Advertisement

Advertisement


Home > Movies - Press Releases

`జైసేన` చిత్రం రైతులకు అంకితం

`జైసేన` చిత్రం రైతులకు అంకితం

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో కార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌లను హీరోలుగా పరిచయం చేస్తూ వి.సముద్ర డైరక్షన్ లో నిర్మించిన సినిమా జైసేన. వి.సాయి అరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి  ఇప్పటికే టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాటలు విడుదలయ్యాయి. 

ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయబోతున్నారు. ఈ సంద‌ర్భంగా యూనిట్ మీడియా మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. ఈ కార్య‌క్ర‌మంలో న‌టుడు సునీల్‌, దర్శకుడు సముద్ర, న‌టులు  కార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్ పాల్గొన్నారు...

న‌టుడు సునీల్ మాట్లాడుతూ - ``ఒక రైతుకు మ‌న అవ‌స‌రం లేకున్నా.. మ‌నంద‌రికీ రైతు అవ‌స‌రం త‌ప్ప‌కుండా ఉంటుంది. ఇలాంటి మంచి సినిమాల్లో న‌టించే అవ‌కాశం చాలా రేర్‌గా వ‌స్తుంది. రైతుల స‌మ‌స్య‌ల‌ని ప‌దిమందికి చెబుతూ ఒక మంచి ప‌రిష్కారాన్ని చూపించ‌డం చాలా గొప్ప‌ విష‌యం`` అన్నారు.

చిత్ర దర్శకుడు సముద్ర మాట్లాడుతూ  -  `` జైసేన అన‌గానే అంద‌రికీ జ‌న‌సేన అన్న‌ట్టుగా విన‌ప‌డుతుంది. అది నిజ‌మే ఎందుకంటే జైసేన సినిమా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ భావాల‌కు ద‌గ్గ‌రిగా ఉండే సినిమా. అలాగే రైతుల స‌మ‌స్య‌లు సినిమాలో ఈ చ‌ర్చించ‌డం జ‌రిగింది. రైతుల‌కు న్యాయం జ‌రిగే విధంగా ఒక మంచి ప‌రిష్కారాన్ని కూడా ఈ మూవీలో చూపించాం.

అందుకే ఈ సినిమాని రైతుల‌కి అంకితం చేస్తున్నాం.  రైతుల‌కి స‌పోర్ట్ అందించ‌డం మ‌నంద‌రి భాధ్య‌త అని చెప్పే సినిమా. రైతుల కోసం తీసిన కాబ‌ట్టి రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఈ సినిమాకి ట్యాక్స్ మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

హీరో ప్ర‌వీణ్ , హీరో అభిరామ్ మాట్లాడుతూ - ``జ‌న‌వ‌రి 29న మీముందుకు వ‌స్తున్నాం. మా తొలి ప్ర‌యత్నాన్ని మీరంద‌రూ ఆదరించాల‌ని కోరుకుంటున్నాము`` అన్నారు.

కో ప్రొడ్యూస‌ర్స్ శిరీష్ రెడ్డి, శ్రీ‌నివాస్ రెడ్డి మాట్లాడుతూ  - ``మా టీమ్ అంద‌రూ ఎంతో క‌ష్ట‌ప‌డి తీసిన జైసేన సినిమా జ‌న‌వ‌రి 29 విడుద‌ల‌వుతున్నందుకు హ్యాపీగా ఉంది. రైతుల మీద మంచి స‌బ్జెక్ట్‌తో తీసిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాం`` అన్నారు.

ఏపీలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలయ్యేనా?

క‌థ మొత్తం బంగారం చూట్టే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?