క్రిష్ కూడా సీక్వెల్ తీస్తాడ‌ట‌

ఓ సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చాక‌, హిట్టయ్యాక‌…. దాని సీక్వెల్ గురించి ఆలోచించ‌డం అల‌వాటే. టెంప‌ర్ రిజ‌ల్ట్ తో హ్యాపీగా ఉన్న పూరి.. ఇప్పుడు పార్ట్ 2పై దృష్టి పెట్టాడు. ఇప్పుడు క్రిష్ కూడా ఆ…

ఓ సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చాక‌, హిట్టయ్యాక‌…. దాని సీక్వెల్ గురించి ఆలోచించ‌డం అల‌వాటే. టెంప‌ర్ రిజ‌ల్ట్ తో హ్యాపీగా ఉన్న పూరి.. ఇప్పుడు పార్ట్ 2పై దృష్టి పెట్టాడు. ఇప్పుడు క్రిష్ కూడా ఆ బాట‌లోనే న‌డుస్తున్నాడ‌ట‌. త‌న రాబోయే సినిమాకి సీక్వెల్ తీయ‌డానికి రెడీ అయ్యాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. 

ఆయ‌న నిర్మాణంలో తెర‌కెక్కిన చిత్రం దాగుడుమూత‌ల దండాకోర్‌. ఈ సినిమాలో ఉషాకిర‌ణ్ మూవీస్ సంస్థ కూడా భాగ‌స్వామిగా వ్యవ‌హ‌రిస్తోంది. త్వర‌లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. విడుద‌ల‌కు ముందే ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు క్రిష్. సినిమా ఆసాంతం చూశాక‌… పార్ట్ 2 కూడా ఉంటే బాగుంటుంద‌ని భావించార‌ట‌. 

ఇప్పుడు అందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఓ కోడి పుంజు చుట్టూ అల్లిన ఈ క‌థ‌లో తాత – మ‌న‌వ‌రాళ్ల అనుబంధాన్ని చూపించ‌బోతున్నారు. తాత‌గా రాజేంద్ర ప్రసాద్‌, మ‌న‌వ‌రాలిగా బేబీ సారా అర్జున్ నటించారు. మ‌రి పార్ట్ 2లో ఎవ‌రు క‌నిపిస్తారో చూడాలి.