వైసీపీకి చిక్కని విశాఖ

విశాఖ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం కొరకరాని కొయ్యగా మారిపోయింది. అందరినీ ఆదరించిన ఈ నేల వైసీపీని మాత్రం తోసిరాజంటోంది.

విశాఖ మహానగరం విభజన ఆంధ్రలో అతి పెద్ద నగరం. హైదరాబాద్‌ తరువాత అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలూ కలసిమెలసి ఉండేందుకు ఆమోదయోగ్యమైన నగరం. కాస్మోపాలిటిన్‌ సిటీగా పేరు తెచ్చుకుంది. సంకుచిత భావాలు లేని నగరంగానూ ఉంది. ఎవరైనా ఎక్కడ నుంచి అయినా రావచ్చు. ఎన్నికలలో పోటీ చేయవచ్చు. గెలిచి ప్రజా ప్రతినిధులుగా రాణించవచ్చు. అలాగే వ్యాపార వ్యవహారాలు కూడా విశాఖ గడ్డ మీద నుంచి హాయిగా స్వేచ్చగా చేసుకోవచ్చు.

విశాఖలో సముద్రం ఉంది. అంతటి విశాల హృదయం జనంలోనూ ఉంది. ఇక్కడ స్ధానికులకే పట్టం కట్టాలన్న విభజన రేఖ అయితే ఎవరూ గీయలేదు. అందుకే గడచినా మూడున్నర దశాబ్దాలుగా చూస్తూంటే విశాఖ వేగంగా ఎదుగుతోంది. అంతే వేగంగా ఇతర ప్రాంతాల వారు వచ్చి విశాఖను తమ గమ్యంగా చేసుకుని ఎంచుకున్న రంగంలో విజయం సాధిస్తున్నారు. అటువంటి విశాఖ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం కొరకరాని కొయ్యగా మారిపోయింది. అందరినీ ఆదరించిన ఈ నేల వైసీపీని మాత్రం తోసిరాజంటోంది. ఎందుకిలా అన్నదే రాజకీయంగా చర్చ సాగుతోంది.

విశాఖను వైసీపీ తప్పుగా అర్ధం చేసుకుందా లేక వైసీపీని విశాఖ సరిగ్గా అవగాహన చేసుకోలేదా అన్నది మాత్రం ఎవరికీ తెలియడంలేదు. ప్రత్యేకించి వైసీపీ వర్గాలకు అసలు అర్ధం కావడంలేదు. వైసీపీ పుట్టిన తరువాత అన్ని జిల్లాలలోనూ జెండా ఎగరవేసింది, ఒక్క విశాఖ నగరంలో తప్ప. విశాఖ నగరవాసులు మాత్రం వైసీపీని నమ్మడంలేదు.

వైసీపీ రాజకీయంగా చేసిన ప్రయోగాల వల్ల కూడా విశాఖ జనం అభిమానాన్ని చూరగొనడంలో విఫలం అయింది అనుకోవాలి. ఆది నుంచి విశాఖ టీడీపీకి కంచుకోట. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీని కూడా సమానంగానే ఆదరించింది. విశాఖ మేయర్‌ పదవులు కానీ, నగరంలో ఎమ్మెల్యే పదవులు ఎంపీ పదవులు కానీ కాంగ్రెస్‌ అనేక పర్యాయాలు గెలుచుకుంది. టీడీపీకి ధీటుగా నిలబడింది. అయితే కాంగ్రెస్‌ పతనం అయ్యాక ఆ స్ధానంలోకి వచ్చిన వైసీపీ మాత్రం విశాఖ జనం ఆదరణను ఆ స్ధాయిలో కాదు కానీ ఏ స్ధాయిలోనూ అందుకోవడంలో విఫలం అవుతోంది. దానికి కారణం ఏమిటి అంటే సవాలక్ష అని చెప్పాలి.

