Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'జోహార్లు' సంతృప్తిగా లేదా?

'జోహార్లు' సంతృప్తిగా లేదా?

ఆడవాళ్లూ మీకు జోహార్లు. ఈ టైటిల్ లో వెంకీ-తిరుమల కిషోర్ కలిసి ఓ ప్రాజెక్టు సెట్ చేసుకున్నారు. త్వరలో ప్రారంభం కూడా అని వార్తలు వచ్చేసాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం వేరుగా వుంది. ఈ స్క్రిప్ట్ ఇంకా ఇటు హీరో వెంకీకి, అటు నిర్మాతకు కూడా శాటిస్ ఫైగా రాలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయమై దర్శకుడు కిషోర్ తిరుమల సీరియస్ గా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏనాడో దర్శకుడు బాలచందర్- హీరో కృష్ణం రాజు, జయసుధల కాంబినేషన్ లో తీసిన సినిమా టైటిల్ ఇది. ఇప్పటికీ మాంచి ఫాలోయింగ్ వుంటుందనడంలో సందేహం లేదు. అయితే డైరక్టర్ చెప్పిన లైన్ బాగానే వుంది కానీ, స్క్రిప్ట్ గా ఇంకా పక్కాగా సెట్ కాలేదని తెలుస్తోంది. దీంతో వెంకీ ఇచ్చిన ఇన్ పుట్స్ తీసుకుని దర్శకుడు స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నట్లు వినికిడి. ఈ సినిమాలో కథానాయిక గా నిత్య మీనన్ ను తీసుకున్న సంగతి తెలిసిందే.

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?