భూమా శోభా నాగిరెడ్డి మరణం ఆంధ్ర ప్రదేశ్ కే తీరని లోటు

శోభా నాగిరెడ్డి గారు ఏ పదవిని అలంకరించినా ఆ పదవికే శోభను తెచ్చిపెట్టిన గొప్ప నాయకురాలు ఆమె.  ఆమె మరణం ఆంధ్ర ప్రదేశ్ కే తీరని లోటు. అన్నా, అక్కాఅంటూ అందరినీ పలకరించుతూ ప్రకాశవంతమైన…

శోభా నాగిరెడ్డి గారు ఏ పదవిని అలంకరించినా ఆ పదవికే శోభను తెచ్చిపెట్టిన గొప్ప నాయకురాలు ఆమె.  ఆమె మరణం ఆంధ్ర ప్రదేశ్ కే తీరని లోటు. అన్నా, అక్కాఅంటూ అందరినీ పలకరించుతూ ప్రకాశవంతమైన చిరు నవ్వుతో కుటుంబ సభ్యుని మాదిరిగా కలుపుగోలుగా వుండే శోభా నాగిరెడ్డి గారు ఈ రోజు మన మధ్య లేక పోవడం మన దురద్రుష్టకరం. శోభా నాగిరెడ్డి విధి వక్రించి కారు ప్రమాదం లో మృతి చెందారని తెలియ చేయుటకు చింతించు చున్నాము. ఈ వార్త విని ప్రవాస భారతీయులు అందరు  శోకసముద్రం లో మునిగి పోయారు.

శోభా నాగిరెడ్డి  గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ (USA) ప్రతినిధులు ఆళ్ళ రామి రెడ్డి, గురవా రెడ్డి, రాఘవ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డి, రమేష్ అప్పారెడ్డి, హరి వేల్కుర్, శివ మేక, జ్యోతి రెడ్డి, శ్రీకాంత్ గుడిపాటి, విజయ్ బత్తుల మరియు ఇతరులు శోభా నాగిరెడ్డి  గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియ చేసారు. ఈ కష్ట కాలంలో భూమా నాగి రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించ వలసినదిగా ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాము.