ఇస్మార్ట్ పై రూమర్లు ఎవరి పని?

డబుల్ ఇస్మార్ట్ దసరా బరిలోకి వెళ్లిపోతోంది అంటూ ఉన్నట్లుండి వార్తలు పుట్టుకువచ్చాయి టాలీవుడ్ లో. కానీ అలాంటిది ఏమీ లేదని 11న వరంగల్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా వుందని యూనిట్ వర్గాలు…

డబుల్ ఇస్మార్ట్ దసరా బరిలోకి వెళ్లిపోతోంది అంటూ ఉన్నట్లుండి వార్తలు పుట్టుకువచ్చాయి టాలీవుడ్ లో. కానీ అలాంటిది ఏమీ లేదని 11న వరంగల్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా వుందని యూనిట్ వర్గాలు తెలిపాయి. పనిగట్టుకుని ఎవరో ఈ ప్రచారం చేస్తున్నారని యూనిట్ అనుమానం పడుతోంది.

డబుల్ ఇస్మార్ట్ విడుదలకు కొన్ని సమస్యలు వున్న మాట వాస్తవం. లైగర్ సినిమా నష్టాలకు సంబంధించి ఎగ్జిబిటర్ల తమకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. దానికి సబంధించి చర్చలు సాగుతున్నాయి. ఈ సమస్య నైజాంలో ఎక్కువగా వుంది. ఉత్తరాంధ్ర (వైజాగ్) తప్పిస్తే అంధ్రలో పెద్దగా సమస్య లేదు. సీడెడ్ లో కూడా పెద్దగా సమస్య లేదు.

విడుదలకు ఇంకా వారం రోజుల సమయం వుంది కనుక అన్ని సమస్యలు పరిష్కరించుకుని సినిమా థియేటర్ లోకి వస్తుందని తెలుస్తోంది. ఇలాంటి టైమ్ లో ఎందుకు ఇలాంటి రూమర్లు స్టార్ట్ అయ్యాయి అన్నది తెలియాల్సి వుంది. అగస్ట్ 15 న సినిమాల తాకిడి ఎక్కువ వుంది. వరుస సెలవులు వుండడంతో చాలా సినిమాలు ఈ డేట్ ను ఎంచుకున్నాయి. ఈ పోటీ నిజానికి ఎవరికీ లాభం కాదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇటు బచ్చన్ కానీ అటు ఇస్మార్ట్ కానీ 35 నుంచి 45 కోట్లు కనీసం వసూలు చేయాల్సి వుంటుంది.

డబుల్ ఇస్మార్ట్ సినిమాలో రామ్- కావ్య ధాపర్- సంజ‌య్ దత్ కీలకపాత్రల్లో నటించారు. పూరి దర్శకుడు. చార్మి నిర్మాత. మణిశర్మ సంగీతం అందించారు. ఇస్మార్ట్ శంకర్ హిట్ ప్రభావం ఈ సీక్వెల్ మీద బలంగా వుంది.

5 Replies to “ఇస్మార్ట్ పై రూమర్లు ఎవరి పని?”

Comments are closed.