విశాఖలో కాంగ్రెస్‌కు స్ధానిక నాయకత్వం గట్టిగా ఉండేది. అనేకమంది స్ధానిక నాయకులు కాంగ్రెస్‌ను నడిపించారు. ఆ పార్టీలో ఉండి వారు విజయాలు అందుకున్నారు. బలమైన సామాజిక వర్గాలకు చెందిన నాయకులు కూడా కాంగ్రెస్‌లో ఉండేవారు. పూర్వం నుంచి ఉన్న పార్టీ కాబట్టి సమర్ధులైన నేతలకు కాంగ్రెస్‌లో కొదవ లేకుండా పోయేది. కాంగ్రెస్‌ సైతం స్ధానిక నేతలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేది. అలా ఒక ద్రోణంరాజు సత్యనారాయణ, గుడివాడ గురునాధరావు, మరియాదాస్‌, సూర్యనారాయణరెడ్డి, సబ్బం హరి, తిప్పల గురుమూర్తిరెడ్డి, ఇలా వివిధ సామాజిక వర్గాల సమాహారంగా కాంగ్రెస్‌ ఉండేది.

భీమునిపట్నం, నర్శీపట్నంలలో చూస్తే క్షత్రియ సామాజికవర్గాన్ని ఆదరించేది. అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ వంటి వారిని ప్రోత్సహించి అక్కడ గవర సామాజికవర్గాన్ని దరి చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్‌ మాది అన్ని అన్ని ప్రాంతాలు వర్గాలు కూడా అనుకునేలా ఆ పార్టీ తీరు ఉండేది. అదే వైసీపీ దగ్గరకు వచ్చేసరికి స్ధానికులకు ప్రాధాన్యత ఇవ్వడం మొదటి నుంచీ లేకుండా పోయింది అన్న విమర్శలు ఉన్నాయి.

2014 ఎన్నికలలో చూస్తే వైసీపీ తరఫున విశాఖ నుంచి లోక్‌సభకు వైఎస్‌ జగన్‌ తల్లి విజయమ్మను దింపారు. ఆ ఆలోచన ఎవరికి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ అది బూమరాంగ్‌ అయింది. ఆమె కడప నుంచి వచ్చి పోటీ చేస్తున్నారు, విశాఖలో కడప సంస్కృతి అంటూ భయాందోళనలను లేవదీసింది టీడీపీ. ఆ ఎన్నికలలో రాష్ట్రంలోనూ వైసీపీ ఓడింది, విశాఖలోనూ విజయమ్మ ఓడారు. ఆ ప్రభావంతో నగరం జిల్లాలోని అన్ని సీట్లూ పోయాయి.

అదే 2019లో చూస్తే వైసీపీకి ప్రభంజనం వీచింది. దాంతో విశాఖ జిల్లాలో ఆ పార్టీ అన్ని సీట్లను గెలుచుకున్నా సిటీలో మాత్రం టీడీపీదే పైచేయి అయింది. 2014 నాటి టీడీపీ ప్రచార ప్రభావం అలాగే జనంలో ఉండిపోయింది. దానిని అధిగమించేందుకు స్ధానిక నాయకత్వాన్ని వైసీపీ పెద్దగా ప్రోత్సహించినది లేదు. జిల్లా పగ్గాలను స్ధానికులకు అప్పగించినా రీజనల్‌ కో ఆర్డినేటర్‌ పేరుతో వి విజయసాయిరెడ్డిని తెచ్చి పెట్టారు. దాంతో మళ్లీ టీడీపీకి వైసీపీ మీద బలంగా వ్యతిరేక ప్రచారం చేసే అవకాశం లభించింది.

అయితే 2019 ఎన్నికలలో ఒక తమాషా జరిగింది. జనసేన విడిగా పోటీ చేయడం వల్ల విశాఖ ఎంపీ సీటు స్వల్ప తేడాలో వైసీపీ గెలుచుకుంది. ఇక 2021లో విశాఖ మేయర్‌తో పాటు కార్పోరేషన్‌ను గెలుచుకోవడం కూడా వైసీపీ అధికారంలో ఉండడం వల్లనే సాధ్యపడింది. అయితే విశాఖవాసులు మాత్రం వైసీపీని నమ్మేలా ఆ పార్టీ తనకు అధికారం దక్కిన నేపధ్యంలోనూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

కడప రెడ్లు విశాఖలో భూకబ్జాలకు పాల్పడుతున్నారు అంటూ టీడీపీ చేసిన ప్రచారమే జనాల మెదళ్లలో ఎక్కింది. అది ఎంతలా అంటే రాజధాని విశాఖకు వస్తే భూములు అందరివీ గల్లంతు అవుతాయన్న దశకు చేరుకుంది. అయినా అలాంటి విష ప్రచారాన్ని తిప్పికొట్టే బలమైన స్ధానిక నాయకత్వం కరవు అయింది. ఎంతసేపూ విజయసాయిరెడ్డి లేకపోతే వైవీ సుబ్బారెడ్డి తప్పించి స్ధానిక నాయకులకు పగ్గాలు అప్పగించాలన్న ఆలోచన వైసీపీ అధినాయకత్వానికి లేకపోవడం వల్ల కూడా జనం ఆ పార్టీని విశ్వసించకపోవడానికి మరో కారణం.

