Advertisement

Advertisement


Home > Politics - Gossip

సీమలో జనసేన అభ్యర్థులు అలా చేశారా!

సీమలో జనసేన అభ్యర్థులు అలా చేశారా!

రాయలసీమలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కలిపి జనసేన అధిపతి పవన్‌కల్యాణ్‌ ఎన్నికల ప్రచారం చేసిన నియోజకవర్గాలు ఎనిమిది మాత్రమే! ఎన్నికల వేళ పవన్‌ కల్యాణ్‌ సీమలో అంతాకలిపి ఎనిమిది నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచార సభలు నిర్వహించారు!

మరి అంతకు ముందు ఏమైనా పవన్‌ కల్యాణ్‌ రాయలసీమ అంతా కలియదిరిగారా, పార్టీ బలోపేతానికి పర్యటనలు ఏమైనా చేపట్టారా.. అంటే అదేమీలేదు. ఆ ఎనిమిది నియోజకవర్గాలను మినహయించి పవన్‌ కల్యాణ్‌ అంతకుముందు ఆరేడు నెలల్ల్లో ఏ నియోజకవర్గానికి కూడా వెళ్లలేదు. ఆ ఎనిమిది సీట్లలోనూ జనసేనకు కాస్త శక్తి ఉన్న అభ్యర్థులు నిలబడ్డారు. వారు పట్టుబట్టి పవన్‌ను ప్రచారానికి తెచ్చుకున్నట్టుగా ఉన్నారు. అయితే ఆ నియోజకవర్గాలుకు పవన్‌ కల్యాణ్‌ ప్రచారానికి వచ్చి వెళ్లిన తర్వాతే కథ మారిందట.

పవన్‌ ప్రచార సభలు ఆయాచోట్ల అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. ఓటు హక్కు వయసు కూడా లేని పిల్లలు అక్కడికి వచ్చి చిందులు వేయడమే తప్ప.. పవన్‌ ఆ నియోజకవర్గాలకు వచ్చినప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందనా కనిపించలేదు. దీంతో అభ్యర్థులకు అసలు విషయం అర్థం అయ్యిందని, అక్కడ నుంచి.. వారు ఎన్నికల ప్రచార ఖర్చులు పెట్టడం కూడా ఆపేశారని క్షేత్రస్థాయి పరిస్థితిని గమనించిన వారు చెబుతున్నారు.

డిగ్రీ, బీటెక్ యువకుల్లో బెట్టింగ్ జాడ్యం..

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?