ఇద్దరు హీరోయిన్లు.. రెండేళ్ల గ్యాప్.. మళ్లీ రీఎంట్రీ!

వాళ్లిద్దరి కెరీర్ దాదాపు ఒకేసారి ఆగిపోయింది. అయినప్పటికీ మళ్లీ అవకాశాలు సంపాదించారు. వాళ్లలో ఒకరు ఫ్లాప్ అయ్యారు. ఇప్పుడు మరొకరి జాతకం తేలాల్సి ఉంది. వాళ్లే రకుల్ ప్రీత్ సింగ్, నభా నటేష్. Advertisement…

వాళ్లిద్దరి కెరీర్ దాదాపు ఒకేసారి ఆగిపోయింది. అయినప్పటికీ మళ్లీ అవకాశాలు సంపాదించారు. వాళ్లలో ఒకరు ఫ్లాప్ అయ్యారు. ఇప్పుడు మరొకరి జాతకం తేలాల్సి ఉంది. వాళ్లే రకుల్ ప్రీత్ సింగ్, నభా నటేష్.

అప్పుడెప్పుడో వచ్చిన కొండపొలం సినిమా తర్వాత మళ్లీ టాలీవుడ్ స్క్రీన్ పై కనిపించలేదు రకుల్ ప్రీత్. మధ్యలో ఆమె నటించిన ఓ మూవీ తెలుగులో డబ్ అయినప్పటికీ థియేటర్లలోకి రాలేదు, నేరుగా ఓటీటీలో వచ్చిన ఆ సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు.

సో.. కొండపొలం తర్వాత రకుల్ నుంచి వచ్చిన ప్రాపర్ థియేట్రికల్ రిలీజ్ భారతీయుడు-2. నిజానికి ఇది కూడా డబ్బింగ్ సినిమానే. కాకపోతే భారీ సినిమా. కమల్ హాసన్, శంకర్ లాంటి లెజెండ్స్ వర్క్ చేసిన సినిమా కావడంతో తెలుగులో కూడా క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ తో టాలీవుడ్ లో మరోసారి మెరుద్దామనుకుంది రకుల్. కానీ ఆమె ఆశలు నెరవేరలేదు.

భారతీయుడు-2 సినిమాను తెలుగు ప్రేక్షకులు తిరస్కరించారు. ఇప్పటికే తెలుగులో సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న రకుల్ కు, భారతీయుడు-2 కూడా కలిసిరాలేదు.

ఇప్పుడు నభా నటేష్ వంతు వచ్చింది. యాక్సిడెంట్ వల్ల కెరీర్ కు రెండేళ్లు గ్యాప్ ఇచ్చింది నభా. ఆ తర్వాత చాలా ట్రై చేసినా అవకాశాలు రాలేదు. చివరికి తన సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ లో కూడా అవకాశం రాలేదు.

ఎట్టకేలకు డార్లింగ్ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. రీఎంట్రీలో రకుల్ ఆకట్టుకోలేకపోయింది, నభా సంగతి 19వ తేదీన తేలిపోతుంది.