బాబు ఖాతాలో మిగిలింది బైడెన్ మాత్రమే

ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాల్ని మోహరించాలని రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రికి చంద్రబాబు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖలపై తనదైన శైలిలో స్పందించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సందర్భం…

ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాల్ని మోహరించాలని రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రికి చంద్రబాబు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖలపై తనదైన శైలిలో స్పందించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సందర్భం దొరికితే బాబును చెడుగుడు ఆడుకోవడానికి ఏమాత్రం మొహమాటపడని విజయసాయి.. ఈసారి బాబుపై కాస్త గట్టిగానే పంచ్ లు వేశారు.

“చంద్రబాబు రాష్ట్రపతికి, కేంద్ర హోం మంత్రికి లేఖలు రాశాడు. పిచ్చి ముదిరి జో బైడెన్, పుతిన్ కు కూడా ఉత్తరాలు రాస్తాడు. ఈసారి కేంద్ర బలగాలు కాదు, అమెరికా సైన్యం, ఐకాస శాంతి దళం పంపాలని కోరతాడు. చివరకి చిత్తుగా  ఓడింది టీడీపీ కాదు, ప్రజలే అంటూ తృప్తి పడతాడు.”

ఇలా బాబుపై అల్టిమేట్ పంచ్ పేల్చారు విజయసాయి. గ్రామ పంచాయితీ ఎన్నికల సమయంలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందువల్ల కేంద్ర బలగాల మోహరింపు చాలా ముఖ్యమని ఆరోపించిన చంద్రబాబు వ్యాఖ్యల్ని ఇలా సెటైరిక్ గా తిప్పికొట్టారు. ప్రస్తుతానికైతే బాబు ఖాతాలో మిగిలింది ఐరాస శాంతిదళం మాత్రమేనంటూ చురకలంటించారు.

చంద్రబాబు అప్పర్ కంపార్ట్ మెంట్ (మెదడు) ఎప్పుడో పోయిందంటూ పంచ్ వేసిన విజయసాయి, బాబుకు పిచ్చి బాగా ముదిరిందన్నారు. గొలుసులతో కట్టేసే పరిస్థితి తెచ్చుకోవద్దంటూ జోకులేసిన విజయసాయి..  పచ్చ తమ్ముళ్లకు చంద్రబాబు ఆరోగ్యంపై ఏమాత్రం శ్రద్ధ లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

పక్కవాళ్ల మీద పడి ఏడవడం చంద్రబాబుకు అలవాటే

పోస్కోకు, సీఎం జగన్‌కు ఎలాంటి సంబంధంలేదు