రామ్ చరణ్ ఛలో మైసూరు

ఎప్పటి నుంచో వార్తల్లో వున్న రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమా వచ్చే నెలాఖరు నుంచి సెట్ మీదకు వెళ్లబోతోంది. తొలి షెడ్యూలు మైసూరులో వుంటుంది. మైసూరు లో పదిహేను రోజులు షూట్ చేసిన తరువాత…

ఎప్పటి నుంచో వార్తల్లో వున్న రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమా వచ్చే నెలాఖరు నుంచి సెట్ మీదకు వెళ్లబోతోంది. తొలి షెడ్యూలు మైసూరులో వుంటుంది. మైసూరు లో పదిహేను రోజులు షూట్ చేసిన తరువాత యూనిట్ హైదరాబాద్ వస్తుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో భారీ సెట్ వేయాల్సి వుంది. అ దిశగా పనులు జ‌రుగుతున్నాయి. ఉప్పెన సినిమా తరువాత నుంచీ ఈ ప్రాజెక్ట్ మీదే వుండిపోయారు దర్శకుడు బుచ్చిబాబు. ఇప్పటికి రెండో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతోంది.

రంగస్థలం తరువాత రామ్ చరణ్ చేస్తున్న నేటివ్ సినిమా ఇది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో అల్లుకున్న ఓ స్పోర్ట్స్ డ్రామా అధారంగా తీస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్. ఈ సినిమా మీద రామ్ చర‌ణ్‌ కూడా చాలా అసక్తిగా వున్నారు. ఈ సినిమా తరువాత మళ్లీ సుకుమార్ తో సినిమా చేయబోతున్నారు. అంటే బ్యాక్ టు బ్యాక్ గురుశిష్యులతో చేస్తారన్న మాట.

రెహమాన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే మూడు పాటలు రికార్డ్ చేసారు. ఈ సినిమా కోసం ఓ డిఫెరెంట్ లుక్ ను రామ్ చరణ్ ట్రయ్ చేయబోతున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కిలారు సతీష్ నిర్మిస్తున్న ఈ సినిమాను మైత్రీ సంస్థ సమర్పిస్తోంది.

4 Replies to “రామ్ చరణ్ ఛలో మైసూరు”

Comments are closed.