సరైనోడు కు రాజసింహ చేయూత?

డైరక్టర్ లు టాప్ రేంజ్ కు వెళ్తున్న కొద్దీ బిజీ అయిపోతారు.. ప్రాజెక్టులు సెట్ చేసుకోవడం, కాంబినేషన్లు వెదుక్కోవడం.. ఇంకా ఇతరత్రా పనుల్లో బిజీ అయిపోతారు. అవకాశాలు వస్తాయి.. టైమ్ తక్కువ వుంటుంది.. అందకే…

డైరక్టర్ లు టాప్ రేంజ్ కు వెళ్తున్న కొద్దీ బిజీ అయిపోతారు.. ప్రాజెక్టులు సెట్ చేసుకోవడం, కాంబినేషన్లు వెదుక్కోవడం.. ఇంకా ఇతరత్రా పనుల్లో బిజీ అయిపోతారు. అవకాశాలు వస్తాయి.. టైమ్ తక్కువ వుంటుంది.. అందకే ఘోస్ట్ లు అవసరం అవుతారు. అప్ కమింగ్ రైటర్లు వుంటారు. వీళ్లకు మొహమాటాలు ఎక్కువ వుంటాయి. నలుగురికి నాలుగు పనులు చేసి, మంచి అనిపించుకుంటూ, వీళ్లకూ టైమ్ వస్తుంది. ఇది టాలీవుఢ్ లో కామన్ థింగ్.

అందుకే చాలా మంది పెద్ద డైరక్టర్లు కానీ, మ్యూజిక్ డైరక్టర్లు కానీ, సరైన అసిస్టెంట్ లు వెళ్లిపోయాక, ఇక ఫ్లాపుల బాటన పట్టిన ఉదంతాలు ఎన్నో. జనం ఈ సంగతి తెలియక.. ఒకప్పుడు మంచి సినిమాలు తీసాడు.. మంచి డైలాగులు రాసాడు.. మంచి పాటలు చేసాడు.. ఇప్పుడేంటీ ఇలా అనుకుంటారు.

సరే, ఇప్పుడు ఇంతకీ విషయం ఏమిటంటే.. సరైనోడు లైన్ విని బన్నీ, అరవింద్ హ్యాపీగా బోయపాటికి అవకాశం ఇచ్చారు. కానీ సినిమా స్క్రిప్ట్ మాత్రం ఎంతకీ లాక్ కాలేదు. ముఖ్యంగా సెకండాఫ్ విషయమై కిందా మీదా పడ్డారు. ఇలాంటి టైమ్ లో ఇప్పుడు ఫస్ట్ సినిమా చేస్తున్న రైటర్ రాజ సింహ, ఆదుకున్నాడని వినికిడి. సరైనోడుకు ఓ వెర్షన్ మొత్తం అతనే రాసి ఇచ్చాడని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇతగాడు ప్రస్తుతం సందీప్ కిషన్ తో ఒక్క అమ్మాయి తప్ప సినిమా చేస్తున్నారు.

సినిమా ప్రథమార్థం అంతా ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ తో నడుస్తుందని దానికి రాజసింహ హ్యాండ్ వుండడమే కారణమని తెలుస్తోంది. ఎందుకంటే బోయపాటి ఎంటర్ టైన్ మెంట్ పార్ట్ కన్నా ఎమోషనల్ పార్ట్ బాగా డీల్ చేస్తారు. సెకండాఫ్ అంతా బోయపాటి స్టయిల్ లో వుంటుందని వినికిడి.

ఈ వార్తలు, వదంతులు అన్నీ సరైనివా కాదా అన్నది సరైనోడు వస్తే తెలిసి పోతుంది.