స‌మంత ప్లేసు కొట్టేసింది

ఒక‌రు నో అన్న సినిమాని మ‌రొక‌రు ఒడిసిప‌ట్టేసుకోవ‌డం మామూలే. అయితే ఓ స్టార్ హీరోయిన్ కాద‌న్న పాత్ర కోసం.. ఓ వ‌ర్థమాన క‌థానాయిక‌ని ఎంచుకోవ‌డం మాత్రం అరుదుగా జ‌రిగే విష‌య‌మే. ఇప్పుడు అదే జ‌రిగింది.…

ఒక‌రు నో అన్న సినిమాని మ‌రొక‌రు ఒడిసిప‌ట్టేసుకోవ‌డం మామూలే. అయితే ఓ స్టార్ హీరోయిన్ కాద‌న్న పాత్ర కోసం.. ఓ వ‌ర్థమాన క‌థానాయిక‌ని ఎంచుకోవ‌డం మాత్రం అరుదుగా జ‌రిగే విష‌య‌మే. ఇప్పుడు అదే జ‌రిగింది. స‌మంత ప్లేసులోకి బ‌స్ స్టాప్ హీరోయిన్‌ శ్రీ‌దివ్య వ‌చ్చి చేరింది. 

మేట‌రేంటంటే.. మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన బెంగ‌ళూరు డేస్‌ని తెలుగులో రీమేక్ చేద్దామ‌ని పీవీపీ సంస్థ సంక‌ల్పించింది. ద‌ర్శకుడిగా భాస్కర్‌ని  ఎంచుకొన్నారు. సిద్దార్థ్‌, స‌మంత‌ల‌ను క‌థానాయిక‌లుగా అనుకొన్నారు. అంతలో ఏమైందో సిద్దూ త‌ప్పుకొన్నాడు. స‌మంత కూడా నో చెప్పింది. 

దాంతో ఇప్పుడు క‌థానాయిక‌గా శ్రీ‌దివ్యని ఎంచుకొన్నార‌ని తెలిసింది. హీరో ఎవ‌రో ఇంకొద్ది రోజుల్లో వెల్లడ‌వుతుంది. ఈ సినిమా ఎప్పుడో రీమేక్ కావ‌ల్సింది.  కానీ ప‌డుతూ లేస్తూ ముందుకు వెళ్తోంది. అస‌లు ఈ సినిమా ఉంటుందా అనే అనుమానాలూ వ్యక్తమ‌య్యాయి. అయితే పీవీపీసంస్థ ఇప్పుడిప్పుడే ఈ సినిమాపై దృష్టి పెట్టింది. మ‌రి ఎప్పుడు కొబ్బరికాయ్ కొడ‌తారో, ఏంటో.