Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నిత్యామీనన్‌కి అదో సరదా

నిత్యామీనన్‌కి అదో సరదా

కెరీర్‌లో సక్సెస్‌లు, ప్రశంసలు, అవార్డులే కాదు.. వివాదాలూ ఆమెకు ఎక్కువే. వివాదాలంటే ఆమెకు అదో సరదా. అందుకే, సరదా సరదాగా మాట్లాడేస్తూ వివాదాల్లోకెక్కుతుంటుంది. దటీజ్‌ నిత్యామీనన్‌. 'ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు..' అని గతంలో నిత్యామీనన్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపేశాయి. ఆ తర్వాత ఎలాగో ఆ వివాదం సద్దుమణిగిందనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, తాజాగా 'జనతా గ్యారేజ్‌' ఆడియో విడుదల వేడుకలో నిత్యామీనన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 'తొలిసారి పెద్ద హీరోతో నటిస్తున్నాను.. ఈ స్థాయి రెస్పాన్స్‌ అభిమానుల నుంచి చూడటం ఇదే ప్రథమం. ఇంత పెద్ద ఈవెంట్‌లో ఎప్పుడూ పాల్గొనలేదు..' అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్‌ అభిమానుల్ని బాగా హర్ట్‌ చేసేశాయి. ఇంకేముంది, సోషల్‌ మీడియా వేదికగా బన్నీ అభిమానులు రచ్చ రచ్చ చేసేస్తున్నారు. 

ఒకప్పటికీ ఇప్పటికీ బాక్సాఫీస్‌ లెక్కల్లో చాలా తేడాలొచ్చేశాయి. ఎన్టీఆర్‌తో సమానంగా అల్లు అర్జున్‌ కూడా బాక్సాఫీస్‌ని శాసించేస్తున్నాడు. బ్యాక్‌ టు బ్యాక్‌ వరుస కమర్షియల్‌ హిట్స్‌తో అల్లు అర్జున్‌ తన రేంజ్‌ని అమాంతం పెంచేసుకున్నాడు. వసూళ్ళ పరంగా, ఎన్టీఆర్‌తో పోల్చితే బన్నీ గత మూడు సినిమాలూ టాప్‌లోనే వున్నాయి. ఇది అభిమానుల వాదన. బన్నీని తక్కువ చేసి, ఎన్టీఆర్‌ని ఎక్కువ చేస్తావా? అని నిత్యామీనన్‌ని ప్రశ్నించేస్తున్నారు బన్నీ అభిమానులు. 

పోన్లే, ఎలాగైతేనేం.. వివాదంతో అయినా పబ్లిసిటీ వచ్చేసిందిగా.. అని నిత్యామీనన్‌ సంబరపడ్తోందేమో.! అదే సమయంలో, బన్నీ అభిమానులు చేస్తున్న సోషల్‌ మీడియా ఫైట్‌ని, ఎన్టీఆర్‌ అభిమానులు ఎంజాయ్‌ చేస్తున్నారు. అల్లు అర్జున్‌తో 'సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి' సినిమాలో నిత్యామీనన్‌ నటించింది. ఇప్పుడు ఎన్టీఆర్‌తో నటిస్తోంది. మొత్తమ్మీద, ఎప్పుడూ ఫ్రెండ్స్‌లా ఉండే బన్నీ, ఎన్టీఆర్‌ అభిమానుల మధ్య నిత్యామీనన్‌ ఇలా చిచ్చుపెట్టిందన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?