జగన్ ని స్వామీజీ నిండు ఆశీర్వాదం…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి అద్భుతమైన ఆశీర్వాదం లభించింది. దసరా నవరాత్రుల వేళ విశాఖలోని శ్రీ శారదాపీఠంలో విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దానితో పాటు హోమాలు సైతం నిర్వహించారు. Advertisement ఇక పూర్ణాహుతి అనంతరం…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి అద్భుతమైన ఆశీర్వాదం లభించింది. దసరా నవరాత్రుల వేళ విశాఖలోని శ్రీ శారదాపీఠంలో విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దానితో పాటు హోమాలు సైతం నిర్వహించారు.

ఇక పూర్ణాహుతి అనంతరం స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అనుగ్రహభాషణ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ప్రత్యేకించి ఏపీ అన్ని రకాలైన  కష్టాల నుంచి బయటపడాలని స్వామీజీ కోరుకున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి అమ్మ వారి కరుణ ఉండాలని, ఆ తల్లి దయతో ఏపీలో సమస్యలు అన్నీ పరిష్కారం కావాలని స్వామీజీ కోరుకున్నారు. మొత్తానికి స్వామీజీ జగన్ కి ఆశీర్వాదం ఇవ్వడంతో వైసీపీ శ్రేణులు ఖుషీ అవుతున్నాయి. 

ఏపీలో ప్రస్తుతం అనేక ఇబ్బందులు ఉన్నాయి. స్వామీజీ ఇచ్చిన చల్లని  దీవెనల చలువతో వాటిని అధిగమించి జగన్ మరింతగా విజయవంతంగా ముందుకు సాగుతారని వైసీపీ నాయకులు విశ్వాస్వం వ్యక్తం చేస్తున్నారు.