Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రవితేజ-కళ్యాణ్ రామ్ దూరం దూరం

రవితేజ-కళ్యాణ్ రామ్ దూరం దూరం

సమస్యలు ఏమొచ్చాయో తెలియదు..దూరం ఏ మేరకు పెరిగిందో తెలియదు. కానీ ఇద్దరూ కాస్త ఎడమొహం, పెడమొహంగానే వున్నారు. ఇదంతా కిక్ 2 సంగతి.

ఈ సినిమాకు నిర్మాత కళ్యాణ్ రామ్. తాను హీరో అయి వుండీ, రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా నిర్మించాడు. సుమారు 40 కోట్లు ముందు వెనుక చూసుకోకుండా ఖర్చు చేసేసాడు. రవితేజ మార్కెట్ తో చూసుకుంటే ఇది చాలా ఎక్కువ.

ఆ సంగతి అలా వుంచితే, ఈ నేపథ్యంలో దర్శకుడు సురేందర్ రెడ్డితో కాస్త విబేధాలు వచ్చాయని వార్తలు గుప్పు మన్నాయి. దీంతో రవితేజ కూడా కిక్ 2 పట్ల అనాసక్తిగా వున్నాడనీ తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న (శుక్రవారం) రాత్రి పార్క్ హయాత్ లో కిక్ 2 అడియో ఫంక్షన్ జరిగింది. సాధారణంగా ఇలాంటి ఫంక్షన్ లో ఓ రేంజ్ వారంతా ఓ తరహా ఇంటిమసీతో వుంటారు. కానీ కళ్యాణ్ రామ్ ఒంటరిగా కూర్చున్నారు. పక్కన బాబాయ్ రామకృష్ణ మాత్రం వున్నారు.

ఆలస్యంగా వచ్చిన హీరో రవితేజ, కళ్యాణ్ రామ్ పక్కన ఖాళీగా వున్నా కూర్చోకుండా, వెళ్లి కథకుడు వక్కతం వంశీ పక్కన కూర్చున్నారు. రవితేజ అలా కూర్చోగానే కళ్యాణ్ రామ్ ఇలా లేచి బయటకు వెళ్లిపోయారు. స్టేజ్ మీదకు పిలిచినపుడు మాత్రమే వస్తూ,పోతూ కాలక్షేపం చేసారు.

వేదికపై సురేందర్ రెడ్డి, కళ్యాణ్ రామ్ ఇద్దరూ వున్నా కూడా మధ్యలో పలకరింపులు లేవు. ఎవరికైనా ఇద్దరూ కలిసి మెమెంటో ఇవ్వాలన్నపుడు ఆయనతో తీసుకోమని ఈయన, ఈయనతో తీసుకోమని ఆయన వచ్చిన వాళ్లని అటు ఇటు నెట్టడమే కానీ, వీళ్లు భుజం భుజం కలుపుకోవడం కనిపించలేదు. రవితేజ కూడా ముక్తసరిగా రెండు ముక్కలు మాట్లాడారంతే. అది కూడా చివర్న. అంతవరకు అన్ని కార్యక్రమాలు కళ్యాణ్ రామ్ నే నిర్వహించుకున్నారు.

స్టేజ్ మీద ఏం జరుగుతోందో అన్నది కూడా పట్టించుకోకుండా,  రవితేజ పక్కన వున్నవారితో మాట్లాడడంలోనే బిజీగా వున్నారు తప్ప, ప్రోగ్రామ్ ను చూసినట్లు పెద్దగా కనిపించలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?