Advertisement

Advertisement


Home > Movies - Movie News

హమ్మయ్య.. బ్రహ్మానందాన్ని బ్రాండ్ అడగలేదు!

హమ్మయ్య.. బ్రహ్మానందాన్ని బ్రాండ్ అడగలేదు!

తన షోకు ఎవ్వరొచ్చినా వాళ్ల మద్యం బ్రాండ్ ఏంటో అడిగి మరీ తెలుకోవడం మ్యాన్సన్ హౌజ్ బాలయ్యకు ఇష్టం. మోహన్ బాబు విస్కీ తాగుతారని, నాని రెడ్ వైన్ తాగుతాడని వాళ్ల నోటితోనే చెప్పించిన ఘనుడు బాలకృష్ణ. 

ఇదే కోవలో బ్రహ్మానందంతో కూడా ఆయన బ్రాండ్ చెప్పిస్తాడేమోనని అంతా అనుకున్నారు. కానీ బాలయ్య అడగలేదో, లేక బ్రహ్మానందం దాటేశారో తెలియదు కానీ.. ఈసారి వీళ్లిద్దరి మధ్య మద్యం ప్రస్తావన రాలేదు.

ఎప్పట్లానే బాలయ్య మాత్రం తను మద్యం తాగుతానని మరోసారి బయటపడ్డారు. బ్రహ్మానందంకు పెక్ (ఓ రకమైన పలకరింపు)ను పరిచయం చేసిన బాలయ్య.. పనిలోపనిగా రాత్రికి పెగ్ ఉంటుందని చెప్పుకొచ్చారు. దానికి కొనసాగింపుగా.. అంతకంటే ఇంకేం కావాలంటూ బ్రహ్మానందం ఆ టాపిక్ ను అక్కడితో ఆపేశారు.

అలా బ్రహ్మానందం, అత్యంత చాకచక్యంగా 'మద్యం ప్రశ్న' నుంచి తప్పించుకున్నారు. పక్కనే ఉన్న అనీల్ రావిపూడిని మాత్రం అతడి మద్యం బ్రాండ్ ఏంటని బాలకృష్ణ అడగలేదు, ఆయన కూడా చెప్పలేదు. అయితే ఇద్దరం కలిసి త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్నామనే విషయాన్ని మాత్రం బాలయ్య బయటపెట్టారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్-ఏఎన్నార్ లో ఎవరంటే ఇష్టం అని అడిగి బ్రహ్మానందాన్ని కాస్త ఇబ్బంది పెట్టారు బాలకృష్ణ. ఏఎన్నార్ ఇష్టమంటూ బ్రహ్మానందం చెప్పినట్టు తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయన్నారు. 

ఆ టైమ్ లో కాస్త ఇబ్బంది పడిన బ్రహ్మానందం.. ఎన్టీఆర్-ఏఎన్నార్ ఇండస్ట్రీకి రెండు కళ్లు అంటూ కవర్ చేసి తన అనుభవాన్ని చాటుకున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?