Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వచ్చే సమ్మర్ లో పవన్-త్రివిక్రమ్?

వచ్చే సమ్మర్ లో పవన్-త్రివిక్రమ్?

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్.. ఆ కాంబినేష్ ఇచ్చే కిక్కే వేరప్పా.. అందుకే మళ్లీ మరోసారి ఆ కాంబినేషన్ వచ్చే ఏడాదిలో రిపీట్ అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరూ వేరు వేరు సినిమాల మీద బిజీగా వున్నారు. ఎస్ జె సూర్యతో పవన్ చేస్తున్న సినిమా ఈ ఇయర్ ఎండ్ కు పూర్తి అవుతుంది. అలాగే త్రివిక్రమ్ కనుక తమిళ సూపర్ స్టార్ సూర్యతో చేయబోయే సినిమా స్టార్ట్ చేస్తే, అది కూడా వచ్చే ఇయర్ ఫస్ట్ క్వార్టర్ నాటికి పూర్తయిపోతుంది. 

అప్పుడు పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అవుతుందని తెలుస్తోంది. ఈ ఇద్దరికీ అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాత వుండనే వున్నారు. అదే మైత్రీ మూవీస్ సంస్థ. ఈ సంస్థ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ నిర్మిస్తోంది. అది పూర్తి కాగానే ఈ అక్టోబర్ తరువాత రామ్ చరణ్ - సుకుమార్ లతో సినిమా స్టార్ట్ చేస్తుంది. ఆ సినిమా కూడా వచ్చే ఫిబ్రవరి నాటికి అయిపోతుంది. 

సో..ఈ సంస్థ మూడో సినిమాకు టైమ్ వస్తుంది. అప్పుడు త్రివిక్రమ్-పవన్-మైత్రీ సినిమా షురూ కావడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లోగా పవన్ మనసు మారకపోతే..?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?