మరో వైపు చూస్తే టీడీపీలో కూడా వలస నేతలు ఉన్నారు. వారంతా విశాఖలో దశాబ్దాలుగా నివాసం ఏర్పాటుచేసుకుని లోకల్‌ కార్డును సంపాదించారు. దాంతో వారి విషయంలో అంతా బాగానే ఉంటోంది. వైసీపీ కూడా స్ధానిక నాయకులకు కీలక పాత్ర ఉండేలా చూసి ఇతర నాయకులను కూడా తెచ్చినా అభ్యంతరం లేకపోయేది. దానికి తోడు వైసీపీ మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా తిప్పికొట్టే నాయకులు లేరు. సబ్బం హరి, కొణతాల రామకృష్ణ వంటి ప్రముఖ నాయకులు వైసీపీలో చేరినా పార్టీ వారిని ఉంచుకోలేకపోయింది. ఇది కూడా ప్రతికూల రాజకీయానికి కారణం అయింది.

అందుకే ఏ ఎన్నిక జరిగినా వైసీపీ ఓటమిని విశాఖ రాస్తోంది. ఇప్పటికైనా విశాఖ వాసుల మనోభావాలను గ్రహించి దానికి అనుగుణంగా అన్ని సామాజికవర్గాలను దరి చేర్చుకుని స్ధానికంగా పటిష్టమైన నాయకత్వాన్ని వైసీపీ తీర్చిదిద్దుకుంటే తప్పకుండా ఆదరణ లభిస్తుంది అన్నది ఒక విశ్లేషణ.

44 Replies to “వైసీపీకి చిక్కని విశాఖ”

  1. ఈ మధ్య జగన్ రెడ్డి మీటింగుల్లో సొల్లు వింటుంటే హాయిగా నిద్ర వస్తోంది..

    వైసీపీ నాయకులకు తమ భవిష్యత్తు మీద నమ్మకం లేదు.. ఒక రొడ్డ కొట్టుడు వ్యవహారం లాగా తయారయ్యింది..

    ఎందుకు ఓడిపోయారో… ఇప్పటివరకు ఒక్క మీటింగ్ కూడా లేదు.. ఓటమి మీద చర్చే జరగలేదు..

    శవాలకోసం వేట.. సాక్షి లో అబద్ధాల రాత.. ఇదే వైసీపీ నినాదం..

  2. ఈ మధ్య జగన్ రెడ్డి మీటింగుల్లో సొల్లు వింటుంటే హాయిగా నిద్ర వస్తోంది..

    వైసీపీ నాయకులకు తమ భవిష్యత్తు మీద నమ్మకం లేదు.. ఒక రొడ్డకొట్టుడు వ్యవహారం లాగా తయారయ్యింది..

    ఎందుకు ఓడిపోయారో… ఇప్పటివరకు ఒక్క మీటింగ్ కూడా లేదు.. ఓటమి మీద చర్చే జరగలేదు..

    శవాలకోసం వేట.. సాక్షి లో అబద్ధాల రాత.. ఇదే వైసీపీ నినాదం..

    1. ఓడిపోయిన ఎం.ఎల్.ఏ. ఎవడైనా వచ్చి ఇది సమస్య అని చెప్పబొతే “నాలుగేళ్లు నిద్రపోదాం, తర్వాత నేను పాదయాత్ర చేస్తా. ఆఫ్టర్ ఫైవ్ యియర్స్ ఐ విల్ బి ద కింగ్” అని ఆ ఒక్కటి అడక్కు సినిమాలో రాజేంద్రప్రసాద్‌లాగా అంటున్నాడంట

  3. Lulu group ni pommannadu, Adani data center emaindo teliyadu..Anthaka mundu vunna HSBC, Infosys lanti vallu kuda pack chesukuni poyaru anna daya valla..Inka ye moham pettukuni janalu votlu vestharu..YCP vallu adhikaram addam pettukuni rajadhani peru cheppi chesina land grabbings anni inni kavu..Very soon anni bayataki vasthay

  4. No educated person likes YCP except some castists. Vizag is cosmo city full of well educated people. They never like YCP. Jagan even offered capital city. No takers. How can you compare educated people like Bharat and local gand*u leaders from YCP.

