప్పులు మాత్రం చేశారు.

    11) నాడు నేడు ఆగిపోయింది,ఐబీ సిలబస్ రద్దు ట్యాబ్ లు ఇస్తే విద్యార్థులు చెడిపోతారని పచ్చ మీడియాలో వక్ర కథనాలు

    ఐపాయ..

    100 రోజుల్లోనే చేతులెత్తేశారు

  17. 100 రోజుల్లో…..పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే, ఆ హామీలు అమలు చేయలేమన్న గుట్టు బయట పడుతుం దన్న “భయం ’’,.

  18. అసలు ఇప్పుడున్న బీజేపీ మొత్తం ఫేక్. మోడీ అసలు ఏమీ మాట్లాడట్లేదు. విచారణ చేపట్టి నిజాల్ని బయట పెట్టొచ్చు కదా. ఐతే చంద్ర బాబు లేకపోతె జగన్ తప్పవుతారు. హిందువుల కోసం అంటారు కదా మరి ఈ సైలెన్స్ ఏంటి? జగన్ రాసిన లేఖకి, చంద్ర బాబు చేసిన ఆరోపణకి సమాధానం ఏంటి?

  19. ఏళ్ల తరబడి … అదే దాడి…

    ఏడుకొండలను … రెండు కొండలు చేశారనడం…

    ఎక్కడో అడవిలో ఉండే వాచ్ టవర్ ని చూపించి… శిలువ అనడం…

    టికెట్స్ వెనకాల … ఇతర మత ప్రచారం చేస్తున్నారనడం..

    క్యాలెండర్ … పైన … దుష్ప్రచారం చేయడం…

    బ్రహ్మోత్సవాలకు డెకరేషన్ వేస్తే… T ఆకారం ఉందని శిలువ అనడం…

    ప్రసాదం తినడు.. అనడం…

    ఇప్పుడు మళ్లీ లడ్డూ నాటకం…

    మీ బతుకంతా ఇంతేనా రా… ఇందులో ఒక్కటైనా నిరూపణ ఐందా….

    ఏదోకటి వాగడం… జనాల్లో చర్చ లేపడం… అనుమానాలు పుట్టించడం… రాజకీయ లబ్ధి పొందడం…

    ఇష్టమొచ్చినట్టు … రాజకీయాలకు వాడుతున్నారు తిరుపతిని…

    మీకంటే తీవ్రవాదులు నయం కద

    ఒక ముఖ్య మంత్రి పర మతం పాటిస్తే… అది అడ్డు పెట్టుకొని ఇంత … నీచానికి దిగజారాలా?

    అతను ఏనాడైనా…ఓక మతానికి చెందిన వ్యక్తిలా ప్రవర్తించాడా?

    మీ బతులకు … ఏనాడైనా … ఒక హిందువులా కనపడ్డారా…

    పర మతం పాటించినా… అచ్చమైన హిందువులా నిండుగా ఉంటాడు అతను…

    మీ లాగా కల్తీ నాకొడుకు లాగా ఏరోజు ఉండడు…

    ఐనా దేవుళ్లకే కులాన్ని అంటగట్టిన …మీరు…

    నిజంగా … వాళ్లుంటే… మీ పతనం మాములుగా ఉండదు…

  20. ఏళ్ల తరబడి … అదే దాడి…

    ఏడుకొండలను … రెండు కొండలు చేశారనడం…

    ఎక్కడో అడవిలో ఉండే వాచ్ టవర్ ని చూపించి… శిలువ అనడం…

    టికెట్స్ వెనకాల … ఇతర మత ప్రచారం చేస్తున్నారనడం..

    క్యాలెండర్ … పైన … దుష్ప్రచారం చేయడం…

    బ్రహ్మోత్సవాలకు డెకరేషన్ వేస్తే… T ఆకారం ఉందని శిలువ అనడం…

    ప్రసాదం తినడు.. అనడం…

    ఇప్పుడు మళ్లీ లడ్డూ నాటకం…

    మీ బతుకంతా ఇంతేనా రా… ఇందులో ఒక్కటైనా నిరూపణ ఐందా….

    ఏదోకటి వాగడం… జనాల్లో చర్చ లేపడం… అనుమానాలు పుట్టించడం… రాజకీయ లబ్ధి పొందడం…

    ఇష్టమొచ్చినట్టు … రాజకీయాలకు వాడుతున్నారు తిరుపతిని…

    మీకంటే తీవ్రవాదులు నయం కద

    ఒక ముఖ్య మంత్రి పర మతం పాటిస్తే… అది అడ్డు పెట్టుకొని ఇంత … నీచానికి దిగజారాలా?

    అతను ఏనాడైనా…ఓక మతానికి చెందిన వ్యక్తిలా ప్రవర్తించాడా?

    మీ బతులకు … ఏనాడైనా … ఒక హిందువులా కనపడ్డారా…

    పర మతం పాటించినా… అచ్చమైన హిందువులా నిండుగా ఉంటాడు అతను…

    మీ లాగా కల్తీ నాకొడుకు లాగా ఏరోజు ఉండడు…

    ఐనా దేవుళ్లకే కులాన్ని అంటగట్టిన …మీరు…

    నిజంగా … వాళ్లుంటే… మీ పతనం మాములుగా ఉండదు…

  21. కల్తీ జరిగింది అని చెప్తున్న నెయ్యిని సప్లై చేసిన కంపెనీ మొదటిసారిగా జూన్ 12, 2024 న టీటీడీకి పంపింది..

