ఆంధ్ర శశికళ అని ఫైర్ అవుతున్న క్యాడర్!

సజ్జల తమ పార్టీకి ఆంధ్ర శశికళ వలే తయారయ్యాడని, అతడిని పార్టీలో నుంచి బయటకు సాగనంపకపోతే నాయకులు ఎవరు పార్టీలో ఉండే పరిస్థితి లేదని వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ పార్టీలో సైరా అని ముద్దుగా పిలుచుకునే విజయసాయి రెడ్డి రాజ్యసభ సీటుకు రాజీనామా చేయడంతో పాటు రేపో మాపో పార్టీని వదిలి బయటకు వెళ్ళిపోతున్నాడనే వార్త, ఆ పార్టీ కార్యకర్తలంతా ఇప్పుడు నిస్తేజంలో మునిగిపోయారు. వైసీపీ పార్టీ గ్రౌండ్ లెవెల్ లో బలోపేతం కావడానికి మరియు, సోషల్ మీడియాలో క్యాడర్ ఉత్సాహంగా పనిచేయడానికి స్పూర్తినిస్తూ ప్రత్యర్థి పార్టీలకు ముచ్చెమటలు పట్టేలా చేయడంలో అతను నేర్పరి.

ఢిల్లీ లెవెల్ లో వైసీపీ పార్టీ తరుపున అన్ని తానై చక్కపెడుతూ, తాను కావాలనుకుంటే ఎప్పుడైనా ప్రధాని మోదీతో పాటు హోమ్ మంత్రి అమిత్ షాను కలవగలిగే అంత చనువున్న నాయకుడిని కోల్పోవడం వైసీపీ క్యాడర్ ఏ మాత్రం అంగీకరించే పరిస్థితులు కనపడటం లేదు.

దీని అంతటికి కారణం వైసీపీ పార్టీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణ రెడ్డి అని సోషల్ మీడియా వేదికగా వైసీపీ క్యాడర్ విమర్శలు గుప్పిస్తున్నారు. సజ్జల తమ పార్టీకి ఆంధ్ర శశికళ వలే తయారయ్యాడని, అతడిని పార్టీలో నుంచి బయటకు సాగనంపకపోతే నాయకులు ఎవరు పార్టీలో ఉండే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు నుంచి సజ్జల రామకృష్ణ రెడ్డి చేసే పనులు, అతడి నిర్వాకం వైసీపీ క్యాడర్ కు మింగుడుపడని విషయంగానే ఉంటూ వస్తుంది.

ఈరోజు మీడియా సమావేశంలో కూడా సజ్జల వలనే మీరు పార్టీని వీడుతున్నారన్న ప్రశ్నకు సాయిరెడ్డి సమాధానం చెబుతూ తన స్థాయిని ఎవరు తగ్గించలేరని అన్నారే తప్ప సజ్జల వలన తాను వైసీపీ పార్టీలో ఎటువంటి ఇబ్బంది పడలేదని మాత్రం చెప్పలేకపోయారు. వైసీపీ పార్టీలో సజ్జల, సాయిరెడ్డికి చాలా కాలంగా ఒకరంటే ఒకరికి పొసగదని, దీని వలన చాలా మంది నాయకులు ఇబ్బంది పడుతున్నారని, సాయిరెడ్డిపై కొంతమంది వైసీపీ అధినేత జగన్ దగ్గర లేనిపోనివి చెప్పి పొమ్మనలేక పొగపెట్టారన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి

గత వారం వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన వైసీపీ పార్టీ నాయకుడు రవిచంద్ర రెడ్డి కూడా గతంలో ఇదే సజ్జలపై ఆరోపణలు చేసి, అతని ఆగ్రహానికి గురై బాధతో పార్టీని విడిచి బీజేపీలో చేరవలసిన పరిస్థితి వచ్చింది. ఇన్ని జరుగుతున్నా ఎంత మంది సజ్జలపై ఆరోపణలు చేస్తున్నా వైయస్ జగన్ మాత్రం సజ్జలను మరింత అందలం ఎక్కించడానికి చూస్తున్నాడే తప్ప వైసీపీలో అలుముకున్న నిస్తేజాన్ని సరిచేసి ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకునే పని చేయడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు విజయసాయి రెడ్డి వైసీపీ విడిచి వెళ్లడంతో ఢిల్లీ లెవెల్ లో చక్రం తిప్పే నాయకుడు కరువయ్యాడని కచ్చితంగా చెప్పుకోవచ్చు. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీ స్థాయిలో ఎన్నో విషయాలలో లాబీయింగ్ చేసి జగన్ కు ఎంతో మేలు చేసారని, కానీ దీనిని జగన్ ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా సాయిరెడ్డి పార్టీని విడిచి వెళుతున్నా పోతే పోనిలే అనే రీతిలోనే అతనిని వదిలేసినట్లు ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తెలుస్తుంది.

బయటకు సాయిరెడ్డి తాను జగన్ కుటుంబానికి నమ్మిన బంటుని అంటూనే తనలో ఏదో తెలియని బాధ ఉన్నట్లు ఈరోజు అతడు మాట్లాడిన మాటలలో కనపడుతుంది. రాబోయే రోజులలో విజయసాయి రెడ్డి స్థానాన్ని భర్తీ చేసే అలాంటి నాయకుడిని తయారుచేసుకోవడం వైయస్ జగన్ కు కత్తి మీద సామే అని చెప్పుకోవచ్చు.