  5. YCP can never win in Vizag. Kootami has its own caste and cader balam in Vizag. Kootami owns Vizag. Even reddies in Vizag do voodigam to Kootami ra GA. That is the power of Kootami in Vizag. Go and cry somewhere else ra jaffa.

  6. పోయిన ఎలెక్షన్లలో ఆంద్ర ప్రదేశ్ లో యాభై శాతానికి పైగా పిచ్చొల్లు ఉండేవాళ్ళు. మన జగనన్న దెబ్బకి పది శాతం మందికి పిచ్చ్చి తగ్గింది.

  7. YCP can never win in Vizag. Kootami has its own caste and cader balam in Vizag. Kootami owns Vizag. Even reddies in Vizag do work for Kootami ra GA. That is the power of Kootami in Vizag. Go and cry somewhere else ra jaffa.

  8. YCP can never win in Vizag. Kootami has its own caste and cader balam in Vizag. Kootami owns Vizag. Even reddies in Vizag do work for Kootami ra GA. That is the power of Kootami in Vizag. Go and cry somewhere else jaffa.

  9. YCP can never win in Vizag. Kootami has its own caste and cader balam in Vizag. Kootami owns Vizag. Even reddies in Vizag do work for Kootami. That is the power of Kootami in Vizag. Go and cry somewhere else jaffa.

  10. మాకు మీరు చూపించబోయిన అభివృద్ధి వద్దు – విశాఖను ఒక ల్యాండ్ బ్యాంక్‌గా చేసుకుని భూమిని దోచుకున్నారు – స్టీల్ ప్లాంట్‌ను అమ్మేసి దాన్ని సొమ్ము చేసుకుందామనుకున్నారు – అభివృద్ధి అంటే విరక్తి పుడుతుంది విశాఖ ప్రజలకు – అంత అందంగా, ఆనందకరంగా ఉండేది – పిల్లలు అందరూ చదువు మీద నమ్మకంతో ఉండేవారు – ఇప్పుడు ఈజీ మనీ, గంజాయి అలవాటు చేసారు దరిద్రులు – మా విశాఖ మాకు దక్కడానికి సమయం పడుతుంది – మీ దిక్కుమాలిన అభివృద్ధి మాకు వద్దు – విశాఖను కేంద్రంగా రాజకీయం చేసి సర్వనాశనం చేసారు – చాలు మమ్మల్ని వదిలేయండి – మా జీవితం మేము బ్రతుకుతాం. మీ అభివృద్ధి మీ ప్రాంతంలో చేసుకోండి మొదట.

  11. జగన్ వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పిన రోజే, జగన్ ను ఓడించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు విశాఖ ప్రజలు. జగన్ ఒక్కడి అభివృద్ధి కోసం విశాఖ ను త్యాగం చేసుకోరు విశాఖ వాసులు. జగన్ కు జీవితకాల శాపం విశాఖ, అమరావతి.

  12. ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోండి ది గ్రేట్ ఆంధ్ర వారు మీలాంటి జర్నలిజం వారు, సాక్షి వారిని నమ్ముకొని వైసీపీ గుడిసి పోయింది. మీరు ఎంతసేపు భజన తప్ప నిజాలు రాయడం మానేశారు, అదేవిధంగా అధికారం ఉందనే అహంకారం.. వ్యవస్థల్ని నాశనం చేయడం ఇవన్నీ విశాఖపట్నం ప్రజలు గమనించలేరా, అదేవిధంగా విశాఖలో నాయకులు మహామహులు ఉండగా విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి మాత్రమే ఎందుకు అనేది ఆ మాత్రం ఆలోచన లేని అజ్ఞానులు కాదు విశాఖ ప్రజలు. వాస్తవాలు రాస్తే చరిత్రలో మీకో పేజీ ఉంటుంది లేదంటే పేజీలు చిరిగిపోతాయి 👍🏻

