Advertisement

Advertisement


Home > Movies - Movie News

తన కోరిక తీరిందంటున్న పూజా హెగ్డే

తన కోరిక తీరిందంటున్న పూజా హెగ్డే

పాన్-ఇండియా హీరోయిన్ అనిపించుకోవడం ఏ నటికైనా కల. కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాళ్లలో ఏ హీరోయిన్ కైనా ఇదే డ్రీమ్ ఉంటుంది. కానీ అలాంటి అదృష్టవంతులు చాలా తక్కువమంది ఉంటారు. ఆ తక్కువమంది అదృష్టవంతుల్లో తను కూడా ఉన్నానని అంటోంది హీరోయిన్ పూజా హెగ్డే. పాన్-ఇండియా హీరోయిన్ అవ్వాలనే తన కోరిక, కల ఇన్నాళ్లకు నెరవేరిందని చెప్పుకొచ్చింది.

"హృతిక్ తో మొహంజదారో సినిమా చేసినప్పుడు చాలా కలలుకన్నాను. అదే నా పాన్ ఇండియా మూవీ అనుకున్నాను. కానీ మా అంచనాలకు తగ్గట్టు ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత కొన్ని సక్సెస్ లతో నేను వెనక్కి తిరిగి చూడలేదు. బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నాను. పాన్ ఇండియా యాక్టర్ అవ్వాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. ఆ కల ఇప్పుడు నిజమైందనుకుంటున్నాను."

ఫ్లాప్ వచ్చిన హీరోయిన్ కు అవకాశాలు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకురారని, తను కూడా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాని చెప్పింది పూజా హెగ్డే. కెరీర్ స్టార్టింగ్ లోనే అలాంటి చేదు అనుభవాలు చవిచూడడం, తనకు బాగా కలిసొచ్చిందని చెబుతోంది.

"ఫ్లాప్ హీరోయిన్ ను సినిమాలో పెట్టుకోవాలని ఎవ్వరూ అనుకోరు. నేను కూడా ఆ దశ చూశాను. ప్రతి సినిమా ఆడుతుందనే నమ్మకంతోనే చేస్తాం. ఇప్పుడు హిట్స్-ఫ్లాప్స్ కు అతీతంగా వ్యవహరించడం నేర్చుకున్నాను. ఓ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే దాన్నుంచి మానసికంగా బయటకొచ్చేస్తాను."

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్.. టాలీవుడ్ లో ప్రభాస్, కోలీవుడ్ లో విజయ్ సరసన నటిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?