Advertisement

Advertisement


Home > Movies - Movie News

మళ్లీ కలిశారు.. హ్యాట్రిక్ కొడతారా?

మళ్లీ కలిశారు.. హ్యాట్రిక్ కొడతారా?

మోస్ట్ ఎంటర్ టైనింగ్ కాంబినేషన్ కలిసింది. వెంకటేశ్, అనిల్ రావిపూడి సినిమా ప్రకటన వచ్చేసింది. భగవంత్ కేసరి తర్వాత అనీల్ రావిపూడి సినిమా ఇదేనని అందరికీ తెలుసు. దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమాను ఈ రోజు అధికారికంగా ప్రకటించారు.

వీళ్లిద్దరి కాంబినేషన్ అనగానే ఎఫ్2, ఎఫ్3 సినిమాలు గుర్తొస్తాయి. అయితే ఈసారి వాటికి భిన్నమైన కథతో వెంకీ సినిమా చేయబోతున్నాడు రావిపూడి. అయితే తన మార్క్, వెంకీ మార్క్ వినోదం మాత్రం మిస్సవ్వదని చెబుతున్నాడు.

ఈసారి వెంకీతో కలిసి ఓ క్రైమ్ సబ్జెక్ట్ చేయబోతున్నాడు అనీల్ రావిపూడి. కానీ ఇది సీరియస్ కథ మాత్రం కాదు. ట్రయాంగులర్ క్రైమ్ ఎంటర్ టైనర్ గా చెబుతున్నాడు. ఒక ఎక్స్-కాప్, ఒక ఎక్స్-గర్ల్ ఫ్రెండ్, ఒక ఎక్సలెంట్ భార్య మధ్య జరిగే కథతో ఈ సినిమా రాబోతోంది.

ఈ సినిమాను కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే విడుదల చేస్తామని ప్రకటించేశారు. ఈరోజు రవితేజ కూడా తన సినిమా సంక్రాంతికే అని ప్రకటించిన సంగతి తెలిసిందే. దిల్ రాజుకు ఇది 58వ చిత్రం. అనీల్ రావిపూడి, వెంకటేష్ సినిమాకు భీమ్స్ సంగీతం అందించే అవకాశం అందుకున్నాడు.

ఈ సంక్రాంతికి సైంధవ్ గా వచ్చి డిజాస్టర్ ఇచ్చాడు వెంకీ. వచ్చే సంక్రాంతికి అనీల్ రావిపూడితో కలిసి క్రైమ్ ఎంటర్ టైన్ మెంట్ అందించబోతున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?