Advertisement

Advertisement


Home > Movies - Movie News

గీతాంజలి ఎక్కడ్నుంచి వచ్చిందో చెప్పిన అంజలి

గీతాంజలి ఎక్కడ్నుంచి వచ్చిందో చెప్పిన అంజలి

కెరీర్ లో 50వ సినిమా మైలురాయికి చేరుకుంది హీరోయిన్ అంజలి. పైగా తన కెరీర్ లో సూపర్ హిట్టయిన సినిమాకు సీక్వెల్ గా 50వ చిత్రం రావడం మరింత హ్యాపీగా ఉందంటోంది. అదే 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమా. ఈ సీక్వెల్ స్టోరీ ఎక్కడ్నుంచి మొదలైందో చెప్పుకొచ్చింది.

"గీతాంజలి మళ్ళీ వచ్చింది..ఇదొక సీక్వెల్ కాబట్టి పాత క్యారెక్టర్స్ ను మార్చలేం. కాబట్టి కొత్త క్యారెక్టర్స్ ను స్టోరీలోకి తీసుకొచ్చాం. అలీ, సునీల్, సత్య లాంటి వాళ్లు యాడ్ అయ్యారు. పార్ట్ 1 ఎక్కడ ముగిసిందో, సీక్వెల్ అక్కడ నుంచే మొదలవుతుంది. పార్ట్-1 చూడని వాళ్లకు కూడా సీక్వెల్ అర్థమవుతుంది."

పేరుకు సీక్వెల్ అయినప్పటికీ గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా పూర్తిగా కొత్త కథతో వచ్చినట్టు స్పష్టం చేసింది అంజలి. ఈ సినిమా పాయింట్ ను నాలుగేళ్ల కిందటే కోన వెంకట్, అంజలికి చెప్పారట. అయితే ఆ టైమ్ లో అంజలి బిజీగా ఉందంట. ఆమె ఫ్రీ అయ్యే టైమ్ కు ఇతర నటీనటులు బిజీగా ఉండడం వల్ల కుదరలేదంట. ఆ తర్వాత కరోనా రావడంతో సినిమా మరింత లేట్ అయిందని అంటోంది అంజలి.

తను అంగీకరించిన సినిమాల్లో అన్నింటికంటే ముందు గేమ్ ఛేంజర్ స్టార్ట్ అయిందని, కానీ అది బాగా ఆలస్యమైందని.. ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్టార్ట్ చేశానని, అది కూడా లేట్ అయిందని, ఆ తర్వాత గీతాంజలి మళ్ళీవచ్చింది సినిమాను ప్రారంభించానని తెలిపింది అంజలి. ఇలా అన్నింటికంటే ఆలస్యంగా ప్రారంభమై, అన్నింటికంటే ముందుగా ఈ సీక్వెల్ రిలీజ్ అవుతోందని తెలిపింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?