జయసుధ- నిర్మాత.. రాజీ కుదిరినట్టే!

ఆర్ నారాయణ మూర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా సెట్స్ మీద చోటు చేసుకున్న వివాదం పరిష్కారం అయినట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య ఈ సినిమాకు సంబంధించిన వివాదం, సెట్స్ మీద నుంచి జయసుధ…

ఆర్ నారాయణ మూర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా సెట్స్ మీద చోటు చేసుకున్న వివాదం పరిష్కారం అయినట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య ఈ సినిమాకు సంబంధించిన వివాదం, సెట్స్ మీద నుంచి జయసుధ వెనక్కు వెళ్లిపోవడం  బాగా చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో జరిగిన పంచాయితీతో వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిందని సమాచారం.

ఈ సినిమాకు సంబంధించిన వర్గాలు ఇస్తున్న సమాచారం ప్రకారం.. జయసుధ షూటింగ్ కు లేట్ గా రావడంపై నిర్మాత ఫైర్ అయ్యాడు. ఆమె వ్యక్తిగత సిబ్బంది దగ్గర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన గట్టిగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిందేంటో తెలసుకోకుండా నిర్మాత కేకలేయడంపై కినుక వహించిన జయసుధ తిరుగుముఖం పట్టారు. ఆ రోజు షూటింగ్ రద్దు అయ్యింది. 

క్యాస్టూమ్స్ డిపార్ట్ మెంట్ చేసిన పొరపాటు వల్లనే ఆ వివాదం తలెత్తిందని, రేపటి సీన్ గురించి ముందే తెలుసుకుని.. అందుకు తగిన కాస్టూమ్స్ తో రావడం జయసుధకు అలవాటని, ఆమెకు సకాలంలో కాస్టూమ్స్ అందించలేకపోవడంతో ఆమె ఇంటి నుంచి రావడం కూడా ఆలస్యం అయ్యిందట. ఈ విషయం గుర్తించక నిర్మాత  అసహనం వ్యక్తం చేశాడట. అయితే తర్వాత విషయం తెలుసుకుని.. ఆయన శాంతించడం, జయసుధ కూడా ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకోవడం జరిగిందని అంటున్నారు.

ఇప్పుడు ఇరు వర్గాలూ రాజీ పడ్డాయని.. ఆమె తిరిగి షూటింగ్ కు హాజరవ్వడానికి సమ్మతం తెలియజేశారనే మాట వినిపిస్తోంది.