Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పార్టీలే పార్టీలు

పార్టీలే పార్టీలు

సినిమా జనాలు క్రిస్మస్ రోజున పార్టీల్లో మునిగి తేలారు. అన్ని పార్టీల కన్నా రెండు పార్టీలు కీలకమైనవి. వాటిల్లో ఒకటి ధృవ డైరక్టర్ సురేందర్ రెడ్డి స్వయంగా ఇచ్చిన పార్టీ. ధృవ హిట్ అయిన సందర్భంగా, యాభై కోట్ల షేర్ వచ్చిన సందర్భంగా ఆయన తన సర్కిల్ జనాలందరికీ మాంచి పార్టీ ఇచ్చారని తెలుస్తోంది. 

అలాగే రామ్ చరణ్ భార్య ఉపాసన మరో పార్టీని హోస్ట్ చేసారు. క్రిస్మస్ సందర్భంగా ఆమె ఈ పార్టీ ఏర్పాటు చేసారు. సినిమా వాళ్ల కన్నా, హైదరాబాద్ బిజినెస్ సర్కిళ్లలోని హై ఫై జనాలంతా ఈ పార్టీకి హాజరయినట్లు తెలుస్తోంది. 

ఇక సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమా బి సి సెంటర్లలో వీకెండ్ లో మంచి కలెక్షన్లు నమోదు చేసినందుకు సప్తగిరి ఓ పార్టీ ఇచ్చారు. మీడియా జనాలందరినీ ఈ పార్టీకి ప్రత్యేకంగా పిలిచారు. 

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?