Advertisement

Advertisement


Home > Movies - Movie News

స్పీడ్ పెంచిన మెగా హీరో

స్పీడ్ పెంచిన మెగా హీరో

చిత్రలహరి లాంటి సక్సెస్ తర్వాత కూడా సాయి తేజ్ పెద్దగా చప్పుడు చేయలేదు. మారుతి దర్శకత్వంలో ప్రతి రోజూ పండగే అనే సినిమా చేస్తున్న ఈ హీరో, ఇన్నాళ్లకు ఒకేసారి 2 సినిమాల్ని ఓకే చేశాడు. వీటిలో ఒక సినిమాను కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ చేయబోతున్నాడు.

ఇప్పటివరకు కెరీర్ లో కొత్త దర్శకుడ్ని పరిచయం చేయడం లాంటి పనులు పెట్టుకోలేదు సాయితేజ్. తొలిసారిగా సుబ్బు అనే వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా చేయబోతున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా. గతంలో ఉయ్యాల జంపాల, మజ్ను లాంటి సినిమాలకు ఇతడు పనిచేశాడు.

కొత్త దర్శకుడితో పాటు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సాయి తేజ్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాబోతోంది ఈ సినిమా. ఆశ్చర్యంగా ఇది కూడా రొమాంటిక్ కామెడీ సినిమానే. చూస్తుంటే సాయితేజ్ కొన్నాళ్ల పాటు యాక్షన్ కథల్ని పక్కనపెట్టినట్టు కనిపిస్తోంది.

మారుతి డైరక్షన్ లో చేస్తున్న ప్రతి రోజూ పండగే సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఈ రెండు సినిమాల్ని సైమల్టేనియస్ గా స్టార్ట్ చేయాలని సాయితేజ్ భావిస్తున్నాడు. ప్రస్తుతం రాశీ ఖన్నాతో కలిసి నటిస్తున్న ఈ హీరో, తన రెండు సినిమాలకు ఇంకా హీరోయిన్లను ఫిక్స్ చేయలేదు.

సీమ టీడీపీ నేతలు.. సద్దు చేయడం లేదు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?