  13. రేయ్ గ్రేట్ ఆంధ్ర మొత్తానికి నీ వైసీపీ భజన ఆపుకోలేకపోతున్నావు కందకు లేని దురద కత్తి పీటకెందుకని జగన్ అండ్ కో టీమ్ కి లేని దురద నీకెందుకు. ఒక్క విశాఖ మాత్రమే ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మొత్తం వైసీపీని నమ్మడం లేదు అందుకే మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జగన్ రెడ్డిని చిత్తుగా ఓడించారు

  14. 2004 ninchi 2009 madyalo tier-2 city lo real estate tier-1 kanna 10 times penchesaru .. city chuttu sez le … Mundhugane akkada land koratha.. vennulo vanuku -ee word correct ga suit avutundhi akkada janalaki anna ante.

  15. విశాఖపట్నం ప్రజలు వెధవలు ఎవరో మంచివారు ఎవరో త్వరగా గ్రహించ గల వారు… ఒక్కసారి వీడు వెధవ అని తెలుసుకుంటే ఇక వాడిని దగ్గరకు రానిళహవ్వరు.

  16. ఇప్పుడు పిక్కొండి చంద్ర బాబు వి బాలకృష్ణ అల్లుడు యూనివర్సిటీ పేరుతో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన

    అంత తెలివి కల ప్రజలు ఎక్కడ పడుకున్నారు

  17. అధికారం లొ ఉన్నాం అని ఎగిరెగిరి పడ్డాడు, పాపం ఇప్పుడు కరుసై పొయాడు.

  18. “సాక్షాత్తు మహిళ ఐన Jeggulu ఆ0టీ” పవన్ అంకుల్ తో h*neymoon కోసం లండన్ కి ప్రపోజల్ పెట్టి PASSPORT ready చేసుకుంది.

    Waiting..

  19. అదంతా కాదు, hoodhudh తుఫాన్ నుంచి బాబు ఇమేజ్ పీక్స్ కి చేరిపోయింది వైజాగ్ లో. ఒక పని చేసే ముఖ్యమంత్రి అంటే ప్రజలకి ఇష్టం. అదీ చదువుకున్న ప్రజలకి మరీ ఇష్టం.

  20. విశాఖపట్నం జిల్లాలో నగరం చివరి గ్రామాలు కూడా స్థానికులు కంటే స్థానికేతరులు అన్ని రంగాల్లో రాణించిన చరిత్ర ఉంది. ఆర్ధికంగా బలమైన సామాజిక వర్గానికి విద్య వైద్యం ప్రైవేటు వ్యాపారులే సంస్థల ఆధిపత్యం సాధించింది. మొదట్లో కాంగ్రెస్ పార్టీకి తదుపరి టీడీపీకి వీరు సారధ్యం వహించారు. వైయస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం వచ్చిన పార్టీ వైసీపీకి వలస వచ్చిన వారు నిలకడగా ఉండే పరిస్థితి లేదు. అందరిలో పదవీ కాంక్ష ఆధిపత్యం కోసం మాత్రమే పనిచేసే వారు ఉండలేరు. ఎంతోమంది ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన లాభనష్టాలు జయాపజయాలు మామూలే. రాజకీయ కాంక్షతో కక్ష కట్టి 16 నెలల పాటు జైల్లో పెట్టినప్పటికీ ఏమాత్రమూ తొణకలేదు బెణకలేదు. ఇప్పటి ఓటమి కేవలం ఢిల్లీ చేసిన మాయాజాలం వల్లే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది. వైసీపీ ఓడిపోలేదు మోసపోయింది ప్రజలే చెబుతున్నారు.

  21. Amaravathia capital kavalani enthala korukunnaro , Vizag ni Capital vaddani antha kante ekkuva korukunnaru , Capital ani cheppaka migration ekkuva ayyi city nasanam ayyindhi.

  22. Vizag local means lesser than 30% are natives. 70% are working visitors. Outsiders don’t bother about the administration or politics. Local governance faces the same disagreement with people. Except one or two leaders are local. Existing MLA MPs are visitors of the town.

Comments are closed.