ఇంత విచిత్రంగా పవన్ మాత్రమే అనగలరు!

భవనాలు వేస్టుగా ఉన్నాయి గనుక.. సుప్రీంను పిలుద్దాం డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అనడమే

జ్ఞానం ఉన్న వాడికి ఏదైనా ఒక మాట చెప్పాలంటే చాలా భయం ఉంటుంది. తాను ఏం మాట్లాడినా సరే దానికి ఒక ఆధారం, నిరూపణ ఉండాలనే స్పృహ అతడిలో ఆ భయాన్ని పెంచుతుంది. అరకొర జ్ఞానం ఉన్నవాడు కూడా చాలా సందర్భాల్లో.. తాను చెప్పిన మాట నిజమో కాదో అనే మీమాంసలో పడుతుంటాడు. కానీ అలాంటివాటితో అవసరం లేని వ్యక్తి మాత్రం.. యథేచ్ఛగా ఏది పడితే అది మాట్లాడేయగలడు. తీర్మానాలు చేయగలడు, సిద్ధాంతాలు ప్రతిపాదించగలడు, సలహాలు ఇవ్వగలడు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యవహార సరళి గమనిస్తే అచ్చం అలాగే కనిపిస్తోంది.

రుషికొండలో జగన్ సర్కారు నిర్మించిన టూరిజం భవనాలను ఏం చేయాలనే విషయంలో చంద్రబాబునాయుడు సర్కారు మల్లగుల్లాలు పడుతుండగా.. అందుకు పవన్ కల్యాణ్ చెబుతున్న సలహాలు జనానికి విస్తుగొలుపుతున్నాయి. ఇంత చిత్రమైన సలహాలు పవన్ మాత్రమే ఇవ్వగలరేమో అనే అభిప్రాయం కలిగిస్తున్నాయి.

గురువారం నాడు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. రుషికొండ భవనాల విషయంలో నెలలోగా ఒక నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబునాయుడు ఈ భేటీ లో అన్నారు. మంత్రులందరూ ఆ భవనాలు సందర్శించి.. ఏం చేస్తే బాగుంటుందో ప్రతిపాదించాలని చంద్రబాబు సూచించారు. ఇంతలో పవన్ కల్యాణ్ మాత్రం.. ‘ఆ భవనాల్లో సుప్రీం కోర్టు బెంచ్ పెట్టాలని కేంద్రాన్ని కోరదాం’ అంటూ కొత్త ప్రతిపాదన చేశారు. పవన్ కల్యాణ్ మాటలకు మంత్రులు విస్మయానికి గురయ్యారు. రాష్ట్ర రాజధానిలో అయితే బెంచ్ ఇస్తారేమో గానీ.. అక్కడంటే సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించకపోవచ్చు.. అని అంటూ చంద్రబాబునాయుడు ఆ ప్రతిపాదనను సున్నితంగా పక్కకు నెట్టారు.

అయితే పవన్ కల్యాణ్ చేసిన ప్రతిపాదన ‘వెనకటికి ఒకడు నాడా దొరికింది గనుక.. గుర్రాన్ని కొనడానికి సిద్ధపడ్డాడన్న’ సామెత చందంగా ఉన్నదని పలువురు జోకులు వేసుకుంటున్నారు. ఏపీలో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి సుదీర్ఘకాలంగా ప్రతిపాదన ఉండి, దానికి సుప్రీం ఆమోదం కూడా ఉండి, ఇప్పుడు భవనాల గురించి వెతుకులాట జరుగుతున్న సమయంలో ఇలాంటి ప్రతిపాదన బాగుంటుంది గానీ.. ప్రభుత్వం వద్ద భవనాలు వృథాగా ఉన్నాయి కదాని.. వాటిని ఉపయోగించుకోవడం కోసం సుప్రీం కోర్టును వచ్చి ఇక్కడ బెంచ్ ఏర్పాటుచేయాలని కోరితే.. అది కామెడీగా, వెటకారంగా ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

రాష్ట్రానికి నిజంగానే సుప్రీం కోర్టు బెంచ్ తీసుకురావాలనే కోరిక ప్రభుత్వానికి బలంగా ఉన్నట్లయితే.. రాజధాని అమరావతి ప్రాంతంలోనే అందుకు స్థలం కేటాయిస్తామని ప్రతిపాదించి అడగవచ్చునని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అమరావతిలో హైకోర్టు ఉంది, కర్నూలులో బెంచ్ ఏర్పాటుచేయబోతున్నారు. సుప్రీంకోర్టు బెంచ్ అడగడం అధర్మం అనలేం గానీ.. భవనాలు వేస్టుగా ఉన్నాయి గనుక.. సుప్రీంను పిలుద్దాం డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అనడమే చిత్రంగా ఉన్నదని జనం నవ్వుకుంటున్నారు.

