కత్తి మహేష్ కు జగన్ సాయం

సోషల్ మీడియా యాక్టివిస్ట్ కత్తి మహేష్ చికిత్స కోసం ఆంధ్ర ప్రభుత్వం 17 లక్షలు మంజూరు చేసింది. రోడ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కత్తి మహేష్ ప్రస్తుతం చెన్నయ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.…

సోషల్ మీడియా యాక్టివిస్ట్ కత్తి మహేష్ చికిత్స కోసం ఆంధ్ర ప్రభుత్వం 17 లక్షలు మంజూరు చేసింది. రోడ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కత్తి మహేష్ ప్రస్తుతం చెన్నయ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వైకాపాకు మద్దతు దారునిగా వున్న మహేష్ పట్ల పార్టీ సానుకూలంగా స్పందించలేదని ఇటీవల విమర్శలు వినిపించాయి. ఇలాంటి నేపథ్యంలో సిఎమ్ రిలీఫ్ ఫండ్ నుంచి ఏకంగా 17 లక్షలు మంజూరు చేయడం విశేషం. 

ప్రభుత్వం ఇలా సకాలంలో స్పందించకపోయి వుంటే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్లు అయి వుండేది. దళితులను ప్రభుత్వానికి దూరం చేయాలని ప్రతిపక్షం అసలే తెగ ప్రయత్నం చేస్తోంది.

పార్టీకి చెందిన దళితనేతకే ఇలా చేస్తే మిగిలిన వారి సంగతి ఏమిటి అని ప్రతిపక్షం నిలదీసి వుండేది. ఇక ఇప్పుడా చాన్స్ వుండదు.