ప్రభుదేవా, నయన మళ్ళీ కలుస్తున్నారా.?

ప్రభుదేవా, నయనతార.. ఇద్దరూ పెళ్ళిపీటలెక్కడానికి సిద్ధమయ్యారు ఒకప్పుడు. ఏమయ్యిందో.. ఇద్దరి మధ్యా దూరం పెరిగింది. ప్రభుదేవా కోసమే మతం మార్చుకున్న నయనతార, ఇప్పుడు ప్రభుదేవా పేరు చెబితే కస్సుమంటోంది. కారణాలు ఏంటన్నవి ఎవరికీ తెలియడంలేదు…

ప్రభుదేవా, నయనతార.. ఇద్దరూ పెళ్ళిపీటలెక్కడానికి సిద్ధమయ్యారు ఒకప్పుడు. ఏమయ్యిందో.. ఇద్దరి మధ్యా దూరం పెరిగింది. ప్రభుదేవా కోసమే మతం మార్చుకున్న నయనతార, ఇప్పుడు ప్రభుదేవా పేరు చెబితే కస్సుమంటోంది. కారణాలు ఏంటన్నవి ఎవరికీ తెలియడంలేదు ఎవరికీ.

అయితే తాజాగా ప్రభుదేవా, నయనతారల మధ్య స్నేహం మొదలైందంటూ ప్రచారం జోరందుకుంది. ఈ వార్తల్లో నిజానిజాలెంతోగానీ, నయనతారని బాలీవుడ్‌కి పరిచయం చేయాలని ప్రభుదేవా అనుకుంటున్నాడనీ, నయనతార కూడా బాలీవుడ్‌పై ఆసక్తిగా వుండడంతో.. ఇద్దరూ ఈ మధ్య కలుసుకున్నారనీ గుసగుసలు గుప్పుమంటున్నాయి తమిళ సినీ వర్గాల్లో.

నయనతార కూడా ఇకపై బాలీవుడ్‌లోనూ సినిమాలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి గతంలోనే నయనతారని బాలీవుడ్‌కి పరిచయం చేయాలని ప్రభుదేవా అనుకున్నాడు. అప్పుడు కుదరలేదు, ఇప్పుడేమన్నా నయనతార ` ప్రభుదేవా కారణంగా బాలీవుడ్‌కి వెళ్తుందేమో చూడాలి. బాలీవుడ్‌లో ప్రభుదేవా ప్రముఖ దర్శకుడిగా ఎదిగిన దరిమిలా.. ఆయన తలచుకుంటే బాలీవుడ్‌లో నయనతార హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

ఇదిలా వుంటే, ప్రభుదేవాకన్నా ముందు నయనతారతో ప్రేమాయణం నడిపిన శింబు కూడా, ఇప్పుడామెకు దగ్గరవుతున్నాడంటూ తమిళ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఈ గాసిప్స్‌ ఇంత ఉధృతంగా ఇప్పుడెందుకు షురూ అవుతున్నాయో మరి. అన్నట్టు, నయనతార వీటిపై ఇంకా స్పందించాల్సివుంది.