21 Replies to “ఇంత విచిత్రంగా పవన్ మాత్రమే అనగలరు!”

  1. idhi nothing, ja*** గతంలో చిన్నపిల్లల మీటింగ్ లో దుష్టచతుష్టయం, ముగ్గురు పెళ్ళాలు, వెంట్రుక కూడా పీకలేరు అని అత్యంత అసహ్యకరమైన భాష తో జుగుత్స్యకారంగా మాట్లాడాడు, ఇది జుజుబి!!

  2. ఒరేయ్ అవి టూరిస్ట్ భవనాలని ja*** ని బైబిల్ మీద ఒట్టు వేసి చెప్పమనరా ఎంకి !!

  3. Sare Reddy

    Ok Ok Ok

    asalu aa palace yendu kosam kattacharo nuvvu cheppu?

    ponele options kooda nene istha

    1. rastrapathi state ki vacchinappudu vundataniki
    2. Bill gates, Bill Clinton, Donald Trumph, elen musk lanti VVVIP’s kosam
    3. Peda Jagan, pedavari kosam
  4. వాళ్ళు మాట్లాడుకుంటుంటె.. నువ్వు సొఫా కింద కూర్చొని విన్నవా? ఫెకు వార్తలు వదిలి అసలు వార్తలు రాయరా!

    .

    మొన్న ప్రవీణ్‌ పగడలా విచరణ సరిగ్గ జరగటం లెదు అని మొరిగావ్! ఇది హొమె మినిస్తెర్ అనిత failure అన్నవ్! మరి ఈ వార్త రాయలీదు ఎమిటిరా??

    .

    Praveen Pagadala Wife: విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రవీణ్‌ మరణాన్ని వాడుకుంటున్నారు. తన భర్త మరణాన్ని రాజకీయం చేయొద్దంటూ పాస్టర్ పగడాల ప్రవీణ్‌కుమార్‌ భార్య జెస్సికా విజ్ఞప్తి చేశారు. ‘మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రవీణ్‌ మరణాన్ని వాడుకుంటున్నారు. యేసు మార్గాన్ని అనుసరించేవారు మతవిద్వేషాలు రెచ్చగొట్టరు. నా భర్త ప్రవీణ్‌ ఎప్పుడూ మతసామరస్యాన్ని కోరుకునేవారు. నా భర్త మరణంపై ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై పూర్తి నమ్మకం ఉంది.

    .

    ఈ వార్త రాయవారా GA???

  5. స్టీల్ ప్లాంట్ భూమిలో రాజధాని కడదాం అని ప్రపోసల్ పెట్టిన దాంతో పోలిస్తే ఇదెంత GA .

  6. జగన్ అసెంబ్లీ కి వచ్చి ఆ ప్యాలెస్ ఎందుకు కటించారో చెప్పాలి. అప్పుడు అలా ఉపయోగించవచ్చు.

  7. గ్రూప్ మీటింగ్స్ లో ఎవరి సజెషన్స్ వారు ఇస్తారు.. ఇందులో తప్పేముంది..

  8. మరి ఆ బంగళాలు ఎందుకోసం వాడుకోమంటావో సలహా పడేయరాదూ..

    విశాఖ టూరిష్టుల దగ్గర రూపాయి తీసుకుని 5 లక్షల కమోడ్ లో ఉచ్చా పోసుకొనే సౌకర్యం కల్పిద్దామా..?

    సముద్రపు అలల హోరులో.. 5 లక్షల కమోడ్ లో హాయిగా ఉచ్చా పోసుకొంటే.. కలిగే ఆ ఆనందం .. జస్ట్ ఒక్క రూపాయి మాత్రమే అని సాక్షి లో యాడ్లు ఇద్దామా..

  9. టూరిజం పాలస్ లో ముఖ్యమంత్రి కుటుంబం కాపురం పెట్టాలి…. అదే మనకి సరి అయిన ప్రతిపాదన….అది విచిత్రం గా ఉండదు…. సుప్రీమ్ కోర్ట్ బెంచ్ అంటే విచిత్రం, విస్మయం, కడుపు ఉబ్బరం చాలా సమస్యలు వస్తాయి

    1. బైక్ మీద వెళ్లి టోల్ గేట్ దగ్గర టోల్ ఫీస్ కట్టే తెలివి తేటలు ఒక్క ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి మాత్రమే సాధ్యం

  10. అవును మన అన్నియ్య చాలా ఆధారాలు పెట్టుకొని మాట్లాడతాడు కదా? 32 కమ్మ DSP లు అని ఇలా ఎన్నోన్నో…

Comments are closed.