భ‌ర్త‌తో క‌లిసి ఆమె భ‌య‌పెడుతోంది…

భ‌ర్త‌తో క‌లిసి న‌టి నిహారిక నెటిజ‌న్ల‌ను భ‌య‌పెడుతోంది. అక్టోబ‌ర్ 31 రాత్రి హ‌లోవీన్ పండుగ‌ను పురస్క‌రించుకుని నిహారిక త‌న భ‌ర్త చైత‌న్య‌తో క‌లిసి దెయ్యం గెట‌ప్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. అందుకు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో…

భ‌ర్త‌తో క‌లిసి న‌టి నిహారిక నెటిజ‌న్ల‌ను భ‌య‌పెడుతోంది. అక్టోబ‌ర్ 31 రాత్రి హ‌లోవీన్ పండుగ‌ను పురస్క‌రించుకుని నిహారిక త‌న భ‌ర్త చైత‌న్య‌తో క‌లిసి దెయ్యం గెట‌ప్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. అందుకు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

ఒకప్పుడు హాలోవీన్ పండుగ‌ను విదేశాల్లో మాత్ర‌మే జ‌రుపుకునే వారు. ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో ప్ర‌పంచ‌మంతా కుగ్రామమైంది. దీంతో హాలోవీన్‌ను మ‌న దేశంలో కూడా జ‌రుపుకుంటున్నారు. ఈ పండుగ ప్ర‌త్యేక‌త ఏంటంటే భ‌యాన‌క దుస్తుల్లో క‌నిపించ‌డం. ఆత్మ‌ల లోకం, మ‌న ప్ర‌పంచం మ‌ధ్య ఉన్న గోడ బ‌ల‌హీనంగా మారిన‌ప్పుడు దుష్ట‌శ‌క్తులు భూమిపైకి వ‌చ్చి, మాన‌వాళికి హాని క‌లిగిస్తాయ‌నే ప్ర‌చారం వుంది.

దీంతో హాలోవీన్ సంద‌ర్భంగా సెల‌బ్రిటీలంతా దెయ్యాల్లా మారి సంబంధిత‌ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ సంప్ర‌దాయాన్ని నిహారిక త‌న భ‌ర్త‌తో పాటించింది. చైత‌న్య‌, నిహారిక జంట దెయ్యాల గెట‌ప్‌లో కెమెరాకు ఫోజులిచ్చారు. 

అనంత‌రం వీటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం… వాటి వెనుక ఉద్దేశం తెలిసొచ్చింది. ఈ సంద‌ర్భంగా నిహారిక ఫ్యామిలీ ప్ర‌ముఖులు చిరంజీవి, వ‌రుణ్ తేజ్, సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌దిత‌రులు హాలోవీన్‌ను పుర‌స్క‌రించుకుని వేసిన వేషాల‌ను నెటిజ‌న్లు గుర్తు చేయ‌డం విశేషం.