    టీటీడీ వారు ఈ నెయ్యిని ప్రసాదంలో వాడకుండా టెస్ట్ కి పంపించారు,అక్కడ టెస్ట్ లో ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అనే రిపోర్ట్ వచ్చింది,కనుక ఈ నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపేసి ఆ సప్లై చేసిన కంపెనీ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాము అని EO చెప్పారు..

    టీటీడీ వెర్షన్ ఇలా ఉంటే..ఇక సీఎం చంద్రబాబు వెర్షన్ ఎలా ఉందంటే..

    తిరుమల శ్రీవారి ప్రసాదంలో గత ఐదేళ్లుగా గొడ్డు మాంసం కొవ్వు,చేప నూనె,పంది కొవ్వు కలిపిన నెయ్యితో లడ్డులు తయారు చేస్తున్నారని

    ఇదంతా జగన్ కుట్ర అని చంద్రబాబు అంటున్నారు…

    జగన్ టీటీడీ ని బ్రష్టు పట్టించాడు.. నేను ఇవన్నీ సరిచేస్తున్నాను..అని చంద్రబాబు అంటున్నారు..

    ఇందులో పాయింట్ నెం -1..

    టీటీడీ EO కల్తీ జరిగిన నెయ్యి ని వెనక్కి పంపేశాము అని చెప్తుంటే..సీఎం చంద్రబాబు గారేమో ఆ కల్తీ నెయ్యి తోనే ప్రసాదాలు చేశారు అని మాట్లాడుతున్నారు..

    ఇందులో పాయింట్ నెం – 2..

    ఈ కల్తీ నెయ్యిని సప్లై చేసిన కంపెనీ తేదీ ఎప్పుడు అని చూస్తే జూన్-12,2024 అంటే సీఎం చంద్రబాబు హయంలొనే కదా కల్తీ జరిగింది..

    ఇందులో పాయింట్ నెం-3..

    మంత్రి నారా లోకేష్ మొన్న ఈ విషయం మీద మాట్లాడుతూ టీటీడీ అనేది ఒక స్వతంత్ర బాడీ,సీఎం అనేవాళ్ళు EO మాత్రమే నియమిస్తారు..టీటీడీ లో జరిగే నిర్ణయాలతో సీఎం కు సంబంధం ఉండదు అన్నారు..

    ఇందులో పాయింట్ నెం – 4

    టీటీడీ నిర్ణయాల్లో సీఎంకు సంబంధం ఉండదు అన్న మీరే..గత టీటీడీ నిర్ణయాలకు జగన్ ని ఎందుకు బాద్యుడ్ని చేసి మాట్లాడుతున్నారు..??

    ఇందులో పాయింట్ నెం-5..

    మొన్నటి ఎన్నికల్లో కూటమి పార్టీలు కులాలను రెచ్చగొట్టి జగన్ ని ఓడించారు..ఇప్పుడు మతాన్ని రెచ్చగొట్టి జగన్ ను రాజకీయంగా ఇంకా దెబ్బకొట్టాలనే ఉద్దేశ్యం తప్ప ఈ వివాదంలో మరో కోణం కనబడటం లేదు..

    వీరి వికృత రాజకీయ క్రీడలో ఆ తిరుమల శ్రీవారి ప్రసాదం పావుగా మారడం చాలా విచారకరం..

  22. ●వంద రోజుల్లోనే చేతులెత్తేశారు..!

    ●అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా

    హామీలను పట్టించుకోని ఎమ్మెల్యే పరిటాల సునీత..!

    ●జాతీయ రహదారి పక్కన పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి కుచ్చుటోపీ..!

    ●జాకీ పరిశ్రమను రప్పిస్తామని చెప్పి పట్టించుకోని వైనం..!

    ●రామగిరి బంగారు గనులపై నోరుమెదపని సునీత..!

    ●హామీలపై ప్రశ్నిస్తున్న ప్రజలపై దాడులు..!

  23. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా…

    మరో 30 ఏళ్ళు మనదే అధికారం,

    వైనాట్ 175,

    చంద్రబాబు ఈజ్ నథింగ్,

    పన్నులతో వాయగొట్టా లేక అప్పులు తెచ్చా అనేది ప్రజలకు అనవసరం… బటన్ నొక్కుతున్నాను కాబట్టి ఓట్లు వేస్తారు,

    ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే… రాజధాని, పోలవరం లాంటి అంశాలు ప్రజలు పట్టించుకోరు,

    లాంటి బ్రహ్మాండమైన ఊహల్లో ఊరేగేవాడు

    11 సీట్ల పాతాళానికి పడిపోయి ప్రతిపక్ష నేత హోదా గల్లంతైపోయినా కూడా ఇంకా..

    ఈవీఎంలు టాంపరింగ్,

    5 ఏళ్ళు కళ్ళుమూసుకుంటే అధికారంలోకి వచ్చేస్తాం,

    లాంటి బ్రహ్మాండమైన ఊహల్లోనే ఊరేగుతున్నారు

    సైంటిఫికల్లీ ఇట్స్ కాల్డ్.. ఫాంటసీ .

    ఇల్యూషన్ అని కూడా అంటారు అనుకోండి

    అయినా.. మనకు కావలసింది కూడా అదే అనుకోండి .

Comments are closed.