మోడీ దీక్ష చేపట్టిన ఐటమ్‌ బాంబ్‌

ఐటమ్‌ బాంబ్‌ రాఖీ సావంత్‌ నరేంద్రమోడీ వ్రతం చేస్తోందట. ఇంకో పదిహేనేళ్ళు నరేంద్రమోడీ భారత ప్రధానిగా వుంటారంటూ సెలవిచ్చింది రాఖీ సావంత్‌. అప్పటిదాకా రకరకాల డ్రెస్సులు, నరేంద్రమోడీ ఫొటోలతో సహా ధరిస్తానంంటూ రాఖీ సావంత్‌…

ఐటమ్‌ బాంబ్‌ రాఖీ సావంత్‌ నరేంద్రమోడీ వ్రతం చేస్తోందట. ఇంకో పదిహేనేళ్ళు నరేంద్రమోడీ భారత ప్రధానిగా వుంటారంటూ సెలవిచ్చింది రాఖీ సావంత్‌. అప్పటిదాకా రకరకాల డ్రెస్సులు, నరేంద్రమోడీ ఫొటోలతో సహా ధరిస్తానంంటూ రాఖీ సావంత్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

విదేశాల్లో ప్రీ ఇండిపెండెన్స్‌ బాష్‌ కార్యక్రమంలో పాల్గొన్న రాఖీ సావంత్‌, తన డ్రస్సు మీద నరేంద్రమోడీ ఫొటోలతో హల్‌చల్‌ చేసిన విషయం విదితమే. ఛాతీపైనా, పిరుదుల భాగంలో నరేంద్రమోడీ ఫొటోలు వుండే డ్రస్సుతో రాఖీ సావంత్‌ హడావిడి చేయడంతో, మోడీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టింగులు షురూ చేశారు. దాంతో, రాఖీసావంత్‌ అలర్ట్‌ అయ్యింది. 

'నేను నరేంద్రమోడీకి వీరాభిమానిని. ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధం. మోడీ పొటోలతో కూడిన చీరలు ధరిస్తాను.. మోడీ ఫొటోలతో రకరకాల డ్రస్సులు డిజైన్‌ చేయించుకుని ధరిస్తాను.. భారతదేశానికి ఆనరేంద్రమోడీనే అసలైన ప్రధాన మంత్రి..' అంటూ తన డ్రస్సింగ్‌పై రాఖీసావంత్‌ వివరణ ఇచ్చుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా దృష్టిలో పడేందుకే రాఖీ సావంత్‌, మోడీ ఫొటోలతో కూడిన డ్రెస్‌ని ధరించందట. 

కొసమెరుపు: నేను బీజేపీ కూతుర్ని.. నేను రాజ్‌నాథ్‌సింగ్‌ కూతుర్ని.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది రాఖీసావంత్‌. ఐటమ్‌ బాంబ్‌ రాఖీ సావంత్‌ ఏం చేసినా, అది సంచలనమే అనుకోవాలా.?