విపక్షాలకు ‘ఒక్క వెంట్రుక’ కూడా దొరకదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ 2 రోజులు జరిగిన 2 సభల్లో.. విపక్షాలపై విరుచుకుపడ్డారు జగన్. 'వెంట్రుక కూడా పీకలేరు' అనే పదప్రయోగాన్ని…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ 2 రోజులు జరిగిన 2 సభల్లో.. విపక్షాలపై విరుచుకుపడ్డారు జగన్. 'వెంట్రుక కూడా పీకలేరు' అనే పదప్రయోగాన్ని వాడారు. దీంతో ప్రతిపక్షాలు గింజుకున్నాయి. లోకేష్ అయితే కౌంటర్ ఇవ్వలేక బొక్కబోర్లాపడిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడీ అంశంపై విజయసాయిరెడ్డి స్పందించారు. ప్రతిపక్షాలకు మరింత గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

“2024 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం ఖాయమని పసిగట్టే…ఏకం కావాలి, ఓట్లు చీలకూడదని పదేపదే అంటున్నాయి విపక్షాలు. రెండేళ్లలో ఒక్క వెంట్రుకైనా పీకాలని పచ్చ కుల మీడియాతో కలిసి 'క్షుద్రప్రచారం' చేస్తున్నాయి. కానీ క్షుద్ర పూజలు చేయడానికి  అవసరమయ్యే వెంట్రుక దొరకడం కష్టం.”

ఇలా జగన్ డైలాగ్ ను సమర్థిస్తూ, ప్రతిపక్షాలపై తిరుగులేని పంచ్ వేశారు విజయసాయిరెడ్డి. ముఖ్యమంత్రి డైలాగ్ తో పచ్చ'కుల' మీడియాకు ఏం చేయాలో పాలుపోవడం లేదని.. లోకేష్ అయితే కిందామీద పడుతున్నారని ఎద్దేవా చేశారు విజయసాయి.

“పప్పూ!…నువ్వే ఒక బొచ్చు పీకిన బ్రాయిలర్  కోడిలాంటివాడివి. నువ్వు మళ్ళీ ఈకలు పీకుతానంటూ మూర్ఖుడిలా మాట్లాడుతున్నావు. దుష్టులు, దుర్మార్గులు కలిసినా నా తల వెంట్రుక కూడా పీకలేరని సీఎం గారు అంటే అది నీకూ, మీ పచ్చ'కుల' మీడియాకి మింగుడుపడటం లేదా?”

ఇలా పంచ్ ల మీద పంచ్ లు వేశారు విజయసాయి. ఇప్పటికే అందరి జాతకాలు తేలిపోయాయని, మరో రెండేళ్లు గడిస్తే రాష్ట్రానికి పట్టిన పప్పు, తుప్పు వదిలిపోతాయని కామెంట్ చేశారు.