డార్లింగ్ బిజినెస్ క్లోజ్

హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత నిర్మాత నిరంజన్ రెడ్డి అందిస్తున్న సినిమా డార్లింగ్. ప్రియదర్శి, నభా నటేష్ లతో నిర్మించిన మిడ్ రేంజ్ సినిమా. ఈ సినిమా ఈ నెల 19న సోలోగా…

హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత నిర్మాత నిరంజన్ రెడ్డి అందిస్తున్న సినిమా డార్లింగ్. ప్రియదర్శి, నభా నటేష్ లతో నిర్మించిన మిడ్ రేంజ్ సినిమా. ఈ సినిమా ఈ నెల 19న సోలోగా విడుదలవుతోంది. సోలోగా విడుదల అవుతుండడం, ఆ సినిమా తరువాత కూడా రెండు మూడు వారాల వరకు థియేటర్లకు పెద్దగా సినిమాలు ఏవీ రాని పరిస్థితి వుండడం గమనించిన బయ్యర్లు డార్లింగ్ సినిమాను దగ్గరకు తీసుకున్నారు.

నైజాం ఏరియాను మూడు కోట్ల మేరకు డబ్బులు ఇచ్చి మైత్రీ మూవీస్ సంస్థ తీసుకుంది. ఆంధ్ర ఏరియాను ఆసియన్ సురేష్ సంస్థ రెండున్నర కోట్లు ఇచ్చి తీసుకుంది. సీడెడ్ ను కూడా మంచి రేటుకే ఇచ్చేసారు. తమిళ దర్శకుడు అశ్విన్ ఈ సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించారు.

డార్లింగ్ సినిమాను చాలా సైలంట్ గా తీసేసారు. కానీ గత నెల రోజులుగా గట్టిగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రియదర్శి, నభా తో సహా నిర్మాత అదే పనిగా ప్రచారం సాగిస్తున్నారు. అనుదీప్, రాహుల్ రామకృష్ణ ఇలా చాలా మందిని వాడేసి మరీ ప్రచారం సాగించారు.

దాంతో సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్ వచ్చేస్తుంది అని అనలేము కానీ, డార్లింగ్ అనే సినిమా ఒకటి వస్తోందని ఆడియన్స్ లో రిజిస్టర్ అయింది. ఈ రోజుల్లో అదే ఎక్కువ. సినిమా విడుదలయిన తరువాత మౌత్ టాక్ మాత్రమే కీలకం.