ఇన్ని రోజులు వైసీపీ పార్టీలో సజ్జల లాంటి కొంతమంది నేతల ఆగడాలను తప్పక భరిస్తూ వస్తున్న చాలా మంది నాయకులకు సాయిరెడ్డి ఒక దారి చూపించాడని, రాబోయే రోజులలో రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు, వైసీపీ తరపున గెలిచిన రాజ్యసభ సభ్యులంతా పార్టీని విడిచి వెళ్లడం ఖాయంగా కనపడుతుంది. జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి తప్ప రాబోయే రోజులలో ఒక్క రాజ్యసభ సభ్యుడు అయినా ఆ పార్టీలో మిగిలితే అది పెద్ద వింతగా చెప్పుకోవచ్చు.

ఈ ఆంధ్ర శశికళను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత త్వరగా వైసీపీ పార్టీలో నూతనుత్తేజం తీసుకురావచ్చని సోషల్ మీడియా వేదికగా వైసీపీ అభిమానులు వ్యాఖ్యలు చేస్తుండటం చూస్తుంటే, వైసీపీ పార్టీలో ప్రస్తుత పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పుకోవచ్చు. ఈ పరిణామాలను రాబోయే రోజులలో వైయస్ జగన్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.

21 Replies to “ఆంధ్ర శశికళ అని ఫైర్ అవుతున్న క్యాడర్!”

  1. జగన్ మింగిపోవడానికి మాజీ సకల శాఖా మంత్రే ప్రధాన కారణం.

  2. ఏందీ.. ఇప్పుడు ఫైర్ అవుతున్నారా..? అధికారం లో ఉన్న ఐదేళ్లు ఎవడి సంకలు నాకుతున్నారు..

    అప్పుడు ఇదే ఆంధ్ర శశికళ ..

    సీపీఎస్ విషయం లో జగన్ రెడ్డి కి తెలియకుండా హామీ ఇచ్చేసాడు అని మీ నాయకుడి డొల్లతనం బయట పెట్టేసినప్పుడు.. ఎందుకు ఫైర్ అవలేదు..?

    ప్రతి పరిపాలన విభాగం లో చేతులు పెట్టేసి.. ప్రెస్ మీట్ లకు కూడా వచ్చి.. సోల్లంతా వాగినప్పుడు .. ఎందుకు ఫైర్ అవలేదు..?

    ఒక సలహాదారుడు.. సీఎం అటెండ్ అవ్వాల్సిన ఉద్యోగుల సమస్యల మీటింగులకి కూడా అటెండ్ అవుతుంటే.. అప్పుడు ఎందుకు ఫైర్ అవలేదు..?

    ..

    మీకు మీకు మధ్య “సభ్య సమాజం సిగ్గుపడేటంతటి” అవగాహన ఉండి ఉండొచ్చు..

    కానీ ఆ దారిద్య్రాన్ని ప్రజల పరిపాలన విభాగం మీద రుద్దినప్పుడు ఎందుకు ఫైర్ అవలేదు..?

    జగన్ రెడ్డి ఒక నీచుడు.. అతని ఓటమి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఛాయస్ కాదు.. అవసరం.. అందుకే చిత్తు చిత్తు గా ఓడించారు..

    ..

    ఏ పార్టీ లో అయినా.. తప్పు ఎవరు చేసినా.. దానికి నాయకుడే బాధ్యత వహించాలి..

    డెడ్ బాడీ ని హోమ్ డెలివరీ చేసినప్పుడు .. గోరంట్ల మాధవ్, అనంత బాబు న్యూడ్ వీడియోస్ వదిలినప్పుడు.. ఏమైంది జగన్ రెడ్డి నాయకత్వం..

    ..

    జగన్ రెడ్డి చేతకానితనాన్ని ఎవడో ఒకడి మీద తోసేసి.. సింగల్ సింహం అని భజన చేయించుకుంటే.. పార్టీ పరిస్థితి ఇలానే ఏడుస్తుంది..

  3. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  4. తన ఓఫీస్ లో ఆడవాళ్ళ ఇంట్లో కి వెళ్లిన టీడీసీ చంద్ర శేఖర్ రెడ్డి వెళ్లి ప్యాలస్ లో A1 రూమ్ లో దక్కున్నాడు, వాడికి వైన్ పోస్టినరు అంట అక్కడ

  5. విజయ సాయి వైవ హారం. రిజేయున్. అన్ని. జగన్ కన్ను సాన్నల్లో జరుగుతున్న ఎవ్వరాలు ఎవడు ఎక్సైట్ అవ్వొద్దు ఇదొక ఫ్రెండ్లీ మ్యాచ్. నిన్న అన్న ఇంటర్వ్యూ చూసాక అర్థం అయింది

  6. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  7. Jeggulu and Sajjalu are మంచం మేట్స్ అంటారు.. తనలో సగం ఐన వాణ్ని బైటకి పంపే ఛాన్సె్ లేదు..

    ఉంటే ఉండండి లేకపోతే పోండి..

    ఎవరు వాళ్ళని విడదీయలేరు

  8. అంటే ఇవన్నీ తెలుసు కోలేని అవివేకి మన అన్న అని అంటున్నారా???ఏదో లంకె ఉంటుంది ….

  9. కలెక్ట్ చేసిన ప్రతి పైసా లెక్క సజ్జల దగ్గరుంది.ఇతన్ని వదులుకుంటే కష్టం.జగన్ డబ్బుని మాత్రమే నమ్ముకున్నాడు,ప్రజలను,క్యాడర్ ను కాదు.

    అందుకే పైసా లెక్క తెలిసిన సజ్జలను జగన్ వసులుకొడు.

  10. Sajjala is just name sake, whatever he does is what Bharathi wants or likes. He is just the face of Bharathi. Aatalo arati pandu. If anybody thinks he is acting independently they are in fools paradise. Athaniki antha scene ledu.

    He is still there because of Bharathi Reddy. He will be there till Jagan and Bharathi stay together.

Comments are closed.